కాసుల కష్టం.. నిర్మాణాలకు నష్టం
పేదల సొంతింటి కల రెండు పడకగదుల ఇళ్ల రూపంలో తీరడమనేది జిల్లాలో కష్టసాధ్యమైన ప్రక్రియగా మారింది.
రెండుపడక గదుల ఇళ్ల పురోగతికి అవరోధం
ఈనాడు, కరీంనగర్ న్యూస్టుడే- కరీంనగర్ పట్టణం
‘‘మేడమ్.. గుత్తేదారులు ఎవరు ముందుకు రావట్లేదు. కొసరు పనులతో ఉన్న ఇళ్లను మాత్రం పూర్తిచేయిస్తాం. క్షేత్రస్థాయిలో రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం చాలా కష్టమవుతోంది. నిర్మాణదారులు మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతున్నారు. ఏం చేయలేకపోతున్నాం.’’
జడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో చైర్పర్సన్ ఎదుట ర.భ.శాఖ ఇంజినీరింగ్ అధికారి ఆవేదన
పేదల సొంతింటి కల రెండు పడకగదుల ఇళ్ల రూపంలో తీరడమనేది జిల్లాలో కష్టసాధ్యమైన ప్రక్రియగా మారింది. కొంచెం అటూ ఇటూగా దశాబ్ద కాలం నుంచి ఆగుతూ.. సాగుతున్న వీటి నిర్మాణాల విషయంలో గుత్తేదారులు బెంబేలెత్తుతున్నారు. బాబోయ్.. ఈ నిర్మాణాలు మావల్ల కాదనేలా చేతులెత్తేస్తున్నారు. సకాలంలో బిల్లులు అందక.. అందే బిల్లులు నిర్మాణాలకు సరిపడక నష్టాల బాట పడుతున్నామని బోరుమంటున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో మంజూరైన వేలాది ఇళ్ల నిర్మాణాల ప్రక్రియ ముందుకు కదలడం లేదు. పునాదిస్థాయి దాటని తీరుతో చాలాచోట్ల ఇవి అందని ద్రాక్షగానే మారిపోయాయి.
ఎక్కడెక్కడ ఎలా..?
* జిల్లా వ్యాప్తంగా 6,494 ఇళ్లు మంజూరైనా పాలనాపరమైన అనుమతులు అందుకున్న వాటి సంఖ్య 6,360. గ్రామాల్లో రూ.5.04 లక్షలు, పట్టణాల్లో రూ.5.30 లక్షల వ్యయంతో వీటిని నిర్మించేందుకు అప్పట్లో రూ.390.56కోట్లు అంచనా వేశారు. కాలక్రమంగా పెరిగిన ధరలతో నిర్మాణాలు గుత్తేదారులకు గిట్టుబాటు అవడం లేదు.
* మొత్తంగా 789 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. మరో 1,743 నిర్మాణదశలో వివిధ స్థాయిలో ఉన్నాయి. 4,907 ఇళ్లకు అగ్రిమెంట్ పూర్తయింది. 2,138 ఇళ్లకు అసలు నిర్మాణానికి అవసరమైన పునాదులు కూడా పడలేదు. పునాదుల స్థాయిలో 32, బీమ్ దశలో 301, రూఫ్లెవల్లో 183, గోడల దశలో 104, చివరి పనుల్లో 922 ఉన్నాయి.
* హుజూరాబాద్ నియోజకవర్గంలో 264 పూర్తవగా 950 పురోగతిలో ఉన్నాయి. 187 చోట్ల అసలు పని ప్రారంభించలేదు. చొప్పదండి నియోజకవర్గంలో 497కుగానూ 243 పూర్తయ్యాయి. 20 పురోగతిలో ఉండగా 23చోట్ల నిర్మాణాల ఊసేలేదు. మానకొండూర్లో 789 పూర్తవగా మిగతా 223 ఇళ్లకు నిర్మాణ గ్రహణం పట్టుకుంది.
ఇలా.. పునాదులు పడి ఫిల్లర్ల స్థాయిలో అలంకారప్రాయంగా ఉన్న చోట ఈపాటికే బహుళ అంతస్థుల్లో రెండుపడక గదుల ఇళ్లు పూర్తవ్వాల్సి ఉంది. తిమ్మాపూర్ మండలం రామకృష్ణాపూర్ కాలనీలో 2017 నవంబరు 18న స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శంకుస్థాపన చేశారు. రూ.1.88 కోట్ల వ్యయంతో రెండంతస్థుల్లో నిర్మించాలనుకున్న వీటికి ఐదేళ్లు దాటినా ఇంకా ఒక్క ఇటుకని ఇక్కడ పెట్టే సాహసాన్ని చేయలేకపోతున్నారు. పదుల సంఖ్యలో వీటి పురోగతి కోసం సమీక్షలను నిర్వహించినా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనేలా పరిస్థితి మారిపోయింది.
ఇవీ.. కరీంనగర్ శివారులోని చింతకుంట సమీపంలో నిర్మిస్తున్న ఇళ్లు. బహుళ అంతస్థుల్లో నిర్మితమవుతున్న వీటి కోసం ఇప్పటికే వేలసంఖ్యలో అర్జీలు కలెక్టరేట్కు అందాయి. అపార్ట్మెంట్ సంస్కృతిని కళ్లకుగట్టేలా.. ఇందులో 660 మంది లబ్ధిదారులు ఉండేందుకు వీలుగా వీటిని నిర్మిస్తున్నారు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో దాదాపుగా మూడేళ్లుగా ఇక్కడి కొసరు పనులు నింపాదిగా జరుగుతున్నాయి. ఎన్నికలు జరిగే ఏడాది అవడంతో మరో ఐదారు నెలల్లో లబ్ధిదారులకు వీటిని అందిస్తే పలువురు పేదలకు సొంతింటి కల సాకారమయ్యే అవకాశముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
మలేరియా నిర్మూలనకు కృషి
[ 26-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకుని గురువారం జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.