Crime News: ఎందుకు చంపావ్ నాన్నా?
పెళ్లికి పోయొద్దాం బిడ్డా అంటే.. ఎంతో ఆనందపడితిమి.. వెళ్లేటప్పుడు ఎన్నో ముచ్చట్లు చెబితివి.. విందులో కొసరి కొసరి తినిపిస్తివి.. ఇంతలో ఏమైంది నాన్నా.. మమ్మల్ని ఇలా బావిలో తోసేస్తివి..
న్యూస్టుడే, మేడిపల్లి, జగిత్యాల గ్రామీణం
మధుమిత, ప్రణిత్య
పెళ్లికి పోయొద్దాం బిడ్డా అంటే.. ఎంతో ఆనందపడితిమి.. వెళ్లేటప్పుడు ఎన్నో ముచ్చట్లు చెబితివి.. విందులో కొసరి కొసరి తినిపిస్తివి.. ఇంతలో ఏమైంది నాన్నా.. మమ్మల్ని ఇలా బావిలో తోసేస్తివి.. అప్పటివరకు మాతో ఆనందంగా గడిపిన నీకు మమ్మల్ని చంపాలని ఎందుకు అనిపించింది.. నా ముద్దుల పట్టీలు అంటూ గారాం చేసేవాడివి.. పెద్ద స్థాయికి చేరుకుంటరని అందరికీ చెబుతుండే నువ్వేనా.. ఈ పని చేసింది.. నీళ్లలో పడేసి పైన నువ్వేమి ఆలోచిస్తున్నవో కాని.. ఊపిరాడక మేం ఇక్కడ సతమతవుతున్నాం.. నువ్వు.. అమ్మ.. అక్క గుర్తుకొస్తున్నారు.. ఆర్థిక సమస్యలు.. బలహీన క్షణాలు నిన్ను ఈ పని చేసేలా చేయొచ్చు.. కానీ నిండు ప్రాణాలు పోయినంత మాత్రాన సమస్యలు దూరమవుతాయా.. మమ్మల్ని బాగా చదివిస్తే మేమే మీకు దన్నుగా ఉండేవాళ్లం.. నీ కష్టాలను తీర్చేవాళ్లం.. ఇలాంటి అన్యాయం ఇంకెవరికీ జరగొద్దు నాన్నా.. అయిపోయింది నాన్నా.. మేమింక ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోతున్నాం.. (జగిత్యాల జిల్లా నర్సింగాపూర్లో జలపతిరెడ్డి అనే వ్యక్తి ఇద్దరు కుమార్తెలను బావిలో తోసేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.. చనిపోయే ముందు ఆ చిన్నారులు పడిన ఆవేదన ఇలా ఉంటుందన్న దానికి అక్షర రూపమే ఇది.)
రోదిస్తున్న జలపతిరెడ్డి భార్య కవిత, పెద్ద కుమార్తె జష్మిత
ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి..
ఇద్దరు కుమార్తెలను బావిలో తోసి తండ్రి జలపతిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి ఆర్థిక సమస్యలే కారణమని తెలుస్తోంది. మృతి చెందిన చిన్నారుల్లో మధుమిత 5వ తరగతి చదువుతుంటే.. ప్రణిత్య రెండో తరగతి చదువుతోంది.. జలపతిరెడ్డికి చెందిన భూమిని ప్రజా అవసరాల కోసం తీసుకున్న ప్రభుత్వం పరిహారాన్ని కోర్టులో డిపాజిట్ చేసింది. ఆ సొమ్ము చేతికి రాక ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు తనకున్న కొంత వ్యవసాయ భూమిని విక్రయించి వచ్చిన సొమ్ముతో అప్పులు చెల్లించి మిగతా కొంత సొమ్మును గ్రామంలో, జగిత్యాలకు చెందిన కొందరికి అప్పుగా ఇచ్చారు. వారెవరూ తిరిగి చెల్లించడం లేదని సమాచారం. పిల్లలు ఎదుగుతుండటం, అవసరాలు పెరిగిపోవడంతో కుటుంబంలో గొడవలు చోటుచేసుకున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో మానసిక ఇబ్బందులకు గురైన జలపతిరెడ్డి గత నెలలోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని సూసైడ్ నోట్ రాసి దగ్గర పెట్టుకుని తన భార్యకు కూడా ఫోన్లో పంపించినట్లు గ్రామస్థులు చెప్పారు. అయితే తరచూ చనిపోతానని చెబుతుండటంతో కుటుంబసభ్యులు పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. శుక్రవారం రాత్రి ముగ్గురు కుమార్తెలను తీసుకుని స్నేహితుడి ఇంట వివాహానికి వెళ్లాలని నిర్ణయించుకున్నా పెద్ద కుమార్తె వెళ్లకపోవడంతో ఆమె ప్రాణాలు నిలిచాయి. శనివారం ఉదయం జలపతిరెడ్డి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ముందుగా హత్యగా భావించారు. ఆ తర్వాత బావిలో చిన్నారుల మృతదేహాలు వెలికి తీయడంతో చిన్నారులను బావిలో తోసేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ సంఘటనపై మొదట భార్య అనుమానం వ్యక్తం చేసినప్పటికీ తరవాత పోలీసులకిచ్చిన ఫిర్యాదులో న్యాయవాది వేధింపులతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, పిల్లలను బావిలో తోశాడని పేర్కొంది. ఈ ఫిర్యాదు, మృతుడి వద్ద లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. చరవాణి కాల్ రికార్డులు, సమీపంలోని వారిని విచారిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూసేకరణలో జాప్యం
[ 28-03-2024]
భూసేకరణలో జాప్యమే జాతీయ రహదారుల విస్తరణకు శాపంగా మారుతోంది. జిల్లాలో ప్రధానంగా జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిగా మార్చి దశాబ్దం కావస్తున్నా.. నిర్మాణం మొదలు కావటం లేదు -
నత్తనడకన నిర్మాణాలు
[ 28-03-2024]
వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం పల్లెదవాఖానాలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర(సబ్సెంటర్ల)ను పల్లె దవాఖానాలుగా మార్చారు -
నిధులు వెచ్చించి.. పనులు వదిలేసి
[ 28-03-2024]
పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఆధునిక సాంకేతికను జోడించి పెద్ద నగరాలకు దీటుగా పోటీ పడేందుకు ప్రణాళికలు చేసిన నగరపాలిక.. ఆ విధానం అమలులో వెనుకబడింది -
తాగునీటి వృథా వద్దు : కలెక్టర్
[ 28-03-2024]
అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
కాంగ్రెస్ నిజామాబాద్ లోక్సభ స్థానం టికెట్ జీవన్రెడ్డికే దక్కింది. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది -
తొలిమెట్టు నోడల్ అధికారులకు భత్యం
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రత్యేక బోధన పద్ధతులతో కొనసాగుతున్న ఈ కార్యక్రమ పర్యవేక్షణకు మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 28-03-2024]
వాతావరణ సమాచారాన్ని ప్రతిఒక్కరి దైనందిన కార్యకలాపాల్లో భాగం చేయాలనే ఉద్దేశంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇటీవల ‘పంచాయత్ మౌసం సేవా’ మొబైల్ యాప్ విడుదల చేసింది. -
పఠనాలయం సద్వినియోగం... కల సాకారం
[ 28-03-2024]
గ్రంథాలయ పుస్తకాలతోనే ఏకకాలంలో రెండు ఉద్యోగాలు సాధించగలిగాను. తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ నిర్వహించిన ఫలితాల్లో పీజీటీ సాంఘికశాస్త్రం, జూనియర్ కళాశాలలో పౌరశాస్త్రం లెక్చరర్గా ఉద్యోగాలకు ఎంపికయ్యాను -
పంచాయతీల ఖజానా ఖాళీ
[ 28-03-2024]
ఓవైపు ఖజానా ఖాళీ, మరోవైపు సమస్యలు పంచాయతీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జమయ్యే నిధులకు మించిన వ్యయం చేయడంతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఓటు నమోదుకు ప్రత్యేక సాధారణ సెలవు
[ 28-03-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్