సమ్మిళిత ప్రగతి.. అనితర ఖ్యాతి
అన్ని రంగాల అభివృద్ధి.. తలసరి ఆదాయం పెరుగుదలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. అవకాశాల సద్వినియోగంతో పల్లెలు, పట్టణాలు ఆయా రంగాల్లో అనితర ఖ్యాతిని ఆర్జిస్తున్నాయి.
మారుతున్న ఉమ్మడి జిల్లా ముఖ స్వరూపం
సామాజిక ఆర్థిక సర్వే-2023లో వెల్లడి
ఈనాడు, కరీంనగర్
అన్ని రంగాల అభివృద్ధి.. తలసరి ఆదాయం పెరుగుదలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. అవకాశాల సద్వినియోగంతో పల్లెలు, పట్టణాలు ఆయా రంగాల్లో అనితర ఖ్యాతిని ఆర్జిస్తున్నాయి. నాలుగు జిల్లాల పరిధిలో వనరులు, సౌకర్యాలు సామాజిక స్థితిగతులను మారుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2023 సామాజిక ఆర్థిక సర్వే వివరాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
ఆ రెండింటా ఘనం
స్థూల జిల్లా స్థూల ఉత్పత్తి(జీడీడీపీ), తలసరి ఆదాయం పెరుగుదల విషయంలో ఉమ్మడి జిల్లా జోరు చూపిస్తోంది. సహజ వనరుల ద్వారా ఏటా ఆదాయం పెరుగుతోంది. ఇదే తరుణంలో ప్రజల తలసరి ఆదాయంలో పురోగతి కనిపిస్తోంది. ఈ విషయంలో రాష్ట్ర స్థాయిలో 11వ స్థానంలో ఉంది. జిల్లాలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవలు, కొనుగోలు, ఇతర సేవలను జీడీడీపీగా పరిగణిస్తారు. ఆర్థిక వ్యవస్థకు ఇదే ప్రధాన సూచీ. పెట్టుబడులు, దిగుబడులతో పాటు వ్యయాలను పరిగణనలోకి తీసుకునేందుకు ఇదే కొలమానంగా మారుతుంది. గత మూడేళ్లలో నాలుగు జిల్లాల స్థూల ఉత్పత్తి ప్రస్తుత ధరలకు అనుగుణంగా క్రమంగా పెరుగుతోంది.
* పల్లెప్రగతిలో మొబైల్ యాప్ వినియోగంతో పంచాయతీల భాగస్వామ్యంలో జగిత్యాల(86.40 శాతం) జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానాన్ని దక్కించుకుంది. పెద్దపల్లి(86.12) నాలుగు, సిరిసిల్ల(84.49) తొమ్మిది, కరీంనగర్(83.71) 11వ స్థానాల్లో ఉన్నాయి.
విద్యుత్తు కనెక్షన్లు (శాతాల్లో)
వ్యవసాయ కనెక్షన్లలో 24.25 శాతంతో జగిత్యాల రాష్ట్రంలోనే మెరుగైన స్థానంలో ఉంది. ఆ తరువాత కరీంనగర్లోనూ ఎక్కువ కనెక్షన్లున్నాయి. పదో స్థానంలో కరీంనగర్, 13వ స్థానంలో పెద్దపల్లి, 25వ స్థానంలో సిరిసిల్ల ఉన్నాయి.
ప్రత్యేకతల సమాహారం
* ఉపాధిహామీ పనిదినాల కల్పనలో పెద్దపల్లి 121 శాతం, కరీంనగర్, సిరిసిల్లలు 115 శాతం, జగిత్యాల 105 శాతంతో పురోగతి సాధించాయి.
* అడవుల విస్తీర్ణంలో రాష్ట్రంలోనే కరీంనగర్ అట్టడుగు స్థానంలో ఉంది. కేవలం 0.1 శాతం అటవీ భూ భాగం ఉంది. సిరిసిల్ల(20.2), జగిత్యాల(19.6), పెద్దపల్లి(15.5)లో ఓ మోస్తరుగా ఉంది.
* సంసద్ ఆదర్శ గ్రామ యోజన(ఎస్ఏజీవై) అమలులో దేశంలోనే కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నెంపల్లి (99.97 శాతం) 3వ స్థానంలో, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్(99.61 శాతం) 17వ స్థానంలో నిలిచాయి.
* స్వచ్ఛసర్వేక్షణ్లో 50 వేల నుంచి లక్ష జనాభా కలిగిన పురపాలికలో సిరిసిల్ల సెల్ఫ్ సస్టెనేబుల్ సిటీగా అవార్డు అందుకోగా.. కోరుట్ల ఫాస్ట్ మూవింగ్ విభాగంలో, వేములవాడ సిటిజన్ ఫీడ్బ్యాక్లో మెరుగైన ఫలితాల్ని అందుకున్నాయి.
* ఏడాదిలో పౌల్ట్రీ ఉత్పత్తి విషయంలో కరీంనగర్(21.68 లక్షలు) రాష్ట్రంలోనే నాలుగో స్థానంలో ఉంది. జగిత్యాల(8.67 లక్షలు), పెద్దపల్లి(10.70 లక్షలు), సిరిసిల్ల(7.44 లక్షలు) జిల్లాలు వెనుకబడ్డాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి