పేరు ఘనం.. వసతి శూన్యం
ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్నాయి. ఫిబ్రవరిలో ప్రయోగ పరీక్షలు. మార్చిలో వార్షిక పరీక్షలు. ఆ నెలాఖరులో మూల్యాంకనం. ఇది అధికారులకు సమస్యగా మారింది.
సమస్యల్లో ఇంటర్ మూల్యాంకన శిబిరం
మూడు చోట్ల నిర్వహణతో వ్యయ భారం
మూల్యాంకన కేంద్రాల్లో ఒకటి ఇంటర్ విద్యాధికారి కార్యాలయం
న్యూస్టుడే, గణేశ్నగర్: ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్నాయి. ఫిబ్రవరిలో ప్రయోగ పరీక్షలు. మార్చిలో వార్షిక పరీక్షలు. ఆ నెలాఖరులో మూల్యాంకనం. ఇది అధికారులకు సమస్యగా మారింది. కారణం కావాల్సిన భవనం లేకపోవడం. రాష్ట్రంలో రెండో మూల్యాంకన కేంద్రం కరీంనగర్. అత్యధిక సబ్జెక్టులు ఇక్కడే దిద్దుతారు. ఆ మేరకు వసతులు లేవిక్కడ. మూడు చోట్ల మూల్యాంకనం చేస్తారు. ఇంటర్ బోర్డు అధిక వ్యయం చేయాల్సిన దుస్థితి. వాస్తవానికి ఉన్నతాధికారులు స్పందించి చొరవ తీసుకుంటే భవన నిర్మాణం జరిగే అవకాశముంది. అంతకుముందు ప్రస్తుతం వినియోగిస్తున్న కార్యాలయం ఇంటర్ బోర్డు పేరిట మోటేషన్ కావాల్సి ఉంది. ఇందుకు లేఖలు ఒక శాఖ నుంచి మరొక శాఖకు తిరుగుతూనే ఉన్నాయి.
సమస్య ఏమిటంటే?
స్టేప్కార్ కార్యాలయాన్ని ఇంటర్ విద్యకు కేటాయించారు. అయితే ఆ స్థలం, భవనం టీసీఐఐసీ (పరిశ్రమల శాఖ) ఆధీనంలో ఉంది. 2017 నుంచి అక్కడ డీవీఈవో కార్యాలయం కొనసాగుతోంది. ఇందుకు ఇంటర్ బోర్డు ఆస్తి పన్ను చెల్లించాలి. నగర పాలక సంస్థ నుంచి కార్యాలయానికి చెల్లించాలని నోటీసులు అందాయి. ఆ మొత్తం ఇంటర్ బోర్డు కమిషనర్ మంజూరు చేయాల్సి ఉంది. వినియోగిస్తున్న భవనం ఇంటర్ బోర్డు పేరిట మోటేషన్ చేస్తే సంబంధిత నిధులు లభిస్తాయని బోర్డు స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని డీఐఈవో కార్యాలయం నగర పాలక సంస్థ కమిషనర్కు లేఖ రాసింది. ఆ తర్వాత 2020 నుంచి మోటేషన్ కోసం కలెక్టర్కు లేఖలు రాశారు. 2022లో టీసీఐసీసీ జోనల్ మేనేజర్కు కలెక్టర్ నుంచి సిఫారసు వెళ్లింది. ఇదే విషయాన్ని జిల్లా అధికారులు పరిశ్రమల శాఖ మేనేజింగ్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నేటికి సమస్య పరిష్కారం కాలేదు.
భవనం నిర్మిస్తేనే..
పరిశ్రమల శాఖ మోటేషన్కు అనుమతిస్తే భవనం ఇంటర్ బోర్డు ఆధీనంలోకి వస్తుంది. అప్పుడు కావాల్సిన నిధుల మంజూరు చేయడంలో నగర పాలక సంస్థకు బకాయిపడ్డ రూ.5 లక్షలు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. మూల్యాంక శిబిరానికి అనువుగా ఇక్కడ భవన నిర్మాణానికి మార్గం సుగమమవుతుంది. ఇందుకు ఇంటర్ బోర్డు కూడా సానుకూలంగా ఉంది. జిల్లా కలెక్టర్తోపాటు పరిశ్రమల శాఖ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తే సమస్య పరిష్కారమవుతుందని ప్రధానాచార్యులు, అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో 5 లక్షల సమాధాన పత్రాలు ఇక్కడికే
పాత జిల్లా కేంద్రాల్లో మూల్యాంకనం జరుగుతుంది. రాష్ట్రంలో వరంగల్ మొదటి స్థానంలో ఉండగా, కరీంనగర్ శిబిరం రెండో స్థానం ఉంది. ఇక్కడే 5 లక్షలకు పైగా సమాధాన పత్రాల మూల్యాంకనం చేస్తారు. అన్ని సబ్జెక్టులు కలుపుకొని సుమారు 2 వేల మంది అధ్యాపకులు పలు విడతల్లో 30 రోజులపాటు శ్రమిస్తారు. ప్రభుత్వ కళాశాలల్లో సరిపడా వసతులు లేవు. వాస్తవానికి ఒకే చోట శిబిరం ఏర్పాటు చేయాలి. కానీ ఇక్కడ మూడు ఉన్నాయి.
గతంలో ఇలా..
జిల్లా కేంద్రంలోని ముకరంపురలో ఇంటర్ విద్యా కార్యాలయం. దాని పక్కనే ప్రభుత్వ ఆర్ట్స్ జూనియర్ కళాశాల. కార్యాలయంలో కొన్ని సబ్జెక్టుల అధ్యాపకులు పేపర్లు దిద్దేవారు. అక్కడే స్ట్రాంగ్ రూంతోపాటు పర్యవేక్షణ జరిగేది. ఆర్ట్స్ కళాశాలలో 30 గదుల్లో గరిష్ఠ అంశాల మూల్యాంకనం కొనసాగేది. ఏటా మూడు విడతల్లో ఆయా సబ్జెక్టుల సమాధాన పత్రాలను అధ్యాపకులు దిద్దేవారు. అయితే ఇప్పుడవి లేకపోవడం సమస్యగా మారింది.
ఇప్పుడు ఇలా..
స్మార్ట్సిటీలో భాగంగా ఆర్ట్స్ కళాశాలను కూల్చివేశారు. ఇప్పుడక్కడ పార్కు నిర్మిస్తున్నారు. అప్పటి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆర్ట్స్ కళాశాలకు ఇంటర్ విద్యా కార్యాలయం (ఆర్ఐవో) కేటాయించారు. అక్కడ కొనసాగుతున్న కార్యాలయాన్ని పద్మానగర్లోని స్టేప్కార్ కార్యాలయానికి మార్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు 2017లో ఆర్ఐవో కార్యాలయం కలెక్టర్కు అప్పగించి పద్మానగర్కు షిఫ్ట్ చేశారు. పాత ఆర్ఐవో ఆఫీసులో ఇప్పుడు ఆర్ట్స్ కళాశాల కొనసాగుతోంది. మొదట అసౌకర్యంగా ఉన్నా తాత్కాలిక గదులు, మరమ్మతులతో ఫర్వాలేదు. మూల్యాంకనం కోసం జ్యోతినగర్లోని లయోలా కళాశాలను ఆశ్రయించారు. రెండేళ్లు గడిచాక వారు నిరాకరించారు. గత్యంతరం లేక పద్మానగర్లో ఇంగ్లిష్, సంస్కృతం మూల్యాంకనం జరుగుతోంది. తెలుగు, హిందీతోపాటు ఆర్ట్స్, కామర్స్ సబ్జెక్టులు ఆర్ట్స్ కళాశాలలో, సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించాల్సి వస్తోంది. పద్మానగర్లోని స్ట్రాంగ్ రూం నుంచి సమాధాన పత్రాలు రెండు చోట్లకు రవాణా చేయడం సమస్యగా మారింది. రవాణా ఖర్చు పెరిగింది. మూడు చోట్ల విద్యుత్ ఛార్జీలు భరించాల్సిన పరిస్థితి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పార్లమెంట్ సభ్యత్వం పునరావాస కేంద్రమా?: వినోద్కుమార్
