పక్కాగా పది పరీక్షల నిర్వహణ
పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళిక చేపట్టామని డీఈవో జగన్మోహన్రెడ్డి అన్నారు.
న్యూస్టుడే, జగిత్యాల పట్టణం: పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళిక చేపట్టామని డీఈవో జగన్మోహన్రెడ్డి అన్నారు. కలెక్టర్ యాస్మిన్భాష ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పన, విద్యా ప్రమాణాల పెంపునకు చర్యలు చేపట్టామని చెప్పారు. పదిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ ఆదేశించారని, విద్యార్థులు కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించేలా ఉపాధ్యాయులు పనిచేయాలని సూచించారని పేర్కొన్నారు. ఏప్రిల్ 3 నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి పరీక్షల ఏర్పాట్లు, సన్నద్ధతపై ‘న్యూస్టుడే’తో మాట్లాడారు. ఆ వివరాలు..
ప్రశ్న: జిల్లాలో పది పరీక్షల నిర్వహణకు ఎలాంటి చర్యలు చేపట్టారు?
సమాధానం: జిల్లాలో పది పరీక్షలకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేశాం. మొత్తం 11,177 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాయనున్నారు. ఇందుకోసం 69 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశాం. 69 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 69 మంది డిపార్టుమెంటల్ అధికారులు 1034 ఇన్విజిలేటర్లు పరీక్షలు సమర్థంగా నిర్వహించనున్నారు. మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం.
ప్ర: పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి వసతులు కల్పించనున్నారు.?
స: గాలి, వెలుతురు సౌలభ్యంగా ఉన్నవాటినే పరీక్ష కేంద్రాలుగా గుర్తించాం. విద్యుత్తు, ఫ్యాన్ల అమరిక పూర్తయింది. తాగునీటి వసతితోపాటు మూత్రశాలల సౌలభ్యం కల్పించాం. ఇంకా ఏవైనా సమస్యలుంటే పరిష్కరించే విధంగా సిబ్బందికి సూచనలు జారీ చేశాం.
ప్ర: మన ఊరు-మన బడి పాఠశాలల్లో ప్రగతి పనుల జాప్యంతో ఇబ్బందులున్నాయా.?
స: దాదాపు ఎంపిక చేసిన పాఠశాలల్లో 80 శాతం పనులు పూర్తయ్యాయి. పది కేంద్రాలపై వీటి ప్రభావం లేదు. మిగిలిన పనులు సైతం వేసవి సెలవులకు ముందే పూర్తయ్యే అవకాశం ఉంది.
ప్ర: కొందరు ఉపాధ్యాయులు సమయ పాలన పాటించడంలేదనే ఆరోపణలున్నాయి. విద్యార్థులకు నష్టం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు.?
స: సమయపాలన పాటించని వారిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటాం. కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యాశాఖపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయి. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయులపై కఠినంగా వ్యవహరిస్తాం.
ప్ర: పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.?
స: అన్ని పాఠశాలల్లోనూ పాఠ్య ప్రణాళిక పూర్తయింది. ఉదయం, సాయంత్రం ఒక్కో గంట చొప్పున ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ఈ సమయంలో విద్యార్థుల ఆకలి తీర్చేందుకు అల్పాహారం అందజేస్తున్నాం. పునశ్చరణ రెండు పర్యాయాలు పూర్తయింది. ఇంట్లోనూ విద్యార్థులు చదువుకునేలా తల్లిదండ్రులను ఉపాధ్యాయులు కోరడం జరిగింది. అభ్యాస దీపికలు అనుసరించి బోధన కొనసాగుతోంది.
మొత్తం పాఠశాలలు: 364
పదో తరగతి విద్యార్థులు: 11,177
బాలురు: 5,747
బాలికలు: 5,430
పరీక్ష కేంద్రాలు: 69
పరీక్ష నిర్వహణ పరిశీలకులు: 1,034
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్