Telangana Budget 2023: ఎన్నెన్నో ఆశలు.. కురిసేనా వరాలు
రాష్ట్ర పద్దుపైనే ఉమ్మడి జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. శాసనసభ ఎన్నికల ముందు చివరి బడ్జెట్ కావడంతో ఆర్థిక మంత్రి కురిపించే వరాలపైనే అందరి దృష్టీ పడింది.
నేటి రాష్ట్ర బడ్జెట్పైనే ఉమ్మడి జిల్లా ప్రజల దృష్టి
ఈనాడు, కరీంనగర్: రాష్ట్ర పద్దుపైనే ఉమ్మడి జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. శాసనసభ ఎన్నికల ముందు చివరి బడ్జెట్ కావడంతో ఆర్థిక మంత్రి కురిపించే వరాలపైనే అందరి దృష్టీ పడింది. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, కొత్త పథకాలతో సంక్షేమం పరుగులు పెట్టాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులకు మరింత దన్నుగా నిలవడంతో పాటు గత హామీలు అమలయ్యేలా కేటాయింపులుండాలని కోరుతున్నారు. సోమవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వాసుల ఆకాంక్షలపై ‘ఈనాడు’ ప్రత్యేక కథనం.
పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కలిగేనా!
ఉమ్మడి జిల్లాలో సాగునీటి రంగానికి ప్రతి బడ్జెట్లో పెద్దపీట వేస్తున్నారు. ఈసారి కూడా ఘనమైన కేటాయింపులుంటే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశముంది. కాళేశ్వరం పథకానికి అనుబంధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్మిస్తున్న ప్యాకేజీ పనులకు నిధులు కేటాయించాల్సి ఉంది. జగిత్యాల జిల్లాలోని రోళ్లవాగు ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులుండాలి. కోటిలింగాల నుంచి వెల్గటూరు, పెగడపల్లి, గంగాధర మండలాల మీదుగా మధ్యమానేరు(శ్రీరాజరాజేశ్వర) జలాశయం వరకు నిర్మిస్తున్న అదనపు టీఎంసీ పనులకు రూ.వందల కోట్ల ప్రకటన సభలో వినిపించాలని రైతులు ఆశిస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పెండింగ్ పథకాలతో పాటు కథలాపూర్, మేడిపల్లి మండలాలకు కొత్త పథకాలు మంజూరు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేరాల్సి ఉంది. నారాయణపూర్ ముంపు బాధితుల వేదన తీరేలా ప్రకటన రావాలి. వరద కాలువ, కాకతీయ కాలువల మరమ్మతుకు అవసరమైన రూ.100 కోట్ల నిధులతో పాటు కొన్ని చోట్ల విస్తరణకు వీలుగా అందిన ప్రతిపాదనలు నెరవేరాల్సి ఉంది.
సాగుకు కావాలి దన్ను
సాగులో మరింత వెన్నుదన్నుగా నిలిచేలా ప్రోత్సాహకాలపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. రుణమాఫీ హామీ నెరవేరేలా నిధుల ప్రకటన ఉంటుందని ఆశిస్తున్నారు. అకాల వర్షాల సమయంలో సాంత్వన చేకూర్చేలా పరిహారం అందించాలని, ఈ మేరకు బడ్జెట్ కేటాయింపులుండాలని కోరుతున్నారు. సేంద్రీయ సాగుకు ఊతమివ్వడంతో పాటు ఉద్యాన పంటలు, కూరగాయల కాలనీల ఏర్పాటు అంశాన్ని ఈసారి ఆచరణలో చూపించాల్సి ఉంది. యాంత్రీకరణకు మరింత తోడ్పాటు అవసరం ఉంది. బిందు, తుంపర సేద్యానికి రాయితీలు, ఆయిల్పామ్ సహా కొత్త పంటల సాగుకు ప్రోత్సాహకాలు మరింత మెరుగవ్వాల్సి ఉంది. వ్యవసాయ మార్కెట్లలో వసతుల కల్పనకు నిధులు కేటాయించాలి. రాయితీ గొర్రెల పథకంలో రెండో విడత కోసం డీడీలు కట్టి ఎదురుచూస్తున్న వారికి నగదు విధానంలోనైనా మేలు జరగాలి.
