సాగుతోపాటే పెరిగిన సమస్యలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ యాసంగిలో సాధారణంకన్నా అధికంగా పంటలు సాగులోకి రాగా.. ప్రతికూల వాతావరణంతో పైర్లపై సమస్యలు పెరిగినట్లు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాస్ పేర్కొన్నారు.
డాక్టర్ జి.శ్రీనివాస్
న్యూస్టుడే, జగిత్యాల వ్యవసాయం: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ యాసంగిలో సాధారణంకన్నా అధికంగా పంటలు సాగులోకి రాగా.. ప్రతికూల వాతావరణంతో పైర్లపై సమస్యలు పెరిగినట్లు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్య చర్యలను ‘న్యూస్టుడే’ ముఖాముఖి ద్వారా వివరించారు.
జగిత్యాల మండలంలో ఎదుగుదల లేక ఎర్రబారిన వరి పైరు
ఉమ్మడి జిల్లాలో ఏయే పంటల సాగువిస్తీర్ణం పెరిగింది.?
సమాధానం: కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఈ యాసంగిలో 6.34 లక్షల ఎకరాల్లో అన్నిరకాల పంటలు పండిస్తారని అంచనా వేసినా సాగునీటి లభ్యతతో ఇప్పటికే సాగు 9.75 లక్షల ఎకరాలను దాటింది. ఇందులో వరిసాగే 8.9 లక్షల ఎకరాలుండగా తదుపరి మొక్కజొన్న, పెసర, మినుము, ఆవాలు, జొన్న, వేరుసెనగ తదితర పంటలున్నాయి. ఈ నెల 15 వరకు నువ్వులు, పెసర, మినుము, కూరగాయలు తదితరాలను విత్తుకునే అదనుండగా సాగువిస్తీర్ణం మరింతగా పెరగనుంది.
వరిపైరు ఎదుగుదల లేక నష్టం వాటిల్లుతోంది.?
ఉత్తరంవైపు నుంచి వీస్తున్న పొడిగాలులతో తేమశాతం తగ్గి చలిపెరగటం, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులతో సమస్యలు తలెత్తుతున్నాయి. దుక్కిలో జింకువేయని పొలాలు ఎర్రబారగా 2 శాతం జింకుసల్ఫేటు ద్రావణాన్ని రెండుదఫాలుగా పైరుపై పిచికారీ చేయాలి. వానాకాలం వరితీసిన వెంటనే యాసంగి నార్లు పోయగా మొగిపురుగు జీవితచక్రం కొనసాగి ప్రస్తుతం వీటి తీవ్రత అనూహ్యంగా పెరిగింది. పైరు లేతదశలో 8 కిలోల కారటాఫ్ హైడ్రోక్లోరైడ్ లేదా 4 కిలోల క్లోరాంత్రనిలిప్రోల్ గుళికలను ఎకరాకు వేసి మొగిపురుగును నివారించవచ్చు. నాటి నెల రోజులు దాటితే కారటాఫ్ హైడ్రోక్లోరైడ్ 400 గ్రాములు లేదా క్లోరాంత్రనిలిప్రోల్ 60 మి.లీ మందును ఎకరాకు పిచికారీ చేయాలి.
ఇతర పంటలపై చీడపీడల ప్రభావం ఉందా.?
మక్కలో కత్తెరపురుగు నివారణకు తవుడు, బెల్లం, థయోడికార్బ్తో విషపు ఎరలను తయారు చేసుకుని వినియోగించాలి. పొడి వాతావరణంలో కొన్నిరకాల పైర్లపై తామర పురుగుల నివారణకు 1.5 గ్రాముల ఎసిఫేటును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మామిడిలో తామర పురుగుల నివారణకు ఫిప్రోనిల్ 2 మి.లీ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
రైతులకు మీరిచ్చే సలహా ఏమిటి?
వాతావరణం, నేలగుణం, పంట విత్తన రకాలు, యాజమాన్యం తదితరాలను బట్టి ఒకరైతు పొలానికి పక్కనేఉన్న మరోరైతు పొలానికి చాలాతేడా ఉంటుంది. కాబట్టి పంటలపై ఏవేని అసహజ లక్షణాలుంటే వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు లేదా శాస్త్రవేత్తలకు పైర్ల నమూనాలు చూపించి నివారణ తెలుసుకుని ఆచరించాలి. తోటి రైతులను అనుకరించి లేదా దుకాణాల్లోంచి నేరుగా మందులను తీసుకెళ్లి వాడటంద్వారా ఆర్థికనష్టమే అధికంగా ఉంటుంది, పైర్లపై ఆశించిన ప్రయోజనాలను పొందలేరు.
వరి పైరులో ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలి.?
