కొత్త యాప్.. హాజరు గల్లంతు
హాజరుతో పాటు పనుల్లో అక్రమాలు వెలుగు చూసిన క్రమంలో జాతీయ ఉపాధిహామీ పథకంలో ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన యాప్ కూలీల వేతనాలపై ప్రభావం చూపుతోంది.
వేతనాలు కోల్పోతున్న ఉపాధి కూలీలు
న్యూస్టుడే, గోదావరిఖని
కమాన్పూర్ మండలం గుండారంలో పనులు చేస్తున్న ఉపాధి కూలీలు
హాజరుతో పాటు పనుల్లో అక్రమాలు వెలుగు చూసిన క్రమంలో జాతీయ ఉపాధిహామీ పథకంలో ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన యాప్ కూలీల వేతనాలపై ప్రభావం చూపుతోంది. యాప్ద్వారా కూలీల హాజరు గల్లంతయ్యే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో కొత్తగా అమలులోకి వచ్చిన ఈ విధానంతో తాము నష్టపోతున్నామని ఉపాధి కూలీలు వాపోతున్నారు. సర్వరు సక్రమంగా రాకపోగా సమయానికి కొన్ని నిమిషాలు ఆలస్యమైనా అందులో నమోదు కావడం లేదు. ఇది వరకు రాతపూర్వకంగా వేసే హాజరు స్థానంలో ఎన్ఎంఎంఎస్(నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం) విధానాన్ని తీసుకువచ్చారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి తీసుకువచ్చిన యాప్తో కూలీలు ఇబ్బంది పడుతున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది సైతం వారికి హాజరు వేయలేకపోతున్నారు.
అక్రమాలకు చెక్
పాత విధానంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని కొంతమంది సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారు. కూలీలు రాకున్నా వచ్చినట్లు.. పనులు చేయకున్నా చేసినట్లు నమోదు చేసుకునే అవకాశం ఉండేది. తాజాగా వచ్చిన ఎన్ఎంఎంఎస్ విధానం ద్వారా వాటికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. పాత విధానంలో హాజరు, చేసిన పనుల వివరాలు సామాజిక తనిఖీల్లో అనేక సార్లు తప్పుగా వెలుగు చూశాయి. కొత్త యాప్ ద్వారా కూలీల చిత్రాలను పని స్థలంలోనే తీసి అంతర్జాలంలో నమోదు చేయాలి. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే యాప్ అందుబాటులో ఉంటుంది. ఈ సమయాల్లోనే కూలీల చిత్రాలు ఆప్లోడ్ చేయాలి. ఈ సమయాల్లో కూలీలు అందుబాటులో లేకపోయినా.. సర్వర్ మొరాయించినా కూలీల హాజరు నమోదు కాదు. దీంతో వారికి ఆరోజు వేతనాలు జమకావు.
ఆర్థికంగా నష్టపోతున్నాం
కొత్త విధానం ద్వారా చాలాసార్లు హాజరు పడటం లేదు. దీంతో ఆర్థికంగా నష్టపోతున్నాం. హాజరు నమోదు చేసుకునే సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా తీసుకోవడం లేదు. ఉదయం, సాయంత్రం రెండు పూటలా ప్రత్యేక సమయంలోనే నమోదు చేసుకోవాలి. అప్పుడే ఆ రోజు చేసిన పని లెక్కలోకి వస్తుంది. ఉదయం నమోదై సాయంత్రం హాజరు పడకపోయినా రోజంతా పనిచేయనట్లే వస్తోంది.
దాసరి శ్యామల, కూలీ, పెంచికల్పేట
సాంకేతిక సమస్యలను సవరిస్తున్నాం
కొన్ని సాంకేతిక సమస్యలున్నాయి. కొత్త యాప్ వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో ఇబ్బందులు వస్తున్నాయి. వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వేసవి కాలం నాటికి పూర్తిస్థాయిలో సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటాం. సర్వర్ సమస్యతో పాటు పని స్థలంలో అంతర్జాలం అందుబాటులో లేకపోయినా ఇబ్బంది వస్తుంది. కింది స్థాయి సిబ్బంది నుంచి సమస్యకు సంబంధించిన పూర్తి సమాచారం తెప్పించుకుంటున్నాం. వాటిని అధిగమించేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నాం.
శ్రీధర్, డీఆర్డీఓ పీడీ, పెద్దపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’