రాత్రిళ్లు నిల్వ.. పగలు తరలింపు
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండా మానేరులో జరుగుతున్న ఇసుక తవ్వకాలను నిలిపివేయాలంటూ చెన్నైలోని ఎన్జీటీ(జాతీయ హరిత ట్రైబ్యునల్) జనవరి 23న ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్జీటీ నిషేధం ఉత్తర్వులు బేఖాతరు
మానేరు ఇసుక రవాణాపై టీఎస్ఎండీసీ చోద్యం
న్యూస్టుడే, పెద్దపల్లి
నిల్వ కేంద్రంలో ఇసుక
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండా మానేరులో జరుగుతున్న ఇసుక తవ్వకాలను నిలిపివేయాలంటూ చెన్నైలోని ఎన్జీటీ(జాతీయ హరిత ట్రైబ్యునల్) జనవరి 23న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 23లోగా అనుమతి పత్రాలను సమర్పించిన తర్వాతే మైనింగ్ జరపాలని ఆదేశించింది.
ఓదెల మండలం గుండ్లపల్లి క్వారీ నుంచి ఇసుక తరలింపునకు రెండు రోజుల కిందట ఆన్లైన్లో 45 ట్రిప్పులకు డబ్బులు చెల్లించి అనుమతి తీసుకున్నారు. కానీ పంచాయతీ ఆధ్వర్యంలోని వసూలు కేంద్రంలో 65 ట్రిప్పులకు రశీదులు ఇచ్చారు. అంటే 20 లారీల ఇసుకను క్వారీ నుంచి అక్రమంగా తరలించినట్లు తేలింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా బోర్నపల్లి క్వారీ నుంచి ఇసుక రవాణాను అక్కడి గ్రామస్థులు అడ్డుకోవడంతో గుత్తేదారులు మానేరుకు ఇవతలి వైపు గ్రామమైన కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేట క్వారీ నుంచి ఇసుక తరలించే యత్నం చేశారు. రెండు రోజుల కిందట కిష్టంపేట గ్రామస్థులు అడ్డుకున్నారు.
జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) ఉత్తర్వుల మేరకు మానేరులో ఇసుక తవ్వకాలను నిలిపివేస్తున్నట్లు టీఎస్ఎండీసీ ప్రాజెక్టు అధికారి శ్రీకాంత్ గత నెల 25న అధికారిక ప్రకటన విడుదల చేశారు. నిల్వ చేసిన ఇసుకను ప్రభుత్వ అవసరాలకు మాత్రమే కేటాయించనున్నట్లు వెల్లడించారు. అయితే వాస్తవాలు మరో రకంగా ఉన్నాయి. టీఎస్ఎండీసీ సైట్లో మానేరు ఇసుక బుకింగ్ ప్రక్రియ నిరాటంకంగా జరుగుతోంది. ఆన్లైన్లో బుకింగ్ చేసుకొని పగలు నిల్వ కేంద్రాల నుంచి, రాత్రిళ్లు వాగులో నుంచి ఇసుకను తరలిస్తున్నారు. మానేరు ఎగువ ప్రాంతాల్లో ఇసుక లేకపోవడంతో దిగువ ప్రాంతాల నుంచి తరలిస్తూ కాసులు దండుకుంటున్నారు. ఇక కోర్టు ఉత్తర్వులకు గౌరవం ఇచ్చే సంస్కృతి కనిపించకుండా పోవడం, గ్రామాల్లో సైతం వసూళ్ల పర్వం కొనసాగుతుండటం, ఇసుక రవాణా ఎన్నాళ్లు జరుగుతుందో తెలియని అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి.
అందినకాడికి వసూళ్లు
ఆన్లైన్లో ప్రభుత్వానికి చెల్లించిన డబ్బుల నుంచి ఇసుక క్వారీ నిర్వాహకుల(గుత్తేదారుల)కు ఇవ్వాల్సిన సొమ్మును ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందో తెలియడం లేదు. దీంతో నిర్వాహకులు అనధికారిక వసూళ్లకు పాల్పడుతున్నారు. లారీ లోడింగ్కు రూ.800, లారీలో అనుమతించిన పరిమాణం కంటే ఎక్కువ పోసేందుకు పొక్లైన్లోని ఒక బకెట్(సుమారు 1.5 క్యూబిక్ మీటర్లు) ఇసుకకు రూ.1800 చొప్పున వసూలు చేస్తున్నారు. దీనికితోడు రహదారులు దెబ్బతింటున్నాయంటూ పంచాయతీలు సైతం ఒక కౌంటర్ ఏర్పాటు చేసుకొని ట్రిప్పుకు ఇంత అని వసూలు చేస్తున్నాయి. లారీల్లో తరలించే ఇసుకను తూకం వేసే వే బ్రిడ్జిలు పని చేయడం లేదు. ఒక వేళ కాంటాలు పని చేసే చోట ఎలాంటి తూకాలు లేకుండానే లారీలను నడిపిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆన్లైన్లో చెల్లించే రుసుం నుంచి గుత్తేదారు, పంచాయతీలకు నిధులు కేటాయిస్తారు. అయినా వసూళ్లు యథేచ్ఛగా జరుగుతున్నాయి.
తరలిస్తున్నా పరిమాణం తగ్గడం లేదు
తవ్వకాలు చేపట్టవద్దని ఎన్జీటీ ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉన్నా నిల్వ కేంద్రాల నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. డంపింగ్ కేంద్రాల్లో ఇసుక నిల్వ పరిమాణం తగ్గడం లేదు. రాత్రి వేళల్లో తవ్వకాలు చేసి నిల్వ చేస్తూ పగటి పూట తరలిస్తున్నారు. ఈ ఇసుక తరలించడానికి పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వదు. ఒకటి, రెండు నెలల్లో ఎన్జీటీ తుది తీర్పు వెలువరించే అవకాశముంది. ఇది కేవలం మానేరుకే కాదు, యావత్ దేశంలోనే డీసిల్టింగ్(పూడికతీత) నిలిచిపోవడానికి దారి తీస్తుంది.
కరుణాకర్రెడ్డి, మానేరు పరిరక్షణ సమితి కన్వీనర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా