ప్రతిభ ఉన్నా.. ప్రోత్సహించేవారు లేరు!
ప్రస్తుతం చదువుతో పాటు క్రీడలకు చాలా ప్రాముఖ్యం ఇస్తున్నారు. పాఠశాల, కళాశాలల్లో విద్యార్థులు క్రీడల్లో రాణించడానికి ప్రభుత్వం వ్యాయామ ఉపాధ్యాయులు, అధ్యాపకులను నియమిస్తుంది.
జూనియర్ కళాశాలల్లో భర్తీ కాని పీడీ పోస్టులు
న్యూస్టుడే, ఇబ్రహీంపట్నం
ప్రభుత్వ జూనియర్ కళాశాల
ప్రస్తుతం చదువుతో పాటు క్రీడలకు చాలా ప్రాముఖ్యం ఇస్తున్నారు. పాఠశాల, కళాశాలల్లో విద్యార్థులు క్రీడల్లో రాణించడానికి ప్రభుత్వం వ్యాయామ ఉపాధ్యాయులు, అధ్యాపకులను నియమిస్తుంది. కాగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకులు లేకపోవడంతో విద్యార్థులు క్రీడలకు దూరంగా ఉంటున్నారు. చాలా మంది విద్యార్థులు పాఠశాల స్థాయిలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించినా కళాశాలలో తగిన ప్రోత్సాహం లేకపోవడంతో ఇక్కడే ఆగి పోతున్నారు.
మంజూరైనా భర్తీ కావడం లేదు..
జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 15 ఉన్నాయి. ఇందులో కేవలం 10 కళాశాలల్లోనే వ్యాయామ అధ్యాపకుడి పోస్టులు మంజూరు ఉండగా మిగిలిన 5 కళాశాలలకు పీడీ పోస్టులు లేవు. పీడీ పోస్టులు మంజూరు ఉన్న కళాశాలల్లో జిల్లాలో ఒక్కటి కూడా భర్తీ చేయలేదు. జగిత్యాల బాలికల జూనియర్ కళాశాల, కోరుట్ల బాలుర జూనియర్ కళాశాల, ఇబ్రహీంపట్నం, కథలాపూర్, మల్యాల, రాయికల్, సారంగపూర్, బీర్పూర్, మల్లాపూర్, గొల్లపల్లి జూనియర్ కళాశాలలకు పీడీ పోస్టులు ఉన్నప్పటికి భర్తీ కావడం లేదు. కోరుట్ల బాలికల జూనియర్ కళాశాల, జగిత్యాల జూనియర్ కళాశాల, మెట్పల్లి, ధర్మపురి, కొడిమ్యాల కళాశాలలకు పీడీ పోస్టులు మంజూరు లేవు. కళాశాలల్లో విద్యార్థులకు చదువుతో పాటు వ్యాయామ విద్య అవసరం. చదువుతో ఒత్తిడికి గురయ్యే వారు క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరకంగా ఎంతో దృఢంగా తయారవుతారు. పాఠశాల స్థాయిలోనే క్రీడలపై పట్టు సాధించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారు ఉన్నారు. వారికి కళాశాలల్లో ప్రోత్సహించే వారు లేకపోవడంతో క్రీడా జీవితం ముందుకు సాగడం లేదు. ఆసక్తి ఉన్న విద్యార్థులకు నిత్యం క్రీడలను సాధన చేయిస్తే వారు మరింతగా రాణించే అవకాశం ఉంది.
విద్యార్థి పేరు శరణ్య. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. పాఠశాలలో చదివే సమయంలో పరుగు పోటీల్లో రాష్ట్ర స్థాయి వరకు వెళ్లింది. పదో తరగతి పూర్తయిన తర్వాత జూనియర్ కళాశాలలో చేరగా వ్యాయామ అధ్యాపకుడు లేకపోవడంతో ఆటలకు దూరంగా ఉంటుంది. ఈ పరిస్థితి శరణ్య ఒక్కరిదే కాదు. చాలామంది విద్యార్థులు పాఠశాల స్థాయిలో వారికి నచ్చిన క్రీడల్లో రాణించగా కళాశాలకు వచ్చే సరికి ప్రోత్సాహం లేక రాణించలేకపోతున్నారు.
పీడీని నియమించాలి: గణేష్, విద్యార్థి, ఇబ్రహీంపట్నం
మా కళాశాలలో వ్యాయామ అధ్యాపకుడి పోస్టు ఖాళీగా ఉంది. పీడీ లేకపోవడంతో మేము క్రీడలకు దూరంగా ఉంటున్నాం. పీడీ ఉంటే ఆటలను ఆడించి, జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించేలా ప్రోత్సహిస్తారు.
త్వరలో వచ్చే అవకాశం: - నారాయణ, నోడల్ అధికారి
జిల్లాలోని కళాశాలల్లో వ్యాయామ అధ్యాపకుల పోస్టుల భర్తీ గురించి ప్రభుత్వానికి నివేదించాం. ప్రస్తుతం ఉద్యోగ నియామకాల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించగా, త్వరలో పీడీ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి