ధూప దీపం.. నిధులకు గ్రహణం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆలయాలకు దూప దీప నైవేధ్యం (డీడీఎన్) నిర్వహణకు కష్టమొచ్చింది. దాదాపు ఐదు నెలలుగా నిధులు విడుదల కాకపోవడంతో అర్చకులు అప్పులు చేసి నిర్వహణ బాధ్యతలు చేపడుతున్నారు.
న్యూస్టుడే, కరీంనగర్ సాంస్కృతికం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆలయాలకు దూప దీప నైవేధ్యం (డీడీఎన్) నిర్వహణకు కష్టమొచ్చింది. దాదాపు ఐదు నెలలుగా నిధులు విడుదల కాకపోవడంతో అర్చకులు అప్పులు చేసి నిర్వహణ బాధ్యతలు చేపడుతున్నారు. నమ్ముకున్న దేవుడికి ఈ కార్యక్రమం నిర్వహించకపోతే భక్తుల ముందు చులకన అవుతామనే వారిని వెంటాడుతోంది. ఆలయాల్లో నిత్య పూజా కార్యక్రమాలు చేయడం తమ ఆచార ధర్మంగా భావించి అప్పులు చేస్తున్నారు.
అరకొర వేతనం..అయినా సేవలు
అరకొర వేతనం అందుకుంటున్న అర్చకులు దేవుడి సేవలో తరిస్తూ నాలుగు కార్యక్రమాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్రెడ్డి ‘ధూప దీప నైవేధ్యం’ పథకం చేపట్టారు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 1809 ఆలయాల్లో అమలు చేశారు. అర్చకుడికి రూ.1500, ధూప దీప నైవేధ్యం కింద రూ.వెయ్యి చెల్లించేవారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల్లో తెరాస అధికారంలోకి వస్తే రూ.6 వేలు చెల్లిస్తామని ప్రకటించి, అమలు చేశారు. పూజా కార్యక్రమానికి రూ.2 వేలు, అర్చకుడికి రూ.4 వేలు చెల్లిస్తున్నారు. పెరుగుతున్న ధరల దృష్ట్యా రూ.10 వేలకు పెంచాలని అర్చక ఉద్యోగుల డిమాండ్ వస్తోంది.
విస్తరణకు దరఖాస్తుల ఆహ్వానం..
పథకాన్ని మరిన్ని ఆలయాలకు విస్తరించాలని నాలుగు నెలలలో రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు అయిదు మంది దరఖాస్తు చేసుకున్నారు. క్షేత్ర స్థాయి పరిశీలనతో అర్చకులకు మౌఖికంగా పరీక్షించారు. మళ్లీ రెండో విడత దాదాపు 70 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎప్పుడు, ఎన్ని భర్తీ చేస్తారోనని అర్చకులు, ఆలయ కమిటీ ఎదురుచూస్తున్నాయి. జిల్లా దేవాదాయ శాఖ అధికారులు మాత్రం వచ్చిన దరఖాస్తులను రాష్ట్ర అధికారులకు పంపించామని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అంటున్నారు.
పూజా సామగ్రి కొనుగోలుకు కష్టం..
ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 632 మంది పథకం కింద పని చేస్తున్నారు. వీరందరికీ ఐదు నెలలుగా నిధులు రావడంలేదు. చాలిచాలనీ వేతనాలతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఆలయానికి కావాల్సిన నూనె, వత్తులు, అగర్ వత్తులు, కర్పూరం, తదితర సామగ్రి కొనుగోలుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దేవాదాయ శాఖకు వేల కోట్ల రూపాయాలు రాష్ట్రంలోని ప్రధాన దేవాలయల నుంచి వస్తోంది. కామన్ గుడ్ ఫండ్ కింద దేవాదాయ శాఖ ఉన్నత శ్రేణి ఆలయాలతోపాటు 6ఏ, 6బీ ఆలయాలు నిధులు జమ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో స్పందించి వెంటనే నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.
బడ్జెట్ విడుదల కాగానే నేరుగా జమ
- ఆకునూరి చంద్రశేఖర్, సహాయ కమిషనర్, దేవాదాయ శాఖ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా
ఉన్నతాధికారుల ప్రకారం దేవాలయాలకు నవంబరు, డిసెంబరు వేతనాలు రావాల్సి ఉంది. వారి బిల్లులు చేసి రాష్ట్ర అధికారులకు పంపించగా ట్రెజరీకి పంపించినట్లు ఉన్నతాధికారులు చెప్పారు. బడ్జెట్ విడుదల కాగానే నేరుగా వారి ఖాతాల్లోనే జమ అవుతాయి. బిల్లులు పంపించడం వరకే మాకు అధికారాలు ఉన్నాయి.
ఉద్యోగ భద్రత కల్పించాలి
- సముద్రాల శ్యాంసుందరాచార్యులు, అధ్యక్షుడు, డీడీఎన్ ఉమ్మడి జిల్లా శాఖ
అర్చకులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయిదారు నెలలుగా నిధులు విడుదల కావడంలేదు. ఆలయ కార్యనిర్వహణలో వారు అల్లాడుతున్నారు. పది మందిని దేవుడి తరఫున ఆశీర్వదించే మేము చేయి చాచి అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి. భవిష్యత్తులో ఉద్యోగ భద్రత కల్పించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్