మళ్లీ అదే తంతు!
జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు సోమవారమూ గతంలో మాదిరిగా మొక్కుబడిగా జరిగాయి. ఏడు స్థాయీ సంఘ సమావేశాలు ఛైర్పర్సన్ కనుమల్ల విజయ ఛాంబర్లోనే జరిపారు.
నామమాత్రంగా స్థాయీ సంఘ సమావేశాలు
న్యూస్టుడే, కరీంనగర్ పట్టణం
సమావేశంలో పాల్గొన్న జడ్పీ ఛైర్పర్సన్ విజయ, జడ్పీటీసీ సభ్యురాలు సౌజన్య, సీఈవో ప్రియాంక
జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు సోమవారమూ గతంలో మాదిరిగా మొక్కుబడిగా జరిగాయి. ఏడు స్థాయీ సంఘ సమావేశాలు ఛైర్పర్సన్ కనుమల్ల విజయ ఛాంబర్లోనే జరిపారు. మహిళా సంక్షేమం స్థాయీ సంఘం ఛైర్పర్సన్ పిట్టల కరుణ గైర్హాజరయ్యారు. సంక్షేమ స్థాయీ సంఘ సమావేశానికి ఛైర్పర్సన్ మాచర్ల సౌజన్య హాజరు కాగా సభ్యులెవరూ రాకపోవడంతో మొక్కుబడిగా పూర్తి చేశారు. సమావేశం పూర్తయ్యాక కోఆప్షన్ సభ్యులు శుక్రుద్దీన్ వచ్చారు. 5, 6 స్థాయీ సంఘ సమావేశాలు మినహా మిగిలినవి 1,2,3,4,7 విడివిడిగా కాకుండా అన్ని కలిపి ఛైర్పర్సన్ విజయ అధ్యక్షతన జరిగాయి.
ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఏదీ?
కరీంనగర్ జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలు ఎందుకు నిర్వహించడంలేదు, మూడేళ్లుగా అడుగుతున్నా ఎందుకు స్పందించడంలేదని శంకరపట్నం జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్రెడ్డి ఆగ్రహించారు. ఆర్ఎంవో జ్యోతి చెప్పిన సమాధానంతో సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మన ఊరు మన బడి కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరైనా మండల విద్యాధికారి ఎందుకు హాజరు కాలేదని మండిపడ్డారు. డీఈవో ఫోన్ చేస్తే సరిగా మాట్లాడటంలేదన్నారు. ఆయిల్పాం సాగు విస్తీర్ణం పెంచాలని, మొక్కలు అందుబాటులో ఉంచాలని ఛైర్పర్సన్ విజయ సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన పాడి పశువులు సరిగా పాలు ఇవ్వడంలేదని హుజూరాబాద్ జడ్పీటీసీ సభ్యుడు బక్కరెడ్డి ఆరోపించారు. మిషన్ భగీరథ పనుల కోసం తవ్విన రోడ్లు, మళ్లీ ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు.
ఇళ్ల నిర్మాణంలో జాప్యమెందుకు?
రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులు చిన్నకోమటిపల్లిలో ఇతర ప్రాంతాల్లో ఎందుకు ఆగిపోయాయని ఛైర్పర్సన్ విజయ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు గుత్తేదారులు ఆసక్తి చూపించడం లేదని ఆర్అండ్బీ ఈఈ సాంబశివరావు సమాధానమిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కొందరు రాక్షసులుగా మారారని ఛైర్పర్సన్ మండిపడ్డారు. మండల పంచాయతీరాజ్ ఏఈ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయడంలేదని చిగురుమామిడి జడ్పీటీసీ సభ్యుడు గీకురు రవీందర్ ఆరోపించారు. హుజూరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ తమ ఫోన్లకు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని, ఆమెను అక్కడి నుంచి బదిలీ చేయాలని అధికారులను ఛైర్పర్సన్ విజయ ఆదేశించారు. సమావేశాలకు సగం మందికి పైగా సభ్యులు హాజరు కాలేదు. జడ్పీ సీఈవో ప్రియాంక, వైస్ ఛైర్మన్ గోపాల్రావు, జడ్పీటీసీ సభ్యులు పురమల్ల లలిత, రవీందర్రెడ్డి తదితరులు హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు