లక్ష్యం చేరని వ్యవసాయ మార్కెట్ల ఆదాయం!
తగ్గిన పంట దిగుబడి, ధరల ప్రభావం వ్యవసాయ మార్కెట్లపై పడింది. మార్కెటింగ్ శాఖ గతేడాది వరంగల్ రీజినల్ పరిధిలోని 19 జిల్లాల్లో 106 వ్యవసాయ మార్కెట్లలో నిర్ణీత ఆదాయ లక్ష్యాన్ని నిర్ణయించగా 80 శాతం ఆదాయమే లభించింది.
జమ్మికుంట మార్కెట్లో పత్తి బిడ్డింగ్ దృశ్యం
న్యూస్టుడే, జమ్మికుంట: తగ్గిన పంట దిగుబడి, ధరల ప్రభావం వ్యవసాయ మార్కెట్లపై పడింది. మార్కెటింగ్ శాఖ గతేడాది వరంగల్ రీజినల్ పరిధిలోని 19 జిల్లాల్లో 106 వ్యవసాయ మార్కెట్లలో నిర్ణీత ఆదాయ లక్ష్యాన్ని నిర్ణయించగా 80 శాతం ఆదాయమే లభించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లలో రూ.431.68 కోట్లు ఆదాయం సాధించేందుకు నిర్ణయించిన లక్ష్యంలో తాజాగా రూ.346.15 కోట్లు (80శాతం) సాధించింది. రీజినల్ పరిధిలోని నాలుగు జిల్లాల మార్కెట్లు మాత్రం నిర్ణయించిన ఆదాయ లక్ష్యాన్ని అధిగమించటం విశేషం.
4 జిల్లాల్లో ముందంజ
గతేడాది నిర్ణయించిన మార్కెట్ల నిర్ణీత ఆదాయ లక్ష్యాన్ని 11 మాసాల్లోనే యాదాద్రి జిల్లా అధిగమించి రూ.25.95 కోట్ల ఆదాయంతో (137 శాతం) రీజినల్ పరిధిలో ప్రథమ స్థానాన్ని సాధించింది. సిరిసిల్ల జిల్లాలోని మార్కెట్ల ద్వారా 8.98 కోట్ల ఆదాయం (109 శాతం), నల్గొండలోని మార్కెట్ల ద్వారా రూ.70.43 కోట్ల ఆదాయం (105శాతం), కరీంనగర్లోని ఏడు మార్కెట్ల ద్వారా రూ.22.92 కోట్ల (102 శాతం) ఆదాయం లభించగా మిగితా 15 జిల్లాలు వెనుకంజలో నిలిచాయి.
మన వద్ద ఇలా..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, సిరిసిల్ల్లలోని మార్కెట్లు నిర్ణీత లక్ష్యాన్ని అధిగమించటం విశేషం. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్కు రూ.7.02 కోట్ల ఆదాయం (101 శాతం) లభించింది. కరీంనగర్ రూ.4.39 కోట్ల (110 శాతం), హుజూరాబాద్ రూ.5.15 కోట్ల (159 శాతం), మానకొండూరు రూ.1.83 కోట్ల (101 శాతం), గోపాల్రావుపేట మార్కెట్ రూ.1.35 కోట్ల (64 శాతం) ఆదాయం లభించింది. ప్రభుత్వం నుంచి ధాన్యం విక్రయాలకు సంబంధించిన మార్కెట్ ఫీజు, పలు రకాల పాత బకాయిలు తాజాగా జమ కావటంతో జమ్మికుంట, హుజూరాబాద్ మార్కెట్ల ఆదాయం అంచనాకు మించి దాటింది. జిల్లాలో 22.38 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని మార్కెటింగ్ శాఖ నిర్ణయించగా, 22.92 కోట్ల ఆదాయం మార్కెట్ల ద్వారా లభించింది. సిరిసిల్ల జిల్లాలోని 8 వ్యవసాయ మార్కెట్ల ద్వారా 8.25 కోట్ల లక్ష్యం కాగా, 8.92 కోట్లు లభించటం విశేషం. పెద్దపల్లి జిల్లాలోని 8 మార్కెట్ల ఆదాయ లక్ష్యం రూ.24.48 కోట్ల ఉండగా రూ.14.26 కోట్లు మాత్రమే (58 శాతం) లభించింది. జగిత్యాల జిల్లాలోని 13 మార్కెట్ల ద్వారా 21.52 కోట్ల లక్ష్యానికి రూ.18.43 కోట్ల ఆదాయం (86 శాతం) లభించింది. వ్యవసాయ మార్కెట్లకు పంట క్రయవిక్రయాలతో వచ్చే మార్కెట్ ఫీజు, లైసెన్స్ ఫీజులు, గిడ్డంగులు, క్యాంటిన్ల నిర్వహణ, చెక్పోస్టుల ద్వారా పలు రకాల టెండర్లు, ఇతరత్రా ఆదాయం లభిస్తాయని అధికారులు అంటున్నారు.
పాత బకాయిలు జమ కాకపోవడంతో..
* ఇ.మల్లేశం, ఆర్జేజీ, మార్కెటింగ్ శాఖ, వరంగల్వరంగల్ రీజినల్ పరిధిలో నాలుగు జిల్లాల్లోని మార్కెటింగ్ శాఖకు నిర్ణీత లక్ష్యాన్ని అధిగమించి ఆదాయం సమకూరింది. పత్తి ధర, పంట దిగుబడి తగ్గుదల, ధాన్యానికి సంబంధించిన మార్కెట్ ఫీజు ఆయా మార్కెట్లకు జమకాకపోవటంతోనూ నిర్ణీత ఆదాయం లభించలేదు. మార్చితో ఆర్థిక సంవత్సరం పూర్తయ్యాక కొద్దిమేర మార్కెట్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూసేకరణలో జాప్యం
[ 28-03-2024]
భూసేకరణలో జాప్యమే జాతీయ రహదారుల విస్తరణకు శాపంగా మారుతోంది. జిల్లాలో ప్రధానంగా జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిగా మార్చి దశాబ్దం కావస్తున్నా.. నిర్మాణం మొదలు కావటం లేదు -
నత్తనడకన నిర్మాణాలు
[ 28-03-2024]
వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం పల్లెదవాఖానాలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర(సబ్సెంటర్ల)ను పల్లె దవాఖానాలుగా మార్చారు -
నిధులు వెచ్చించి.. పనులు వదిలేసి
[ 28-03-2024]
పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఆధునిక సాంకేతికను జోడించి పెద్ద నగరాలకు దీటుగా పోటీ పడేందుకు ప్రణాళికలు చేసిన నగరపాలిక.. ఆ విధానం అమలులో వెనుకబడింది -
తాగునీటి వృథా వద్దు : కలెక్టర్
[ 28-03-2024]
అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
కాంగ్రెస్ నిజామాబాద్ లోక్సభ స్థానం టికెట్ జీవన్రెడ్డికే దక్కింది. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది -
తొలిమెట్టు నోడల్ అధికారులకు భత్యం
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రత్యేక బోధన పద్ధతులతో కొనసాగుతున్న ఈ కార్యక్రమ పర్యవేక్షణకు మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 28-03-2024]
వాతావరణ సమాచారాన్ని ప్రతిఒక్కరి దైనందిన కార్యకలాపాల్లో భాగం చేయాలనే ఉద్దేశంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇటీవల ‘పంచాయత్ మౌసం సేవా’ మొబైల్ యాప్ విడుదల చేసింది. -
పఠనాలయం సద్వినియోగం... కల సాకారం
[ 28-03-2024]
గ్రంథాలయ పుస్తకాలతోనే ఏకకాలంలో రెండు ఉద్యోగాలు సాధించగలిగాను. తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ నిర్వహించిన ఫలితాల్లో పీజీటీ సాంఘికశాస్త్రం, జూనియర్ కళాశాలలో పౌరశాస్త్రం లెక్చరర్గా ఉద్యోగాలకు ఎంపికయ్యాను -
పంచాయతీల ఖజానా ఖాళీ
[ 28-03-2024]
ఓవైపు ఖజానా ఖాళీ, మరోవైపు సమస్యలు పంచాయతీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జమయ్యే నిధులకు మించిన వ్యయం చేయడంతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఓటు నమోదుకు ప్రత్యేక సాధారణ సెలవు
[ 28-03-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..