నిధులు మంజూరైనా నిర్మాణాలేవీ..!
రామగుండం నగరపాలక ప్రాంతాభివృద్ధి కోసం వివిధ పథకాల్లో నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం వాటిని విడుదల చేయడంతో నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రామగుండంలో అర్ధాంతరంగా నిలిచిన అభివృద్ధి
న్యూస్టుడే, గోదావరిఖని పట్టణం
రామగుండం నగరపాలక ప్రాంతాభివృద్ధి కోసం వివిధ పథకాల్లో నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం వాటిని విడుదల చేయడంతో నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయా నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. అధికారుల ప్రణాళిక లోపం రామగుండం అభివృద్ధికి విఘాతంగా మారుతుంది. కేంద్ర, రాష్ట్ర పరిశ్రమలకు నిలయమైన రామగుండం ప్రాంతంలో ప్రధానమైన అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు.
రెండు దశాబ్దాలుగా ...
స్వశక్తి మహిళల కోసం హనుమాన్నగర్లో సుమారు రెండు దశాబ్దాల క్రితం చేపట్టిన సామాజిక భవనం పిల్లర్లకే పరిమితమైంది. పనులు మొదలయ్యాక అంచనాలను మార్చిన పాలకవర్గం, దానికి అనుగుణంగా నిధులు కేటాయించలేదు. ఐదేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో ఆడిటోరియం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులు రూ.4 కోట్లు కేటాయించి గుత్తేదారునకు పనులు అప్పగించినా పనులు మొదలు కాలేదు.
విజ్ఞాన కేంద్రం.. పునాదులకే పరిమితం
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులు రూ.5 కోట్లతో మల్కాపూర్ శివారులో అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రం నిర్మాణానికి నాలుగేళ్ల క్రితం నిధులు కేటాయించారు. ఎట్టకేలకు రెండేళ్ల క్రితం పనులు మొదలు కాగా నిధుల కొరతతో అర్ధాంతరంగా వదిలేశారు. పనులు పునాదుల వరకు రాగానే కొంత మేరకు బిల్లు గుత్తేదారుకు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గుత్తేదారు సదరు పనిని అర్ధాంతరంగా నిలిపివేశారు. నిరుద్యోగ యువతీ యువకులతో పాటు విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచాల్సిన అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రం ఇలా పునాదులకే పరిమితమైంది.
బహుళ ప్రయోజనకర భవనం దుస్థితి
నగరపాలక పాత కార్యాలయం, సీనియర్ సిటిజన్ పార్కు ఆవరణలో బహుళ ప్రయోజనకర భవనం నిర్మాణం కోసం ఐదేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులు రూ.8 కోట్లు మంజూరు చేసింది. ఎట్టకేలకు సుమారు రెండేళ్ల క్రితం పనులు మొదలయ్యాయి. దాదాపు రూ.2 కోట్ల వరకు పనులు పూర్తి చేసిన గుత్తేదారు మధ్యంతర చెల్లింపుల కోసం బిల్లులను ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో పనులను ఆపేశారు. ఇప్పటికే లక్ష్మీనగర్ ప్రాంతంలో నిర్మాణం పూర్తయిన నగరపాలక వాణిజ్య భవన సముదాయం నిరుపయోగంగా ఉండగా తాజాగా బహుళ ప్రయోజనకర భవన నిర్మాణం నిలిచిపోయింది.
సమీకృత మార్కెట్ పూర్తయ్యేదెన్నడు..
విఠల్నగర్లో సమీకృత మార్కెట్ నిర్మాణం కోసం సుమారు ఒకటిన్నర దశాబ్దాల క్రితమే ప్రణాళికలు సిద్ధం చేసిప్పటికీ ఐదేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులు రూ.5 కోట్లు మంజూరు చేశారు. నాలుగేళ్ల క్రితం సమీకృత మార్కెట్తో పాటు సామాజిక భవన నిర్మాణం పనులు చేపట్టారు. దాదాపు రూ.1.5 కోట్ల మేరకు పనులు పూర్తికాగా బిల్లుల కోసం రెండున్నరేళ్ల క్రితం బిల్లులను సమర్పించినా నిధులు విడుదల కాలేదు. అధికారులు, పాలకవర్గం ఒత్తిళ్లతో మరో రూ.1.5 కోట్ల వరకు పనులు చేపట్టినా బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు చేతులెత్తేశాడు. పనులు నిలిచిపోవడంతో ఇప్పుడు ఆ ప్రాంతం ఆసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది.
కాగితాల్లోనే ‘ప్రత్యేక నిధులు’
రామగుండం అభివృద్ధి కోసం ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆచరణకు నోచుకోవడం లేదు. ఈ సారైనా ప్రత్యేక నిధులు రూ.100 కోట్లు వస్తాయేమోననే ఆశతో ఏటా రామగుండం నగరపాలిక బడ్జెట్లో అంచనా ఆదాయంలో రూ.100 కోట్లు చేరుస్తూనే ఉన్నారు. 2016-17, 2017-18లో మాత్రమే ఏటా రూ.100 కోట్ల చొప్పున రూ.200 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం ఆ తర్వాత మంజూరును విస్మరించగా మంజూరు చేసిన రెండేళ్ల నిధుల్లోంచి ఇప్పటి వరకు కేవలం రూ.83.5 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. దీంతో ఆయా నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఏళ్లు గడుస్తున్నా కొన్ని పనులు మొదలే కావడం లేదు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు దృష్టి సారించాలని నగర ప్రజలు కోరుతున్నారు.
చువ్వలు తుప్పు పడుతున్నాయ్
విఠల్నగర్లో చేపట్టిన సమీకృత మార్కెట్ భవనం పనులు పూర్తికాకపోగా తాజాగా మరో రూ.4.5 కోట్లతో ఎన్టీఆర్ నగర్లో మరో సమీకృత మార్కెట్ భవన నిర్మాణం పనులను ఏడాదిన్నర క్రితం చేపట్టారు. పునాదుల వరకు పనులు కాగానే బిల్లుల కోసం ప్రభుత్వానికి గుత్తేదారు నివేదించినా ప్రయోజనం లేకపోవడంతో అర్ధాంతరంగా పనులను ఆపేశారు. పనుల పురోగతి ఆధారంగా బిల్లులు చెల్లిస్తేనే గుత్తేదార్లు పనులు చేపట్టే అవకాశమున్నప్పటికీ ఆ దిశగా ప్రభుత్వం, పాలకవర్గం చర్యలు తీసుకోవడం లేదు. దీంతో పునాదుల్లోని ఇనుప చువ్వలు తుప్పు పట్టిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.
అనాలోచిత నిర్ణయం...
ఆసుపత్రి అభివృద్ధికి స్థలం అవసరముంటుందని వైద్య ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసినా పట్టించుకోని నగరపాలిక గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి ముందున్న ఖాళీ స్థలాన్ని స్వాధీనం చేసుకొని ‘అమృత్’ నిధులు రూ.5 కోట్లతో ఉద్యానవనం నిర్మాణానికి పూనుకున్నారు. బోటింగ్ కోసం తవ్వకాలు, ప్రహరీ నిర్మాణం తదితర పనుల కోసం సుమారు రూ.42 లక్షలు ఖర్చు చేశారు. నిధులు లేక వదిలేశారు. తాజాగా ఈ స్థలంలో 650 పడకల సామర్థ్యంతో ఆసుపత్రి భవన నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రయోజనకరమైనా ఉద్యానవనం పేరిట వెచ్చించిన నిధులు వృథా అయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం
[ 18-04-2024]
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణోత్సవాన్ని ఆలయ వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
నేటి నుంచి నామినేషన్లు షురూ!
[ 18-04-2024]
ఎన్నికల సమరంలో అసలైన ఘట్టం గురువారం నుంచి మొదలవనుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ నెల రోజుల కిందటే వెలువడినప్పటికీ నేడు వెలువడే అధికారిక నోటిఫికేషన్తో అసలు అంకం షురూ అవనుంది. -
ప్రచార పర్వానికి కాంగ్రెస్ సిద్ధం!
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి గురువారం నామపత్రాల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమవుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లోక్సభ స్థానం పరిధిలో ప్రచార కసరత్తు ప్రారంభించింది. -
కొప్పుల మొదటిసారి.. జీవన్ మూడోసారి
[ 18-04-2024]
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో వేర్వేరు పార్టీలు, వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న తాటిపర్తి జీవన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్లకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా గెలుపొందిన జీవన్రెడ్డి స్వగ్రామం పెగడపల్లి మండలం బతికెపల్లి. -
క్లిక్ దూరంలో సమగ్ర సమాచారం
[ 18-04-2024]
ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వెబ్సైట్ రూపొందించింది. ceotelangana.nic.in లో ఓటరు నమోదుతో పాటు సవరణలు, తొలగింపులు తదితర అంశాలుంటాయి. -
రెండు సార్లు ఎంపీ.. సాధారణ జీవనం
[ 18-04-2024]
వరుసగా రెండు సార్లు ఎంపీగా ఎన్నికైనా చివరి శ్వాస వరకు పల్లెటూరులోనే సాధారణ జీవితం గడిపారు జువ్వాడి రమాపతిరావు. 1916లో గన్నేరువరంలో జన్మించిన ఆయన వివాహం అనంతరం అత్తగారి ఊరైన గంగాధర మండలం సర్వారెడ్డిపల్లికి వచ్చి స్థిరపడ్డారు. -
ఎన్నికల పరిశీలకులొస్తున్నారు
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెంచింది. -
హాట్రిక్ విజేత..అరుదైన ఘనత
[ 18-04-2024]
ఉమ్మడి జిల్లాలో నలుగురు నేతలు వరుసగా మూడు సార్లు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ రికార్డు సొంతం చేసుకున్నారు. కరీంనగర్ నుంచి ముగ్గురు, పెద్దపల్లి నుంచి ఒకరు గెలుపొంది రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు. -
అక్కడ స్థానికేతరులే అధికం
[ 18-04-2024]
1962లో ఆవిర్భవించిన పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు ఒక్కసారి మినహా అన్ని ఎన్నికల్లో స్థానికేతరులే గెలుపొందారు. 1980లో 7వ లోక్సభ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన కోదాటి రాజలింగం మాత్రమే స్థానికుడు. -
వసతుల మెరుగుకు కార్యాచరణ
[ 18-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం నగరపాలికల్లో కనీస మౌలిక వసతులు మెరుగుపర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రధానంగా తాగునీరు, భూగర్భ మురుగునీటి వ్యవస్థను బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటారు. -
ఆదాయంలో జమ్మికుంట మార్కెట్ టాప్
[ 18-04-2024]
పంటలకు పెరిగిన మద్దతు ధర, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పాత బకాయిలు జమకావటం, చెక్పోస్టులు, గిడ్డంగుల అద్దెలు, లైసెన్సులు, మార్కెట్లకు వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాల ద్వారా లభించే ఆదాయంతో ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల వ్యవసాయ మార్కెట్ మినహా కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లు మార్కెటింగ్ శాఖ నిర్ణయించిన ఆర్థిక ఆదాయ లక్ష్యాన్ని అధిగమించాయి. -
ఓటరు దరఖాస్తులకు త్వరితగతిన పరిష్కారం
[ 18-04-2024]
నామినేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సూచించారు. బుధవారం ఆయన నిర్వహించిన పెద్దపల్లి నుంచి కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, శ్యామ్ప్రసాద్లాల్లు పాల్గొన్నారు. -
మిల్లుల్లోనే బియ్యం.. ధాన్యానికేదీ స్థలం?
[ 18-04-2024]
గత వానాకాలం సీజన్కు సంబంధించిన బియ్యానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో మిల్లుల్లోనే నిల్వలు పేరుకుపోయాయి. గత సీజన్కు సంబంధించిన సీఎంఆర్ లక్ష్యాలను మిల్లర్లు పూర్తి చేయాలనే గడువును జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పొడిగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియ శ్రీనేత్
-
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు