డంపింగ్ యార్డుపై నిర్లక్ష్యం
హుజూరాబాద్ పురపాలికలో డంపింగ్ యార్డుకు మోక్షం లభించడం లేదు. స్థలం కేటాయించినా.. నిధులున్నా నిర్లక్ష్యమే అలుముకుంది.
న్యూస్టుడే, హుజూరాబాద్
జూరాబాద్లో ఏళ్ల తరబడి నిర్మాణంలో ఉన్న డంపింగ్ యార్డు
హుజూరాబాద్ పురపాలికలో డంపింగ్ యార్డుకు మోక్షం లభించడం లేదు. స్థలం కేటాయించినా.. నిధులున్నా నిర్లక్ష్యమే అలుముకుంది. పనులు ప్రారంభించి మూడేళ్లు దాటినా ముందుకు సాగక అందుబాటులోకి రావడం లేదు. దీంతో తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువుగా మార్చాలని ప్రభుత్వం నిర్దేశించినా ఇక్కడమాత్రం అమలుకు నోచుకోవడం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపం.. గుత్తేదారు నిర్లక్ష్యం వల్లే పనుల్లో ప్రగతి కనిపించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాగైతే స్వచ్ఛ లక్ష్యం ఎలా నెరవేరుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మూడేళ్లు దాటినా..
హుజూరాబాద్ పురపాలికలోని 30 వార్డుల్లో 49,305 జనాభా ఉండగా 9,351 నివాసగృహాలు ఉన్నాయి. రోజూ 20 వేల మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు కానీ.. డంపింగ్ యార్డు లేకపోవడంతో మొన్నటి వరకు పట్టణంలో సేకరించిన చెత్తను ఇప్పలనర్సింగాపూర్, సిర్సపల్లి ప్రధాన రహదారులకు ఇరువైపులా జనావాసాల మధ్య పడేశారు. విపరీతమైన దుర్గంధం వెదజల్లుతుండటంతో స్థానికుల అభ్యంతరంతో గతంలో డంపింగ్ యార్డు కోసం కేటాయించిన కొత్తపల్లి శివారులోని ఖాళీ స్థలంలో పారబోస్తున్నారు. హుజూరాబాద్ పురపాలికలోని ఇప్పలనర్సింగాపూర్లో అయిదెకరాల స్థలాన్ని కేటాయించి రూ.2.18 కోట్ల అంచనా వ్యయంతో మూడేళ్ల క్రితం పనులను ప్రారంభించారు. పొడి చెత్త కోసం రూ.38 లక్షలతో నిర్మిస్తున్న డ్రై రిసోర్స్ సెంటర్(డీఆర్సీ) ఫిల్లర్ల స్థాయిలోనే ఉంది. బయోమైనింగ్ ద్వారా తడి చెత్తను శుద్ధి చేసి తడి చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చేందుకు రూ.12 లక్షలతో చేపడుతున్న మూడు వర్మీకంపోస్టు షెడ్ల నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. వేబ్రిడ్జి, ఇతర పనులకు రూ.12 లక్షలు కేటాయించినా ఇంకా టెండర్లు పిలువలేదు. అంతర్గత రహదారులకు రూ.18 లక్షలు, రూ.7.50 లక్షలతో డంపింగ్ యార్డుకు వెళ్లే రహదారి నిర్మాణ పనులు చేయాల్సి ఉంది. రూ.15 లక్షలతో డ్రైనేజీ నిర్మించినా ఇంకా పూర్తిస్థాయిలో పనులు కాలేదు. మొత్తం నిధుల్లో ప్రహరీ నిర్మాణానికే రూ.50 లక్షలు ఖర్చు చేయడం గమనార్హం. మొత్తంగా మూడేళ్లు దాటినా 50 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. సకాలంలో బిల్లులు చెల్లించక పనులు పూర్తి చేయడం లేదని గుత్తేదారు చెబుతున్నారు. కాగా రెండు నెలల్లో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ ఏఈ సాంబరాజు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూసేకరణలో జాప్యం
[ 28-03-2024]
భూసేకరణలో జాప్యమే జాతీయ రహదారుల విస్తరణకు శాపంగా మారుతోంది. జిల్లాలో ప్రధానంగా జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిగా మార్చి దశాబ్దం కావస్తున్నా.. నిర్మాణం మొదలు కావటం లేదు -
నత్తనడకన నిర్మాణాలు
[ 28-03-2024]
వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం పల్లెదవాఖానాలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర(సబ్సెంటర్ల)ను పల్లె దవాఖానాలుగా మార్చారు -
నిధులు వెచ్చించి.. పనులు వదిలేసి
[ 28-03-2024]
పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఆధునిక సాంకేతికను జోడించి పెద్ద నగరాలకు దీటుగా పోటీ పడేందుకు ప్రణాళికలు చేసిన నగరపాలిక.. ఆ విధానం అమలులో వెనుకబడింది -
తాగునీటి వృథా వద్దు : కలెక్టర్
[ 28-03-2024]
అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
కాంగ్రెస్ నిజామాబాద్ లోక్సభ స్థానం టికెట్ జీవన్రెడ్డికే దక్కింది. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది -
తొలిమెట్టు నోడల్ అధికారులకు భత్యం
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రత్యేక బోధన పద్ధతులతో కొనసాగుతున్న ఈ కార్యక్రమ పర్యవేక్షణకు మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 28-03-2024]
వాతావరణ సమాచారాన్ని ప్రతిఒక్కరి దైనందిన కార్యకలాపాల్లో భాగం చేయాలనే ఉద్దేశంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇటీవల ‘పంచాయత్ మౌసం సేవా’ మొబైల్ యాప్ విడుదల చేసింది. -
పఠనాలయం సద్వినియోగం... కల సాకారం
[ 28-03-2024]
గ్రంథాలయ పుస్తకాలతోనే ఏకకాలంలో రెండు ఉద్యోగాలు సాధించగలిగాను. తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ నిర్వహించిన ఫలితాల్లో పీజీటీ సాంఘికశాస్త్రం, జూనియర్ కళాశాలలో పౌరశాస్త్రం లెక్చరర్గా ఉద్యోగాలకు ఎంపికయ్యాను -
పంచాయతీల ఖజానా ఖాళీ
[ 28-03-2024]
ఓవైపు ఖజానా ఖాళీ, మరోవైపు సమస్యలు పంచాయతీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జమయ్యే నిధులకు మించిన వ్యయం చేయడంతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఓటు నమోదుకు ప్రత్యేక సాధారణ సెలవు
[ 28-03-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్టటైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్