నిండా నీరు.. ముందుకు కదలని తీరు
ఏళ్ల తరబడి ఎగువ మానేరు జలాశయం కాల్వలో పేరుకుపోయిన తుంగ, పిచ్చి మొక్కలు తొలగించడం లేదు. అక్కడక్కడ ఉపాధి కూలీల ద్వారా పూడిక తొలగిస్తూ నామ మాత్రపు చర్యలు చేపడుతున్నారే తప్పా పూర్తిస్థాయిలో పనులు చేపట్టిన దాఖలాలు లేవు.
మరమ్మతులకు నోచుకోని ఎగువ మానేరు కాల్వలు, తూంలు
న్యూస్టుడే, ముస్తాబాద్
ముస్తాబాద్ వద్ద కాల్వలో తుంగ, చెత్తాచెదారం
ఏళ్ల తరబడి ఎగువ మానేరు జలాశయం కాల్వలో పేరుకుపోయిన తుంగ, పిచ్చి మొక్కలు తొలగించడం లేదు. అక్కడక్కడ ఉపాధి కూలీల ద్వారా పూడిక తొలగిస్తూ నామ మాత్రపు చర్యలు చేపడుతున్నారే తప్పా పూర్తిస్థాయిలో పనులు చేపట్టిన దాఖలాలు లేవు. నిధుల మంజూరు కోసం అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నా వాటికి మోక్షం కలగడం లేదు. ఎగువ మానేరులో జలకళ సంతరించుకొన్నప్పటికీ చివరి ఆయకట్టు వరకు నీరందని పరిస్థితి ఉంది. కాల్వలు, తూంల మరమ్మతులు చేపట్టాలని వేడుకొంటున్నా ఫలితం ఉండటం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గంభీరావుపేట మండలం నర్మాలలో ఎగువ మానేరు జలాశయం ఉంది. దీని సామర్థ్యం 31 అడుగులు కాగా, ప్రస్తుతం 26 అడుగుల వరకు నీరు ఉంది. యాసంగి సాగు కోసం మూడు మండలాల్లోని ఆయకట్టుకు డిసెంబరు 16న ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు కలిసి నీటిని విడుదల చేశారు. కుడి కాల్వ ద్వారా గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మూడు మండలాల్లోని నర్మాల, కోళ్లమద్ది, కొత్తపల్లి, లింగన్నపేట, మల్లారెడ్డిపేట, బండలింగంపల్లి, గోపాల్పల్లె, రాంరెడ్డిపల్లె, కొండాపూర్, గూడెం, గూడూరు, నామాపూర్, ముస్తాబాద్, పోత్గల్, తెర్లుమద్ది గ్రామాల ఆయకట్టుకు సాగునీరందుతుంది. మూడు మండలాల్లో కలిపి 13 వేలకు పైగా ఆయకట్టు ఉండగా, అత్యధికంగా ముస్తాబాద్ మండలంలోనే 8,556 ఎకరాల ఆయకట్టు ఉంది. ఎగువమానేరు నుంచి తెర్లుమద్ది చివరి ఆయకట్టు వరకు 22 డిస్ట్ర్టిబ్యూటర్లు ఉండగా, చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్లు దాదాపు 40 వరకు ఉన్నాయి. కాల్వల ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. కాల్వలు, తూంలు, షట్టర్లు చెడిపోయి ఏళ్లు కావస్తున్నా మరమ్మతులకు నోచుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని ఎగువ మానేరు కాల్వలో అక్కడక్కడ ఉపాధి హామీ కూలీల ద్వారా పూడిక, పిచ్చి మొక్కలను తొలగించినప్పటికీ మరికొన్ని చోట్ల బాగా పెరిగిపోయాయి. నీరు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సాగు నీరు సాఫీగా పారేందుకు కాల్వలు, తూంల మరమ్మతులు చేపట్టాలని అన్నదాతలు కోరుతున్నారు.
ఏళ్ల తరబడి మరమ్మతులు చేపట్టని తూం
ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి
మాది తెర్లుమద్ది గ్రామం. ఎగువ మానేరు కాల్వ నీటిపై ఆధారపడి రెండెకరాల పొలం సాగవుతుంది. యాసంగి సాగు కోసం ఎగువమానేరు కాల్వ ద్వారా నీరు వదలారు. సంతోషంగా ఉంది. మండల కేంద్రంలోని మురుగు వచ్చి ఎగువ మానేరు కాల్వలో చేరుతుంది. దీంతో చెత్తచెదారం ఇందులో చేరి నీరు కలుషితమతుంది. కాల్వలో అక్కడక్కడ తుంగ, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి కొంత ఇబ్బంది తలెత్తుతుంది. ఏళ్ల తరబడి కాల్వలు, తూంలు మరమ్మతులు చేసిన దాఖలాలు లేవు. అధికారులు చొరవ తీసుకొని మరమ్మతులు చేసి పంట చేతికొచ్చే వరకు సాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి.
పుట్ట అశోక్, రైతు, తెర్లుమద్ది
ప్రతిపాదనలు పంపించాం
ఎగువ మానేరు కుడి కాల్వ నుంచి తెర్లుమద్ది 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏడాది క్రితమే కాల్వలు, తూంలు, షట్టర్ల మరమ్మతుల కోసం రూ.50 కోట్లకు ప్రతిపాదనలు పంపించాం. మరో రూ.10 కోట్లకు ప్రతిపాదనలు పంపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే కాల్వలు, తూంలు, షట్టర్లు, ప్రధాన రోడ్డు వెంట ఉన్న ఎగువ మానేరు కాల్వ వంతెనల వద్ద తూంల మరమ్మతులు చేపడతాం. ఉపాధి కూలీల ద్వారా కాల్వలో పెరిగిన తుంగ, పిచ్చి మొక్కలను అక్కడక్కడ తొలగించారు. చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందిస్తున్నాం. రైతులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ సమస్యలు తలెత్తకుండా చూసుకుంటున్నాం.
వంశీకృష్ణ, ఏఈ, జలవనరులశాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