మెరుగైన వైద్యమే ప్రధానం
నాలుగు జిల్లాల్లో వైద్య కళాశాల ఏర్పాటు ఆశలు నెరవేరాయి. జగిత్యాలలో తరగతులు ప్రారంభం కాగా, భవన నిర్మాణం ప్రగతిలో ఉంది. సిరిసిల్ల, కరీంనగర్, గోదావరిఖనిలలో నూతన భవనాల నిర్మాణంతో పాటు ఇక్కడ పోస్టుల భర్తీ, తరగతుల నిర్వహణకు వీలుగా నిధులు మంజూరు చేయాల్సి ఉంది. ప్రభుత్వ వైద్య సేవలు మరింత మెరుగయ్యేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో వైద్య ఉపకరణాలు అందుబాటులోకి రావాల్సి ఉంది.
పరిశ్రమలకు అందేనా తోడ్పాటు
వివిధ సంక్షేమ పథకాల అమలులో రాయితీలు మరింత పెరిగేలా బడ్జెట్లో కేటాయింపులుండాలని ఆయా వర్గాల ప్రజలు కోరుతున్నారు. పారిశ్రామిక రంగానికి మరింత తోడ్పాటు అవసరం ఉంది. ఆహార ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటు కోసం ఉమ్మడి జిల్లాలోని చిగురుమామిడి, ఎలిగేడు, మెట్పల్లి మండలాల్లో గుర్తించిన భూముల్లో కార్యాచరణ ప్రారంభమయ్యేలా నిధులు కేటాయించాలి. బీసీ, ఎస్టీ, మైనారిటీ యువతకు స్వయం ఉపాధి పథకాలు కొన్నేళ్లుగా అందని ద్రాక్షగా మారాయి. రాయితీ పథకాల కింద నిధుల కేటాయింపులుండాలి.
ప్రత్యేక నిధులతోనే సాంత్వన
* మానేరు రివర్ఫ్రంట్కు గతంలో మంజూరు చేసిన రూ.408 కోట్లకు సంబంధించిన పద్దు నిధి రూపంలో ఈ బడ్జెట్ ద్వారా జిల్లాకు రావాలి.
* శాతవాహన విశ్వవిద్యాలయంలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలతో పాటు వసతులు కల్పించాలి.
* పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా గోదావరి, మానేరు పరీవాహక ప్రాంతాల ప్రగతికి నిధులు కేటాయించాలి.
* మహిళా సంఘాలకు అందాల్సిన వడ్డీ లేని రుణాలు, బ్యాంకు లింకేజీ రుణాలు, సమాఖ్య భవనాలకు నిధులు మంజూరు చేయాలి.
* గతేడాది కురిసిన అధిక వర్షాలకు ఉమ్మడి జిల్లాలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు దాదాపు రూ.200 కోట్ల వరకు ప్రత్యేక నిధులు కేటాయించాలి.
* గుర్తింపు సంఘం ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల అమలుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని సింగరేణి కార్మికులు కోరుతున్నారు.
* దళితబంధు పథకానికి నిధుల లేమి ఆటంకంగా మారింది. నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఈ బడ్జెట్తో మేలు జరగాలి.
* రెండు పడక గదుల ఇళ్లన్నీ పూర్తయ్యేలా కేటాయింపులుండాలి. సొంత స్థలంలో ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చే ప్రోత్సాహకాలకు నిధులు మంజూరు చేయాలి.
* నేతన్నల సంక్షేమానికి కొత్త ప్రోత్సాహకాలుండాలి. బీడీ కార్మికులకు మేలు జరగాలి.
* మత్స్యకారులతో పాటు వివిధ కుల సంఘాల జీవనం మరింత మెరుగయ్యేలా వివిధ పథకాలతో లబ్ధి చేకూరాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్