ఈసారైనా సజావుగా జరిగేనా?
జిల్లాలోని వివిధ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించి అవసరమైన సూచనలు, తీర్మానాలు చేసి జిల్లా పరిషత్కు పంపించేందుకు నిర్వహించే స్థాయీ సంఘ సమావేశాలు మొక్కుబడిగా జరుగుతున్నాయి.
మొక్కుబడిగా స్థాయీ సంఘాల సమావేశాలు
జడ్పీ సమావేశ మందిరంలో స్థాయీ సంఘం సమావేశం (పాత చిత్రం)
కరీంనగర్ పట్టణం, న్యూస్టుడే: జిల్లాలోని వివిధ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించి అవసరమైన సూచనలు, తీర్మానాలు చేసి జిల్లా పరిషత్కు పంపించేందుకు నిర్వహించే స్థాయీ సంఘ సమావేశాలు మొక్కుబడిగా జరుగుతున్నాయి. సభ్యుల గైర్హాజరుతో వాయిదా పడుతున్నాయి. మూడు నెలలకొకసారి జరిగేవి కూడా వాయిదా పడడం, పూర్తి స్థాయిలో జరగకపోవడం విమర్శలకు దారితీస్తోంది. గత సమావేశంలో ఏడింటిలో ఐదు మాత్రమే మొక్కుబడిగా నిర్వహించారు. వ్యవసాయం, సంక్షేమ విభాగాలవి వాయిదా పడ్డాయి. నేడు (సోమవారం) జరిగే సమావేశాలు పూర్తి స్థాయిలో జరుగుతాయా? లేదా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆయా విభాగాలపై సమీక్ష
ఒకటో స్థాయీ సంఘం పరిధిలో ఆర్థిక ప్రణాళిక విభాగాలుంటాయి. జిల్లా పరిషత్ నిధులు చేపట్టి పనుల ప్రణాళికపై చర్చిస్తారు. రెండో దాంట్లో గ్రామీణాభివృద్ధి, అనుబంధ విభాగాలపై సమీక్షిస్తారు. మూడో దాంట్లో వ్యవసాయం, అనుబంధ విభాగాలపై చర్చిస్తారు. నాలుగులో విద్య, వైద్యం ఉంటాయి. ఐదులో స్త్రీ, శిశు సంక్షేమ విభాగాల శాఖలు, ఆరు, ఏడులో చేపట్టిన పనులను వివరిస్తారు. ఈ సమావేశాలలో ఆయా శాఖలపై చర్చించి సూచనలు అవసరమైన తీర్మానాలు చేశారు. ఈ సమావేశాలు అన్నింటికి ఆయా శాఖల అధికారులు పూర్తి సమాచారంతో హాజరవుతారు.
కమిటీల ఏర్పాటు ఇలా..
వ్యవసాయ స్థాయీ సంఘానికి వైస్ ఛైర్మన్ అధ్యక్షులుగా వ్యవహరించడం ఆనవాయితీ. సంక్షేమ విభాగాల కమిటీకి షెడ్యూల్ కులాల జడ్పీ సభ్యురాలిని ఎన్నుకుంటారు. మహిళా సంక్షేమానికి మగువలు అధ్యక్షులుగా ఉంటారు. మిగిలిన నాలుగు కమిటీలకు జడ్పీ ఛైర్పర్సన్ అధ్యక్షత వహిస్తారు. కమిటీల్లో జడ్పీటీసీ సభ్యులు కో-ఆప్షన్ సభ్యులు శాసన సభ్యులుగా ఉంటారు. జిల్లా పరిషత్ల విభజన తర్వాత జిల్లాలు చిన్నవి కావడంతో ప్రతి కమిటీకి ఇద్దరు జడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ మొత్తం మీద ముగ్గురు నుంచి నలుగురు సభ్యులుగా ఉంటారు. వీరి సమక్షంలో సమావేశాలు జరుగుతాయి.
సభ్యులు, అధికారుల గైర్హాజరు..
సభ్యులు, అధ్యక్షత వహించాల్సిన ఛైర్మన్లు గైర్హాజరు కావడంతో చాలా సమావేశాలకు వాయిదా పడుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా హాజరు కావడంలేదు. కమలాకర్, జీవన్రెడ్డి, రసమయి బాలకిషన్, రవిశంకర్ ఒకసారి హాజరయ్యారు. కొందరు జిల్లా స్థాయి అధికారులు హాజరుకాక కింది స్థాయి వారిని పంపడంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారికి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తున్నారు.
కొన్ని సార్లు ఛైర్మన్ ఛాంబర్లోనే..
సాధారణంగా ఈ సమావేశాలు జడ్పీ మందిరంలో జరగాలి. సభ్యుల సంఖ్య తక్కువగా ఉంటే ఛైర్పర్సన్ ఛాంబర్లోనే జరిపి ముగిస్తున్నారు. మొక్కుబడిగా జరగడంతో ఆశించిన ప్రయోజనం చేకూరడం లేదు. 2019 జులై 5న జడ్పీ పాలకవర్గం బాధ్యతలు చేపట్టింది. ఇప్పటివరకు దాదాపు సగం వాయిదాపడ్డాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
మలేరియా నిర్మూలనకు కృషి
[ 26-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకుని గురువారం జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..