16 శాతం సంగతేంటి?
జిల్లాలో 2021-22 వానాకాలం సీజన్కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) సేకరణ లక్షం ఇప్పటి వరకు చేరుకోలేదు.
జిల్లాలో 84 శాతం పూర్తయిన సీఎంఆర్
న్యూస్టుడే, మెట్పల్లి
ఓ మిల్లులో బియ్యం
జిల్లాలో 2021-22 వానాకాలం సీజన్కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) సేకరణ లక్షం ఇప్పటి వరకు చేరుకోలేదు. పౌరసరఫరాల శాఖ సేకరించిన వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేసేందుకు ఇచ్చిన గడువు ముగిసి పోయినా ఇంత వరకు కొందరు మిల్లర్లు బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించలేదు. తాకీదులు ఇచ్చినా, అదనపు కలెక్టర్ లత సమావేశాలు నిర్వహించి హెచ్చరిస్తునా మిల్లర్లు స్పందించడంలేదు. గత నెల గడువు ముగిసే నాటికి మిల్లర్లు 84 శాతం బియ్యాన్ని మాత్రమే చెల్లించారు. ఇంకా 16 శాతం బియ్యాన్ని అప్పగించాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. 16 శాతం సీఎంఆర్ బియ్యంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఇటు మిల్లర్లు అటు అధికారుల్లో అయోమయం నెలకొంది.
మిల్లింగ్ చేయకుండానే..
విద్యుత్తు ఖర్చు ఉండదు, కార్మికులతో పని లేకుండా పలువురు వ్యాపారులు పైసా ఖర్చు చేయకుండా పభుత్వం కేటాయించిన ధాన్యం మిల్లింగ్ చేయకుండానే అమ్మేస్తున్నారు. తరుగు పేరుతో రైతులు నష్టపోతుండగా మిల్లర్లు మాత్రం నయాపైసా పెట్టుబడి పెట్టకుండా సొమ్ము చేసుకుంటున్నారు. మర ఆడించకుండానే ధాన్యాన్ని మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు తరలించి అమ్ముకుంటుండగా మరి కొందరు ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది. బియ్యం అప్పగించాలని అధికారులు ఒత్తిడి తెచ్చినప్పుడు పీడీఎస్ బియ్యాన్ని సేకరించి సీఎంఆర్ కింద అప్పగిస్తున్నారు. కేటాయింపులు జరిగినప్పటి నుంచి నెల రోజుల లోపు బియ్యం ఇవ్వాలి. కానీ కొందరు ఇచ్చిన ధాన్యంతో వ్యాపారం చేస్తూ బియ్యం అప్పగించకుండా సంవత్సరాలు గుడుపతున్నారు. ఒక సీజన్లో సీఎంఆర్ ధాన్యం తీసుకుని దాంతో వ్యాపారం చేసుకుంటున్నారు. మరో సీజన్లో కేటాయించిన ధాన్యాన్ని మర ఆడించి బియ్యం అప్పగిస్తున్నారు. ఎప్పటికప్పుడు బియ్యం పరీక్షించి తీసుకోవల్సిన అధికారులు దాన్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ నాయకులు, అధికారుల అండతో పలువురు మిల్లుల నిర్వాహకులు అక్రమ దందాకు పాల్పడుతున్నారన్న అభిప్రాయాలున్నాయి. మరో రెన్నెళ్లలో యాసంగి ధాన్యం మార్కెట్కు రానుంది.
రెండు పర్యాయాలు పొడిగింపు
జిల్లాలో వానాకాలం సీజన్కు సంబంధించి కొనుగోలు కేంద్రాల ద్వారా 3,25,444 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. వాటిని జిల్లాలోని 72రా, 63 పారా బాయిల్డ్ రైసు మిల్లులకు మరపట్టి బియ్యంగా మార్చేందుకు అధికారులు అప్పగించారు. ప్రభుత్వం 100 కిలోల ధాన్యం ఇస్తే మర ఆడించి 67 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. మిల్లింగ్ చేసినందుకు ప్రభుత్వం మిల్లర్లకు మిల్లింగ్ ఛార్జీలు ఇస్తుంది. గత నవంబర్లో గడువు ముగియగా బియ్యం అప్పగించడానికి రెండు పర్యాయాలు అవకాశం ఇచ్చారు. డిసెంబర్ 31తో చెల్లించడానికి అవకాశం ఇచ్చారు. మళ్లీ జనవరి చివరి వరకు గడువు పొడిగించారు. మిల్లర్లు 84 శాతం బియ్యాన్ని మాత్రమే అప్పగించారు. ఇంకా 80 మంది రా మిల్లుల నిర్వాహకులు 34 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. గత వేసంగి సీజన్కు సంబంధించి 94,842 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు అప్పగించలేదు. గత నెలలో ధాన్యం అప్పగించిన మిల్లుల్లో తనిఖీలు చేయగా తక్కువ నిలువలు ఉన్న రెండు రైసు మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు..
- చందన్కుమార్, జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి, జగిత్యాల
వానాకాలం సీజన్ సీఎంఆర్ బియ్యం అప్పగించాల్సిన గడువు గత నెలతో ముగిసింది. ఇంకా 80 మంది రా మిల్లుల నిర్వాహకులు 34 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. మళ్లీ గడువు పొడిగించే అవకాశం లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. ఆ మేరకు చర్యలు చేపడతాం. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి అవకతవకలకు పాల్పడిన మిల్లుల నిర్వాహకులపై చర్యలు చేపట్టాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు