పల్లెసేవలో.. యువ ఇంజినీర్లు
ఎప్పుడూ తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీ పట్టడమే కాదు.. క్షేత్రస్థాయిలో పర్యటించి అవగాహన పెంచుకుంటున్నారు.
గ్రామాల్లో జాతీయ సేవా పథకం
(ఎన్ఎస్ఎస్) శిబిరాల నిర్వహణ
వీధి శుభ్రం చేస్తున్న వాలంటీర్లు
కొడిమ్యాల(జగిత్యాల), న్యూస్టుడే: ఎప్పుడూ తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీ పట్టడమే కాదు.. క్షేత్రస్థాయిలో పర్యటించి అవగాహన పెంచుకుంటున్నారు. గ్రామాల్లో జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్) శిబిరాలు నిర్వహిస్తూ సేవ చేస్తున్నారు. కొడిమ్యాల మండలంలోని జేఎన్టీయూ నాచుపల్లి కళాశాలలోని ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 21 వరకు హిమ్మత్రావుపేట, డబ్బుతిమ్మయ్యపల్లె గ్రామాల్లో శిబిరాలు నిర్వహించారు. రెండు బృందాలుగా ఏర్పడి శ్రమదానం, స్వచ్ఛభారత్, హరితహారం, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఆరోగ్యం, రక్తదానం, సామాజిక రుగ్మతలు, పర్యావరణ పరిరక్షణ, వాననీటి సంరక్షణ, ఓటరు నమోదు, మూఢనమ్మకాలు, సైబర్ నేరాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా గ్రామస్థుల్లో చైతన్యం కలిగించారు. ఈ సందర్భంగా వారిని ‘న్యూస్టుడే’ పలకరించగా వారి అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు..
సామాజిక రుగ్మతలపై చైతన్యం..
- భావన, శిబిరం సమన్వయకర్త
శిబిరంలో భాగంగా పల్లెటూరులో సేవ చేయడం ఆనందాన్నిస్తోంది. గ్రామాల్లోని సామాజిక రుగ్మతల నివారణకు జాతీయ సేవా పథకం చక్కటి వేదికగా నిలుస్తుంది. బాల్య వివాహాలు, భ్రూణహత్యలు, మద్యపాన నిషేధం, బాల కార్మికులు, ధూమపాన నిషేధం, సైబర్ నేరాలు వంటి అనేక అంశాలపై గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్నాం. సేవా కార్యక్రమాల ద్వారా ఆత్మ సంతృప్తి పొందుతున్నాం.
పరిశుభ్రతపై..
- ప్రణయశ్రీ, వాలంటీర్
గ్రామంలో స్వఛ్ఛభారత్, హరితహారంపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాం. ప్లాస్టిక్ కవర్ల వాడకం వలన కలిగే భూమి కాలుష్యంపై గ్రామస్థులకు తెలియజేస్తూ ప్లాస్టిక్ నివారణకు కృషి చేస్తున్నాం. అంతేగాక పరిసరాలు అపరిశుభ్రత వల్ల సంక్రమించే వ్యాధులను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశాం. ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుని వినియోగించుకోవాలని తెలిపారు.
క్రమశిక్షణ నేర్చుకున్నాం..
- టి.వర్షిణి
జాతీయ సేవా పథకంలో భాగంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాలంటీర్లు ఒక బృందంగా ఏర్పడి శ్రమదానం, వివిధ కార్యక్రమాలు నిర్వహించడం, సాయంత్రం గ్రామస్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా క్రమశిక్షణ అలవడింది. ఇలాంటి శిబిరాల వల్ల ఆత్మవిశ్వాసంతో పాటు తోటి వారిపట్ల సోదరభావం పెంపొందుతుంది. గ్రామస్థుల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం.
నాయకత్వ లక్షణాలు..
- సాయిభార్గవ్, శిబిరం సమన్వయకర్త
చిన్ననాటి నుంచే దేశ సేవ చేయాలనే ఉద్దేశం ఉంది. ఎన్ఎస్ఎస్ శిబిరాల్లో పాల్గొనడం ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. శిబిరం సమన్వయకర్తగా వ్యవహరించడం ద్వారా నాయకత్వ లక్షణాలు, బృంద నిర్వహణ, ఎలా పని చేయించాలి, ఎలా వ్యవహరించాలో నేర్చుకుంటున్నాం. భవిష్యత్తులో మేము పనిచేసే చోట తోటి వారితో కలిసి పనిచేయడానికి, పని చేయించుకోవడానికి ఉపయోగపడుతుంది.
సేవాభావం అలవడింది..
- సిరి
గతంలో మేము చాలా శిబిరాలు నిర్వహించాం. గ్రామస్థులకు చెప్పడం కంటే వారి నుంచే అనేక విషయాలు నేర్చుకున్నాం. శిబిరంలో పాల్గొంటూ గ్రామంలో శ్రమదాన కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా సేవాభావాన్ని అలవాటు చేసుకున్నాను. గ్రామస్థులంతా ఒక్కటై తమ గ్రామాన్ని, తమ సమస్యలను పరిష్కరించుకునేలా అవగాహన కల్పించాం. ఇతరులకు సేవ చేయాలనే ఆలోచన కలిగింది.
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని..
- నదీమ్పాషా
ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితి నుంచి వారిని కాపాడవచ్చని, రక్తదానం చేయడం వలన అనారోగ్యానికి గురవుతామని, శక్తి హీనులమవుతామనే అపోహలను తొలగిస్తూ గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్నాం. ఒక వ్యక్తి మరణించిన తర్వాత నేత్రదానంతో అంధులకు చూపు, కొత్త జీవితాన్ని అందించవచ్చని రక్తదానం, షౌష్టికాహారం వంటి అంశాలను ప్రచారం చేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకా.. వెంకటస్వామికి ఆ పేరెలా వచ్చింది?
[ 24-04-2024]
కాంగ్రెస్ పార్టీ దివంగత, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి ‘కాకా’గానే ఎక్కువ మందికి సుపరిచితులు. ఆయనకు ఈ పేరు రావడం వెనుక ఆసక్తికర అంశం ఉంది. -
యాప్ కష్టాలు
[ 24-04-2024]
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన యాప్ల్లో సమాచారం నిక్షిప్తం చేయాల్సి ఉంది. -
నిర్వహణ భారం.. కమీషన్లో కోత
[ 24-04-2024]
కేంద్రాల నిర్వహణ భారంగా మారగా.. వచ్చిన కమీషన్లో కోత విధించడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. -
ఇక ట్వంటీ20 పోరు!
[ 24-04-2024]
పోలింగ్ తేదీకి బుధవారం నుంచి సరిగ్గా ఇరవై రోజులుంది.. అచ్చంగా ట్వంటీ20 క్రికెట్ ఆటలోని 20 ఓవర్ల మాదిరి సమరం. -
మిగిలింది రెండు రోజులే!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలి అంకం రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నెల 25వ తేదీతో నామినేషన్ల స్వీకరణ పూర్తవనుంది. -
నకిలీ పత్రాలు సృష్టించి.. ఇల్లు ధ్వంసం
[ 24-04-2024]
నకిలీ పత్రాలు సృష్టించి, ఇంటిని ధ్వంసం చేసి, దాడికి పాల్పడిన అయిదుగురిని కరీంనగర్ కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. -
పార్టీ పెద్దల సమ్మతితోనే రాజేందర్ నామినేషన్
[ 24-04-2024]
పార్టీ పెద్దల సమ్మతితోనే తామంతా కలిసి కాంగ్రెస్ తరఫున వెలిచాల రాజేందర్రావుతో నామినేషన్ వేయించామని, గెలిపిం చుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. -
అతివల ఉపాధికి ఆదరువేదీ!
[ 24-04-2024]
రాష్ట్రంలో 6 లక్షల మంది బీడీ కార్మికులుండగా అత్యధికంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నారు. -
ఆ పది మందికే 50 శాతం ఓటర్ల మద్దతు
[ 24-04-2024]
ఎన్నికల్లో ప్రత్యర్థి కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా విజయం సాధించినట్లే. అయితే గెలుపొందిన అభ్యర్థికి నియోజకవర్గంలోని ఎంత మంది ఓటర్ల మద్దతు ఉందనేది పోటీలో ఉన్న అభ్యర్థులు, నమోదైన పోలింగ్ శాతాన్ని బట్టి మారుతుంది. -
ఆయుధాలు అప్పగించారు..
[ 24-04-2024]
వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు. -
మాతాశిశుకు తప్పని ఉక్కపోత
[ 24-04-2024]
చంటి బిడ్డలు, బాలింతలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వేసవి ఉక్కపోత తప్పడం లేదు. -
బ్యాలెట్ యుద్ధానికి చకచకా సన్నద్ధం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. -
పనులకు ఆటంకాలు.. రాకపోకలకు అవస్థలు
[ 24-04-2024]
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. -
తైబజార్... చిరు వ్యాపారుల బేజార్
[ 24-04-2024]
పురపాలక సంఘంలో తైబజార్ గుత్తేదారు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు.
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!