నలుగురికే పోడు పట్టాలు
జిల్లాలో పోడు భూముల జాబితా కొలిక్కివచ్చింది. గిరిజన, అటవీశాఖలు రూపొందించిన ఆర్ఓఎఫ్ఆర్, అగ్రాయిడ్ ప్రొ, ప్రాసిట్ అనే మూడు యాప్ల సహాయంతో అర్హులను తేల్చారు.
పోడు సర్వే చేస్తున్న అధికారులు
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్: జిల్లాలో పోడు భూముల జాబితా కొలిక్కివచ్చింది. గిరిజన, అటవీశాఖలు రూపొందించిన ఆర్ఓఎఫ్ఆర్, అగ్రాయిడ్ ప్రొ, ప్రాసిట్ అనే మూడు యాప్ల సహాయంతో అర్హులను తేల్చారు. జిల్లాలో 10 మండలాల్లోని 52 గ్రామపంచాయతీల్లో మొత్తం 8163 ఎకరాల్లోని 4596 దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఉపగ్రహ చిత్రాలతో సాగులోని భూములను గుర్తించారు. జిల్లాలో అత్యధికంగా అనర్హులే ఉండగా కేవలం నలుగురే లబ్ధిదారులుగా నిర్ధారించారు. సబ్ డివిజన్, జిల్లా స్థాయి కమిటీ ఆమోదముద్ర వేసి ప్రభుత్వానికి నివేదించారు. ఈ నెలలో పట్టాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం భావిస్తోంది. దరఖాస్తుల పరిశీలనలో ఆంక్షలు విధించి అర్హత ఉన్నా తిరస్కరించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
ఉపగ్రహ చిత్రాలే ఆధారం
పోడు భూముల పరిశీలనలో శాస్త్రీయ విధానాన్ని వినియోగించారు. అగ్రాయిడ్ ప్రొ, ప్రాసిట్ అనే యాప్ల్లో సరిహద్దులు, విస్తీర్ణాన్ని నిర్ణయించారు. చరవాణిలో యాప్ను తెరవడంతో రైతు పోడు చేసిన భూమి ఏ రేంజి, బీట్, కంపార్ట్మెంట్లోకి వస్తుందో గుర్తించి ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా ఎన్నేళ్ల నుంచి సాగులో ఉన్నట్లు లెక్కించారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులకు 2005, డిసెంబరు 13 కంటే ముందు, మూడు తరాలు అంటే 75 ఏళ్లు గిరిజనేతరులను పరిగణనలోకి తీసుకున్నారు. జిల్లాలో మొత్తం దరఖాస్తుదారులు 4596 ఉండగా ఇందులో 488 మంది 934 ఎకరాల్లో గిరిజనులు, 4108 గిరిజనేతరులు 7229 ఎకరాల్లో దరఖాస్తు చేసుకున్నారు. 2453 మంది రెవెన్యూ, ప్రభుత్వ భూముల్లో దరఖాస్తు చేసుకున్నట్లు తేలింది.
సాంకేతిక విధానంతో..
క్షేత్ర స్థాయిలో సేకరించిన జాబితాను గ్రామ స్థాయిలో ఆర్ఓఎఫ్ఆర్ కమిటీలు అర్హత లేనివాటిని తిరస్కరించారు. ఆయా జాబితాపై సబ్ డివిజన్ కమిటీ(రేంజర్, ఆర్డీవో, ఇతర అధికారులు) పునఃపరిశీలించారు. జిల్లా కమిటీ నిర్ణయం మేరకు జిల్లాలో కేవలం నలుగురు గిరిజనులు సాగులో ఉన్నట్లు జాబితా సిద్ధం చేశారు. వీరికి 1.39 ఎకరాల భూమిని పంపిణీ చేయనున్నారు. చాలా చోట్ల మోకా సర్వే పారదర్శకంగా చేయలేదని ప్రజావాణిలో ఫిర్యాదులు చేస్తున్నారు. శాస్త్రీయ ఆధారాలతో లబ్ధిదారులను గుర్తించడంతో ఫిర్యాదులను అధికారులు పట్టించుకోవడం లేదు. పోడు భూములను కాజేయాలనే దళారుల పన్నాగం ఫలించలేదు. సాంకేతికత విధానం చెక్ పడింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నలుగురు పట్టాహక్కులు పొందనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు