ఈసారైనా వంతెన పూర్తయ్యేనా?
ఏటా భారీ వర్షాలకు నిర్మాణ దశలోనే కూలుతున్న వేములవాడలోని మూలవాగు వంతెన పనులు మళ్లీ మొదలయ్యాయి. ఈసారైనా పూర్తవుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మళ్లీ ప్రారంభమైన పనులు
న్యూస్టుడే, వేములవాడ
గత ఏడాది నిర్మించిన వంతెన ఒక భాగం
ఏటా భారీ వర్షాలకు నిర్మాణ దశలోనే కూలుతున్న వేములవాడలోని మూలవాగు వంతెన పనులు మళ్లీ మొదలయ్యాయి. ఈసారైనా పూర్తవుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనులు మొదలు పెట్టినప్పటి నుంచి మూడు సార్లు పిల్లర్ల దశలోనే కూలిపోయింది. వర్షాకాలంలో భారీ వర్షాలకు మళ్లీ కూలుతుందని గుత్తేదారు భీమ్ల నిర్మాణానికి అల్లిన సలాకను తొలగించారు. ప్రస్తుతం పనులు మొదలు కావడంతో ఈ సారైన పూర్తి చేస్తే ఇబ్బందులు తొలగిపోతాయని భక్తులు, స్థానికులు భావిస్తున్నారు.
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దర్శనానికి రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. వీరికి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు వేములవాడ మూలవాగు పాత వంతెనకు ఇరువైపులా రెండు వంతెనల ఏర్పాటుతో పాటు వాటి వద్ద కూడలి ఏర్పాటు, సుందరీకరణ పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందుకు 2015లో కోర్నెట్ నిధులు రూ. 28 కోట్లు కేటాయించారు. ఇందులో రెండు వంతెనల నిర్మాణానికి రూ.12 కోట్లు కేటాయించారు. నిధులు విడుదల కావడంతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆధ్యాత్మికత ఉట్టి పడేలా డిజైన్ చేయడంతో పాటు పాత వంతెనకు ఇరువైపులా 12 మీటర్ల వెడల్పు, 190 మీటర్ల పొడవుతో రెండు వంతెనలు నిర్మించడానికి రూపకల్పన చేశారు. పడమటి వైపు పూర్తి చేసి మూడేళ్ల క్రితం మహా శివరాత్రి సందర్భంగా వంతెనను ప్రారంభించడంతో కొంత మేరకు భక్తులు, ప్రయాణికుల కష్టాలు తొలగాయి.
వేములవాడ మూలవాగులో చేపడుతున్న పనులు
మూడుసార్లు అంతరాయం
మూలవాగులోని పాత వంతెనకు తూర్పు వైపు నిర్మిస్తున్న వంతెన సెంట్రింగ్ దశలోనే భారీ వర్షాలకు మూడు సార్లు కూలిపోయి పనులకు అంతరాయం ఏర్పడింది. పనులు మొదలు పెట్టి భారీ పిల్లర్లు కట్టి కొంత మేర భీమ్ల నిర్మాణం పూర్తి చేశారు. భీమ్లపై శ్లాబ్ వేసే దశలో 2019 సెప్టెంబరులో భారీ వర్షాలకు సెంట్రింగ్ సపోర్టు కర్రలు కొట్టుకుపోయి భీమ్ వంగి కూలిపోయింది. అప్పటి నుంచి వరదలకు భీమ్ల నిర్మాణానికి స్టీల్ అల్లుతున్న క్రమంలో సపోర్టు కర్రల అడుగు భాగంలో ఇసుక కొట్టుకుపోయి కుంగిపోవడం, కొట్టుకుపోవడం జరుగుతూనే ఉంది. ఏటా ఇలా జరగడం పరిపాటిగా మారింది. వంతెన నిర్మాణంలో అయిదు స్టేజీలుండగా మొదటి దశలోనే కూలిపోవడం పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతూ వస్తోంది. ఇలా మూడు సార్లు ఆదిలోనే కూలి గుత్తేదారుకు నష్టం ఏర్పడింది. వాస్తవానికి ఇది 2018లోనే పూర్తి చేయాల్సి ఉంది. పనుల ఆరంభం నుంచి ఏటా వర్షాలు పెద్ద అడ్డంకిగా మారడంతో ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. ఈసారైనా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు, ప్రజలు కోరుతున్నారు.
వర్షాలు పడేలోపు..
- సతీష్, ఏఈ ఆర్అండ్బీ, వేములవాడ
రెండో వంతెన నిర్మాణ పనులు మొదలయ్యాయి. గతంలో పనులు చేసిన గుత్తేదారే మళ్లీ చేస్తున్నారు. వర్షాలు పడే లోపు రెండు స్టాండ్ల నిర్మాణం పూర్తి చేయడానికి అవకాశం ఉంది. వంతెన చివరిన స్థల సేకరణ జరుగుతోంది. అది పూర్తి కాగానే పూర్తిస్థాయిలో నిర్మాణానికి అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!