15 నుంచి అనాథల అరిగోస దీక్షలు
అనాథల సంక్షేమానికి ఇచ్చిన హామీల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ విఫలమయ్యారని అనాథల హక్కుల పోరాట వేదిక, ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు.
మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ
సిరిసిల్ల (విద్యానగర్), న్యూస్టుడే: అనాథల సంక్షేమానికి ఇచ్చిన హామీల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ విఫలమయ్యారని అనాథల హక్కుల పోరాట వేదిక, ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. అనాథల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఈ నెల 15 నుంచి ‘అనాథల అరిగోస’ పేరుతో దీక్షలు చేపడతామని హెచ్చరించారు. అనాథలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇస్తామని, వారి సంక్షేమం కోసం దేశం గర్వించదగ్గ చట్టాలు తెస్తామన్నారన్నారు. కుల, ఆదాయ సర్టిఫికెట్లు లేక వారు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అనాథ ఆశ్రమాల నిర్వహణను ప్రభుత్వ పరిధిలోకి తెస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రంగా చెబుతూ వారిని ఆదుకోకపోవడం బాధాకరమన్నారు. రైతుబంధు పథకం దేశానికి ఆదర్శం అని గొప్పలు చెప్పుకుంటున్నారని, మంత్రి మల్లారెడ్డి లాంటి వారితో పాటు వందలాది ఎకరాలున్న భూస్వాములకు రైతు బంధు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల్లో వీరి సంక్షేమానికి చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఇద్దరు అనాథల కష్టాలను చూసి ప్రత్యేక చట్టం తీసుకొస్తామని చెప్పి నేటి వరకు ఆ ఊసే లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే ఈ నెల 15 నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నియోజకవర్గ కేంద్రాల్లో అనాథల అరిగోస దీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్పీ) ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి ఇంజం వెంకటస్వామి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జి ఆవునూరి ప్రభాకర్, జిల్లా కోఆర్డినేటర్ కానపురం లక్ష్మణ్, గుండా థామస్, రేణుకుంట సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూసేకరణలో జాప్యం
[ 28-03-2024]
భూసేకరణలో జాప్యమే జాతీయ రహదారుల విస్తరణకు శాపంగా మారుతోంది. జిల్లాలో ప్రధానంగా జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిగా మార్చి దశాబ్దం కావస్తున్నా.. నిర్మాణం మొదలు కావటం లేదు -
నత్తనడకన నిర్మాణాలు
[ 28-03-2024]
వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం పల్లెదవాఖానాలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర(సబ్సెంటర్ల)ను పల్లె దవాఖానాలుగా మార్చారు -
నిధులు వెచ్చించి.. పనులు వదిలేసి
[ 28-03-2024]
పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఆధునిక సాంకేతికను జోడించి పెద్ద నగరాలకు దీటుగా పోటీ పడేందుకు ప్రణాళికలు చేసిన నగరపాలిక.. ఆ విధానం అమలులో వెనుకబడింది -
తాగునీటి వృథా వద్దు : కలెక్టర్
[ 28-03-2024]
అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
కాంగ్రెస్ నిజామాబాద్ లోక్సభ స్థానం టికెట్ జీవన్రెడ్డికే దక్కింది. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది -
తొలిమెట్టు నోడల్ అధికారులకు భత్యం
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రత్యేక బోధన పద్ధతులతో కొనసాగుతున్న ఈ కార్యక్రమ పర్యవేక్షణకు మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 28-03-2024]
వాతావరణ సమాచారాన్ని ప్రతిఒక్కరి దైనందిన కార్యకలాపాల్లో భాగం చేయాలనే ఉద్దేశంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇటీవల ‘పంచాయత్ మౌసం సేవా’ మొబైల్ యాప్ విడుదల చేసింది. -
పఠనాలయం సద్వినియోగం... కల సాకారం
[ 28-03-2024]
గ్రంథాలయ పుస్తకాలతోనే ఏకకాలంలో రెండు ఉద్యోగాలు సాధించగలిగాను. తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ నిర్వహించిన ఫలితాల్లో పీజీటీ సాంఘికశాస్త్రం, జూనియర్ కళాశాలలో పౌరశాస్త్రం లెక్చరర్గా ఉద్యోగాలకు ఎంపికయ్యాను -
పంచాయతీల ఖజానా ఖాళీ
[ 28-03-2024]
ఓవైపు ఖజానా ఖాళీ, మరోవైపు సమస్యలు పంచాయతీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జమయ్యే నిధులకు మించిన వ్యయం చేయడంతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఓటు నమోదుకు ప్రత్యేక సాధారణ సెలవు
[ 28-03-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