కొన్నిచోట్ల లోతట్టు వందూరు నేలల్లో నిరంతరం నీరు నిలిచిన ప్రాంతాల్లోనూ వరి ఎర్రబారుతోంది. దీనికిగాను పొలాల్లో నిల్వనీటిని తీసివేసి ఆరగట్టి పలుచగా యూరియా చల్లాలి. కొన్నిచోట్ల ఆశించిన అగ్గితెగులు నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 మి.లీ మందును లీటరు నీటికి వంతున కలిపి పిచికారీ చేయాలి. కొన్నిచోట్ల ఉల్లికోడు ఆశించగా నివారణకు 2 మి.లీ ఫిప్రోనిల్ మందును లీటరు నీటికి వంతున కలిపి పిచికారీ చేయాలి. తెగుళ్లవ్యాప్తి నిరోధానికి యూరియాను పరిమితంగానే వినియోగించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఎవరి చేతికి?.. మల్లగుల్లాలు పడుతున్న అధిష్ఠానం
[ 29-03-2024]
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారుపై ఆ పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది.. ఇప్పటికే భారాస, భాజపాల అభ్యర్థులు ఖరారవగా.. హస్తం పార్టీ తరఫున బరిలో నిలిచేదెవరో తెలియకపోవడంతో కాంగ్రెస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు అభ్యర్థి తేలేదెప్పుడు.. అని ఆందోళన చెందుతున్నారు. -
కనుల పండువగా శివయ్య కల్యాణం
[ 29-03-2024]
ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో గురువారం శివ కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. -
ఆందోళన వద్దు.. అవకాశాలు కోకొల్లలు!
[ 29-03-2024]
విద్యార్థులు ప్రాథమిక విద్య నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ పదో తరగతి పూర్తి చేశారు. ఒకట్రెండు రోజుల్లో పరీక్షలు కూడా పూర్తి చేసి ఉన్నతవిద్య వైపు అడుగులు వేయనున్నారు. -
అవసరాల మేరకు ఏదీ అనుసంధానం!
[ 29-03-2024]
ఈ రెండు అంశాల్లోనే కాదు. ప్రయాణికుల అవసరాలు తీర్చడంలో ద.మ.రై.అధికారులు ఆది నుంచీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. రైల్వే ఉద్యోగుల అవసరాలు, అధికారులు, నాయకులు లాబీయింగులతోనే కొత్త హాల్టింగులు, ఇతర వసతులు కల్పిస్తున్నారు. -
కరీంనగర్ బస్స్టేషన్ ఆస్తి పన్ను రూ.1.88 కోట్లు చెల్లింపు
[ 29-03-2024]
ఆస్తిపన్ను బకాయిలపై 90 శాతం రాయితీ గడువు మూడు రోజుల్లో ముగుస్తుందని నగరపాలక కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ తెలిపారు. -
భార్య చేతిలో భర్త హతం
[ 29-03-2024]
భర్త మద్యానికి బానిసై శారీరకంగా.. మానసికంగా వేధిస్తున్నాడని వేదనకు గురైన ఓ భార్య తనకు తెలిసిన ఇద్దరి సహాయంతో తాళ్లతో కట్టేసి.. కళ్లలో కారం చల్లి... ఒంటిపై వేడి నీళ్లు పోసి తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయి మృతి చెందాడు. -
లోక్సభ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పరీక్ష
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
వేసవి గట్టెక్కేనా!
[ 29-03-2024]
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ పట్టణాలకు డబ్బాలోని గ్రిడ్ ద్వారా మిషన్ భగీరథ పథకం నీరు సరఫరా అవుతోంది. ధర్మపురి పట్టణానికి డబ్బా నుంచి పైపులైన్లు వేసినా చివరి ప్రాంతం కావడంతో నీరు సరఫరా సక్రమంగా కావడం లేదు. -
మట్టి గుట్టలు మాయం!
[ 29-03-2024]
మండలంలోని వరద కాలువ మట్టిని కొందరు గుత్తేదార్లు, స్తిరాస్థి వ్యాపారులు అక్రమంగా తరలించుకుపోతుండటంతో మట్టికట్టలు మాయమవుతున్నాయి. -
నిధులు దూరం.. నిర్వహణ భారం
[ 29-03-2024]
వ్యవసాయ శాఖ సేవలను రైతులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో గత ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మించింది. శాఖాపరంగా రైతులకు ఆధునిక సాగు విధానంపై సలహాలు, సూచనలు ఇవ్వాలనేది ప్రధాన లక్ష్యం. -
లక్ష్యానికి చేరువగా సింగరేణి
[ 29-03-2024]
సింగరేణి సంస్థ తొలిసారిగా 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి చేరువ అవుతోంది. మూడేళ్లుగా ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సంస్థ ఇప్పటివరకు ఆ మేరకు బొగ్గు ఉత్పత్తిని చేరుకోలేకపోయింది. -
బయో మైనింగ్ ప్రక్రియకు అవాంతరాలు
[ 29-03-2024]
పెరుగుతున్న నగరీకరణ.. అందుకు అనుగుణంగా పారిశుద్ధ్య నిర్వహణ ప్రభుత్వ యంత్రాంగానికి సవాల్గా మారుతోంది. ఈ క్రమంలో చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేసేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
భాజపా పాలనపై ప్రజల్లో విసుగు
[ 29-03-2024]
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని భారాస ఎంపీ అభ్యర్థులు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్, కొప్పుల ఈశ్వర్లు అన్నారు. -
మతం పేరిట కేసీఆర్ రాజకీయం చేయలేదు: కేటీఆర్
[ 29-03-2024]
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో ఏ రోజు కూడా మతం పేరిట రాజకీయం చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
రాష్ట్రాన్ని దోచుకుంది భారాసనే: ఆది శ్రీనివాస్
[ 29-03-2024]
తెలంగాణ ఏర్పడిన తరవాత రూ.16 వేల కోట్ల నిల్వ బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పగిస్తే భారాస తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని రాబంధుల్లా దోచుకుందని, రూ.6.67 లక్షల కోట్ల అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్