[ 20-04-2024]
తెలంగాణ తెచ్చిన భారాస పార్టీ పార్లమెంట్లో ఉండాల్సిన అవసరం ఉందని కరీంనగర్ లోక్సభ భారాస అభ్యర్థి బి. వినోద్ కుమార్ అన్నారు. -
జమ్మికుంటలో వర్షం.. అప్రమత్తమైన అన్నదాతలు
[ 20-04-2024]
జమ్మికుంటలో వర్షం కురిసింది. దీంతో స్థానిక పాత వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడవకుండా అన్నదాతలు, మార్కెట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. -
రెండో రోజు నలుగురు నామినేషన్
[ 20-04-2024]
కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ స్థానాలకు రెండో రోజు శుక్రవారం కేవలం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్ స్థానం కోసం భాజపా అభ్యర్థి బండి సంజయ్ తరఫున ఆ పార్టీ నాయకులు ఎన్నికల అధికారికి నామపత్రాలను అందజేశారు. -
ఆర్ఎం కార్యాలయానికి ఆరుగురు ఉద్యోగుల సరెండర్
[ 20-04-2024]
హుజూరాబాద్ ఆర్టీసీ డిపోనకు చెందిన ఆరుగురు ఉద్యోగులను కరీంనగర్ ఆర్ఎం కార్యాలయానికి సరెండర్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. స్థానిక డిపోలో పనిచేసే డ్రైవర్ రవీందర్ వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ డిపో మేనేజర్ శ్రీకాంత్ ఈ నెల 15న అనిశా అధికారులకు చిక్కిన విషయం విదితమే. -
ఉక్కపోతతో తల్లీబిడ్డల ఉక్కిరిబిక్కిరి
[ 20-04-2024]
భానుడి భగభగలకు ఉదయం 9 గంటలు దాటితే ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం భయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎండలు 40 డిగ్రీల కంటే అధికంగానే ఉంటున్నాయి. -
కాంగ్రెస్ నేతలకు మానసిక చికిత్స అవసరం
[ 20-04-2024]
కాంగ్రెస్ నేతలకు మానసిక చికిత్స అవసరమని హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు అన్నారు. వారికి చికిత్స అందేలా చూడాలని శుక్రవారం కరీంనగర్లో ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్కి వినతిపత్రం అందజేశారు. -
గంగుల, బండిల స్నేహం అందరికీ తెలుసు
[ 20-04-2024]
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ల మధ్య స్నేహం అందరికీ తెలుసునని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను ఓడించేందుకు గంగుల కమలాకర్ భాజపాతో కుమ్మకైనట్లు ఆరోపించారు. -
వారసత్వ సంపద పరిరక్షణకు ఓటేద్దాం
[ 20-04-2024]
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటేనే ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు, వారసత్వ కట్టడాలకు పెట్టింది పేరు. శాతవాహనులు, కాకతీయులు, నిజాముల కాలంలో నిర్మించిన కోటలు, మెట్ల బావులు, ఆలయాలు ఇక్కడ కనిపిస్తాయి. -
ఇదీ అన్నదాత ఎజెండా!
[ 20-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం వ్యవసాయపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. భిన్న వ్యవసాయ ఉత్పత్తులతో రాష్ట్రంలోనే ప్రత్యేకత చాటుకుంటోంది. దేశ విదేశాలకు ఎగుమతి చేసే పసుపు, మామిడి, మొక్కజొన్న, సన్న వరి, చెరకు, ఆవాలు, ఎర్రజొన్న, తెల్లజొన్న, సజ్జ తదితర పంటల దిగుబడిలో ఆదర్శంగా నిలుస్తున్నా అన్నదాతను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. -
ఒక ఎంపీ.. అయిదు జిల్లాలు
[ 20-04-2024]
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు గతంలో ఒకే జిల్లా పరిధిలో ఉండేవి. తెలంగాణ ఆవిర్భావం అనంతరం జిల్లాల పునర్విభజనతో ఎంపీ స్థానం అయిదు జిల్లాలకు విస్తరించింది. -
నీటి తొట్టిలో పడి బాలుడి మృతి
[ 20-04-2024]
ఇటుక బట్టీ వద్ద నీటి తొట్టిలో పడి ఏడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. కుటుంబసభ్యులు పోలీసుల కథనం ప్రకారం.. -
శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోండి
[ 20-04-2024]
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కేజీబీవీల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థినులకు కరీంనగర్ కేజీబీవీలో నిర్వహిస్తున్న ఎప్సెట్ శిక్షణ తరగతులను సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు అధికారి మల్లయ్య భట్టు శుక్రవారం సందర్శించారు. -
కరీంనగర్లో రూ.15.81 లక్షల పట్టివేత
[ 20-04-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా శుక్రవారం పోలీసులు కరీంనగర్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రూ.15.81 లక్షల నగదును పట్టుకున్నట్లు కమిషనర్ కార్యాలయం తెలిపింది. -
ఇంటి నుంచే ఓటింగ్పై అధికారులకు శిక్షణ
[ 20-04-2024]
ఇంటినుంచే ఓటింగ్పై పాటించాల్సిన నిబంధనలపై అధికారులకు మంథని శాసనసభ సెగ్మెంట్ అధికారి హనుమనాయక్ అవగాహన కల్పించారు. శుక్రవారం మంథని ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులకు శిక్షణ ఇచ్చారు. -
అడుగడుగునా తనిఖీలతో ప్రలోభాలకు అడ్డుకట్ట
[ 20-04-2024]
ఎన్నికల్లో డబ్బు, మద్యం, మాదకద్రవ్యాల పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. లోక్సభ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో జిల్లా సరిహద్దు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
పెరుగుతున్న పసిడి ధరలు... తగ్గుతున్న వ్యాపారం
[ 20-04-2024]
బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకి వెళుతున్నాయి. గతంలో పెళ్లి ముహూర్తాల సమయంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టేవి. దీనికి భిన్నంగా మార్కెట్లో ప్రస్తుతం పసిడి ధర పది గ్రాములు(తులం) రూ.76,000 వరకు పలుకుతోంది. -
కిట్టు సరే.. పరీక్ష చేసేవారేరీ?
[ 20-04-2024]
కలుషిత నీటితో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో ప్రజలకు శుద్ధ జలం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అక్కడక్కడ పైపులు పగిలి లీకేజీతో కలుషితమైన నీరు సరఫరా అయ్యే అవకాశం ఉంది. -
ఆరేళ్లుగా ఉపాధి కరవు
[ 20-04-2024]
వలసల నివారణకు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల కోసం ఆరేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఆ కుటుంబాలకు పనులు కల్పించడం లేదు. -
ప్రజలు మళ్లీ మోసపోవద్దు
[ 20-04-2024]
భాజపా అభ్యర్థి అర్వింద్ రాముడి పేరుతో రాజకీయం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. పొద్దునలేస్తే హిందూ-ముస్లిం, పాకిస్థాన్-ఇండియా, రోహింగ్యాంటూ మాటలు చెప్పడమే గాని ఎంపీగా ప్రజలకు చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. -
‘పసుపు బోర్డు పేరుతో మోసం’
[ 20-04-2024]
పసుపు బోర్డు పేరుతో ఎంపీ ధర్మపురి అర్వింద్ రైతులను మోసం చేశారని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు కూడా మభ్యపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?