ఆసుపత్రులు ఇబ్బడిముబ్బడి.. కానరాని కట్టడి
అనుమతులుండవు.. నిబంధనలు పట్టించుకోరు.. మౌలిక వసతులు కనిపించవు.. రాత్రికి రాత్రే వివిధ పేర్లతో బోర్డులతో ఇష్టారాజ్యంగా, ఇబ్బడిముబ్బడిగా జిల్లావ్యాప్తంగా కొత్త ప్రైవేటు ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నారు.
ఈనాడు డిజిటల్, పెద్దపల్లి
గోదావరిఖనిలోని స్కానింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు
అనుమతులుండవు.. నిబంధనలు పట్టించుకోరు.. మౌలిక వసతులు కనిపించవు.. రాత్రికి రాత్రే వివిధ పేర్లతో బోర్డులతో ఇష్టారాజ్యంగా, ఇబ్బడిముబ్బడిగా జిల్లావ్యాప్తంగా కొత్త ప్రైవేటు ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నారు. వైద్యారోగ్య శాఖ నిబంధనల ప్రకారం అన్నీ అనుమతులు వచ్చాకే వైద్య సేవలు ప్రారంభించాల్సి ఉంటుంది. ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు వైద్య రంగంలో పోటీ పడుతూ.. అనుమతుల దరఖాస్తు ప్రక్రియ చేయకముందే స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో దర్జాగా సేవలు ప్రారంభిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు.
* రామగుండం, గోదావరిఖని, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని ప్రాంతాల్లో ఇప్పటికే వైద్యసేవలు అందిస్తున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతులు లేవని స్వయంగా వైద్యశాఖ ఉన్నతాధికారులే చెబుతుండటం గమనార్హం. ప్రభుత్వ వైద్యులు తమ సమయపాలన ప్రకారం సర్కారు దవాఖానాల్లో అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు పట్టించుకోకుండా తమకు చెందిన ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ బినామీ పేర్లతో అనుమతులకు దరఖాస్తులు చేసుకుని వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
నోటీసులకే పరిమితం..
* ఈ ఏడాది జనవరి 20న రామగుండంలోని లక్ష్మీనగర్ ఓ ఆస్పత్రి పక్కన ఎలాంటి అనుమతులు లేకుండా ఎంఆర్ఐ స్కానింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్థానికులు కొందరు ఫిర్యాదు చేయడంతో వైద్యారోగ్యశాఖ అధికారులు వెళ్లి తనిఖీలు చేసి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో కేంద్రాన్ని సీజ్ చేశారు.
* పెద్దపల్లి కూనారం క్రాస్ రోడ్డులోని ఓ ఆసుపత్రిని గతంలో అధికారులు తనిఖీలు చేసి అనుమతులు లేవని నోటీసులు ఇచ్చి మూసేశారు. ఇప్పుడా భవనంలోనే మరో పేరుతో ఆస్పత్రి ఏర్పాటు చేశారు. ఈ ఆస్పత్రికి మాత్రం అన్నీ రకాల అనుమతులు ‘అందజేసినట్లు’ అధికారులు చెబుతుండటం గమనార్హం.
* గత ఏడాది మంథని పురపాలిక పరిధిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా కొనసాగుతూ చిన్న పిల్లలకు అనధికారికంగా వైద్యం నిర్వహిస్తున్న ఓ ప్రయివేటు ఆస్పత్రిపై స్థానికులు కొందరు జిల్లా వైద్యఆరోగ్యశాఖకు ఫిర్యాదులు చేశారు.
* జిల్లాలో 135 వరకు ప్రైవేటు ఆస్పత్రులుండగా 40 ప్రైవేటు ఆస్పత్రులకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని గుర్తించారు. వీటికి పలుమార్లు నోటీసులు పంపించారు. కొందరు స్పందించి ఆన్లైన్లో అనుమతులు తీసుకుంటుండగా ఇంకొందరు పట్టించుకోకుండా వైద్యం నిర్వహిస్తున్నారు.
* అగ్నిమాపక, కాలుష్యనియంత్రణ బోర్డు, పార్కింగ్, విశాలమైన భవనం, సిబ్బంది విద్యార్హతలు అన్నింటికి అనుమతులు తీసుకోవాల్సిందే. ఇలా కాకుండా ఇరుకుగదుల్లో, ఏ వ్యాధికి ఎంత రుసుము వసూలు చేస్తారో? అనే సూచికలు కూడా ఏర్పాటు చేయడం లేదు.
* ఆసుపత్రుల బోర్డుపై ఒక వైద్యుడి పేరుతో అనుమతులుంటే ఇంకో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కనీస మౌలిక వసతుల్లేని ప్రైవేటు ఆస్పత్రులు కార్పొరేట్ స్థాయి వైద్యశాల రుసుములు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రులకు వచ్చిన వారిని కూడా మెరుగైన చికిత్సల పేరిట తమ ఆసుపత్రికి ‘రిఫర్’ చేస్తు రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్, ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్లతో వైద్యులతో కమీషన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు.
అన్ని వసతులుంటేనే అనుమతులు
- ప్రమోద్కుమార్, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి
జిల్లావ్యాప్తంగా ఈ సంవత్సరం 20 వరకు కొత్త ప్రైవేటు ఆస్పత్రులు అనుమతుల కోసం దరఖాస్తులు చేశారు. పూర్తి స్థాయిలో ఉన్నతాధికారుల సమక్షంలో ఆస్పత్రిని క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తర్వాతే అనుమతులు మంజూరు చేస్తున్నాం. అనుమతుల్లేని వాటికి, అనుమతులు వచ్చాక అదనంగా వసతులు, కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నవారిని గుర్తించి నోటీసులు ఇచ్చాం. కొందరు స్పందించి ఆన్లైన్లో అనుమతులు పొందారు. తిరస్కరిస్తున్న వారికి అనుమతులు రద్దు చేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు