సహకార సంఘాలు.. వ్యాపార వృద్ధి మార్గాలు
ఉమ్మడి జిల్లా పరిధిలో 128 సహకార సంఘాల్లో రైతులకు సేవలు అందించడంతో పాటు మరింత ఆదాయాన్ని సమకూర్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కామన్ సర్వీసు కేంద్రాలను ఏర్పాటు చేసుకునే అవకాశం లభించింది.
విజయ బ్రాండ్ ఉత్పత్తుల విక్రయాలపై దృష్టి
చిగురుమామిడి వ్యవసాయ సహకార సంఘం
న్యూస్టుడే, కరీంనగర్ పట్టణం: ఉమ్మడి జిల్లా పరిధిలో 128 సహకార సంఘాల్లో రైతులకు సేవలు అందించడంతో పాటు మరింత ఆదాయాన్ని సమకూర్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కామన్ సర్వీసు కేంద్రాలను ఏర్పాటు చేసుకునే అవకాశం లభించింది. దీంతో రాష్ట్రంలో విజయ సంస్థకు సంబంధించి నూనెలు, బియ్యం, గోధుమ పిండి వంటి ఉత్పత్తులను విక్రయించేందుకు వీలుగా కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో అన్ని సహకార సంఘాలు, ధాన్యం కొనుగోళ్లు, ఎరువులు, విత్తనాల అమ్మకాలు, రైస్మిల్లుల నిర్వహణ, సూపర్మార్కెట్లు, మినరల్ వాటర్ ప్లాంట్లు వంటివి ఏర్పాటు చేసి ఆదాయాన్ని పెంచుకునే దిశగా ఉన్నారు. ఇవేకాకుండా సుమారు 36కు పైగా సహకార సంఘాల పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్నారు. వీటిని పెట్రోలియం సంస్థల ఔట్లెట్లుగా మార్చాలని కేంద్రాన్ని కోరుతున్నారు.
ఏప్రిల్లో సెంటర్లు
ప్రతీ సంఘ పరిధిలో ఒక కామన్ సర్వీసు సెంటర్లు ఉండేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని 128 సహకార సంఘాలను కంప్యూటీకరణ జరిగింది. ప్రత్యేక సిబ్బంది కూడా ఉన్నారు. ఈక్రమంలోనే కామన్ సర్వీసు సెంటర్లు ఏర్పాటు సులభతరం కానుంది. కంప్యూటర్, ప్రింటర్, బయోమెట్రిక్ పరికరం, ఇంటర్నెట్ కనెక్షన్ వంటివి అవసరం. ఇవన్నీ ఆయా సహకార సంఘాలకు ఉన్నాయి. ఈ కేంద్రం ఏర్పాటు, నిర్వహణ తీరు వంటి అంశాలపై ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రతినిధి శ్రీధర్ ఇటీవల జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో వివరించారు. ఆధార్ సవరణలు, బీమా డబ్బుల చెల్లింపులు, రైల్వే, విమాన టిక్కెట్ల బుకింగ్లు, ప్రధానమంత్రి కిసాన్ యోజన రిజిస్ట్రేషన్, పాన్కార్డుకు దరఖాస్తు చేయడం, తపాలా సేవలు వినియోగించుకోవడం, అయూష్మాన్భవ నమోదు, దాదాపు 300 సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. దీని నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఒకరికి ఉపాధి లభిస్తోంది. వీటితో పాటు ఆయిల్సీడ్ కార్పొరేషన్ ద్వారా వంటనూనెతో పాటు 66 రకాల బ్రాండ్ల అమ్మకాలకు కూడా ఆ సంస్థ అవకాశం లభిస్తోంది.
ఆదాయ వనరులు పెంచుకునేలా..
సహకార సంఘాల పరిధిలో రైతులకు రుణాలివ్వడం, వసూలు చేయడం ద్వారా వచ్చే ఆదాయం సరిపోవడం లేదు. ధాన్యం కొనుగోలు, ఎరువులు విత్తనాల విక్రయాలు కూడా కొనసాగుతున్నాయి. ఛైర్మన్ల జీతభత్యాలు, సంఘాల కార్యనిర్వహణాధికారులు, ఇతర సిబ్బంది జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల అదనపు సిబ్బంది కూడా పని చేస్తున్నారు. దీంతో సంఘాల ఆదాయ వనరులు పెంచుకునేలా కార్యచరణ చేపడుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సేవలు అందిస్తాం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సేవలు అందేలా రాష్ట్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు రవీందర్రావు ప్రయత్నాలు చేస్తున్నారు. విజయ ఉత్పత్తులు కూడా విక్రయించేందుకు కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. కామన్ సర్వీస్ సెంటర్ ఏప్రిల్లో ప్రారంభం అవుతోంది.
సత్యనారాయణరావు, సీఈవో, కేడీసీసీబీ, కరీంనగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూసేకరణలో జాప్యం
[ 28-03-2024]
భూసేకరణలో జాప్యమే జాతీయ రహదారుల విస్తరణకు శాపంగా మారుతోంది. జిల్లాలో ప్రధానంగా జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిగా మార్చి దశాబ్దం కావస్తున్నా.. నిర్మాణం మొదలు కావటం లేదు -
నత్తనడకన నిర్మాణాలు
[ 28-03-2024]
వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం పల్లెదవాఖానాలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర(సబ్సెంటర్ల)ను పల్లె దవాఖానాలుగా మార్చారు -
నిధులు వెచ్చించి.. పనులు వదిలేసి
[ 28-03-2024]
పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఆధునిక సాంకేతికను జోడించి పెద్ద నగరాలకు దీటుగా పోటీ పడేందుకు ప్రణాళికలు చేసిన నగరపాలిక.. ఆ విధానం అమలులో వెనుకబడింది -
తాగునీటి వృథా వద్దు : కలెక్టర్
[ 28-03-2024]
అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
కాంగ్రెస్ నిజామాబాద్ లోక్సభ స్థానం టికెట్ జీవన్రెడ్డికే దక్కింది. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది -
తొలిమెట్టు నోడల్ అధికారులకు భత్యం
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రత్యేక బోధన పద్ధతులతో కొనసాగుతున్న ఈ కార్యక్రమ పర్యవేక్షణకు మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 28-03-2024]
వాతావరణ సమాచారాన్ని ప్రతిఒక్కరి దైనందిన కార్యకలాపాల్లో భాగం చేయాలనే ఉద్దేశంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇటీవల ‘పంచాయత్ మౌసం సేవా’ మొబైల్ యాప్ విడుదల చేసింది. -
పఠనాలయం సద్వినియోగం... కల సాకారం
[ 28-03-2024]
గ్రంథాలయ పుస్తకాలతోనే ఏకకాలంలో రెండు ఉద్యోగాలు సాధించగలిగాను. తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ నిర్వహించిన ఫలితాల్లో పీజీటీ సాంఘికశాస్త్రం, జూనియర్ కళాశాలలో పౌరశాస్త్రం లెక్చరర్గా ఉద్యోగాలకు ఎంపికయ్యాను -
పంచాయతీల ఖజానా ఖాళీ
[ 28-03-2024]
ఓవైపు ఖజానా ఖాళీ, మరోవైపు సమస్యలు పంచాయతీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జమయ్యే నిధులకు మించిన వ్యయం చేయడంతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఓటు నమోదుకు ప్రత్యేక సాధారణ సెలవు
[ 28-03-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా