లక్షల లీటర్ల శుద్ధ జలం వృథా
అసలే ఎండాకాలం.. ఆపై జలం అవసరాలు పెరిగిపోవడం.. ప్రతి ఒక్కరూ నల్లా నీరు ఎప్పుడు వస్తుందా అని ఎదిరి చూస్తుండగా.. పైపులైన్ల లీకేజీలు.. వాల్వుల దగ్గర బయటకు వస్తున్న శుద్ధజలంతో.. లక్షల లీటర్ల నీరు వృథా అవుతోంది.
నగరంలో పైపులైన్ లీకేజీల పరంపర
న్యూస్టుడే, కరీంనగర్ పట్టణం, కార్పొరేషన్
ఎస్ఆర్ఆర్ కళాశాల ఎదురుగా బ్యాంకు కాలనీకి వెళ్లు కూడలిలో పైపులైను వాల్వ్ ఉంది. ఇటీవల మరమ్మతులు చేసినా ఎప్పటిలాగే శుద్ధి నీరంతా రోడ్డుపై ప్రవహిస్తోంది. ఆ ప్రాంతంలో బురదమయంగా మారుతుండటంతో రాకపోకలు సాగించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
అసలే ఎండాకాలం.. ఆపై జలం అవసరాలు పెరిగిపోవడం.. ప్రతి ఒక్కరూ నల్లా నీరు ఎప్పుడు వస్తుందా అని ఎదిరి చూస్తుండగా.. పైపులైన్ల లీకేజీలు.. వాల్వుల దగ్గర బయటకు వస్తున్న శుద్ధజలంతో.. లక్షల లీటర్ల నీరు వృథా అవుతోంది.
కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లు ఉండగా అత్యధిక శాతం కాలనీలకు శుద్ధి నీరే పంపిణీ చేస్తున్నారు. గతంలో రోజు విడిచి రోజు వచ్చే నల్లా నీరు ప్రస్తుతం రోజు వస్తుండటంతో నగరవాసులకు నీటి సమస్యనే లేదు. విలీన కాలనీల్లో కొన్నింటికి నగరం నుంచే తాగునీరు పంపిణీ అవుతుండగా మిగతా ప్రాంతాలకు మిషన్ భగీరథ, స్థానికంగా ఉన్న బోరు, బావుల నీటిని సరఫరా చేస్తున్నారు. నల్లా నీర ఒక రోజు రాకపోయినా ఆయా ప్రాంతవాసులు ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. పాత నగరంలో బోరు, బావులు లేకపోవడంతో అన్ని అవసరాలకు ఈ నీరే అధికంగా వాడుతున్నారు.. అంతరాయం లేకుండా సరఫరా చేయాల్సి ఉండగా ఈ మధ్య మరమ్మతుల పేరిట నిలిపి వేస్తుండటంతో ఇబ్బందులు తప్పడం లేదు.
నెలల తరబడి ..
నగరంలోని కాపువాడ, ఆమేర్నగర్, మారుతీనగర్, పాతబజారు, బోయవాడ, అహ్మద్పుర, భగత్నగర్, కశ్మీర్గడ్డ, గోదాంగడ్డ, రాంనగర్, సప్తగిరికాలనీ, శివనగర్, అంబేడ్కర్నగర్, మంచిర్యాల చౌరస్తా, హౌసింగ్బోర్డుకాలనీ, సిక్కువాడీ, దోబీవాడ, కట్టరాంపూర్, కోతిరాంపూర్, అలకాపురికాలనీ, విద్యానగర్, జ్యోతినగర్, మంకమ్మతోట, విద్యానగర్, ఖాన్పుర, హుస్సేనీపుర, అశోక్నగర్, బ్యాంకుకాలనీ, మెహర్నగర్, సుభాష్నగర్, సవారన్వీధి, వావిలాలపల్లి తదితర ప్రాంతాల్లో వాల్వుల లీకేజీలు అధికంగా ఉన్నాయి. అందులో నీరు నిలిచి ఉండటంతో తిరిగి పైపులైన్లకు వెళ్తోందని అంటున్నారు. ప్రధాన రహదారులపై పైపులు పగిలి నీరంతా రోడ్లపై ప్రవహిస్తుండగా మరమ్మతులు చేయడంలో జాప్యం చేస్తున్నారు.
నిపుణులతో చేయించకపోవడంతో..
నగరంలోని పలు ప్రాంతాల్లో స్మార్ట్సిటీ రహదారులు నిర్మిస్తున్నారు. వేసిన రోడ్లు భవిష్యత్తులో పగులకొట్టకుండా ఉండేందుకు కొత్తగా హెచ్డీపీఈ పైపులు వేస్తున్నారు. రెండు పైపులను అనుసంధానం చేసే సమయంలో జాయింట్లు సక్రమంగా చేయడం లేదు. నిపుణులతో కాకుండా స్థానిక కార్మికులతోనే ఈ పనులు చేయిస్తుండటంతో సీసీ వేసిన తర్వాత లీకేజీలు బయట పడుతున్నాయి. పలు స్మార్ట్ రోడ్లపై ఇప్పటికే ఉన్నాయి.
మంచిర్యాల చౌరస్తా సమీపంలో మసీదుకు ఎదురుగా అంబేడ్కర్నగర్ రిజర్వాయర్కు వెళ్లు దారిలో పైపులైను లీకవుతోంది. నెలల తరబడి అలాగే ఉండగా శుద్ధి నీరంతా మురుగునీటి కాల్వల్లోకి వెళ్తోంది. ప్రధాన పైపులైను కావడంతో దానిని ముట్టుకోకుండా వదిలేస్తుండటంతో కొన్ని సందర్భాల్లో ఫౌంటెయిన్ తరహాలో నీరు పైకి లేస్తోంది.
సాయినగర్లో ఇటీవల స్మార్ట్సిటీ కింద రోడ్డు వేశారు. అంతకంటే ముందే హడావుడిగా తాగునీటి పైపులైను వేసి పరీక్షించలేదు. రోడ్డు వేసిన తర్వాత జాయింట్ ఊడిపోవడం, రోడ్డు లోపలి భాగంలో ఉండటంతో కొత్తగా వేసిన రోడ్డు తవ్వాల్సిన పరిస్థితి రావడంతో అధికారులు ఆలోచనలో పడ్డారు. ఈ శుద్ధి నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది.
లోపాలు ఏమిటి..
వాల్వుల దగ్గర నీరు బయటకు వస్తుండటంతో ప్యాకింగ్ తాడు వేస్తున్నారు. కార్మికులకు దీనిపై అవగాహన లేదని తెలుస్తోంది. వాహనాలు వెళ్లే క్రమంలో కదలకుండా ఉండేందుకు చుట్టూ ప్లాస్టిక్ పైపు, సిమెంటు వేసినా ఆగడం లేదు. కొన్ని రోజులకే శుద్ధి నీరు బయటకు వచ్చి రోడ్డు దెబ్బతింటుంది. వాల్వులు సక్రమంగా లేకపోవడం, వాటిని ఆపరేటింగ్ చేసే సమయంలో తేడాలు వస్తుండటం, వాహనాలు దాని గుండా వెళ్తుండటమే సమస్యలకు కారణంగా మారుతుంది.
ఎప్పటికప్పుడు మరమ్మతులు
నగర మేయర్ ఆదేశాల మేరకు అన్ని రిజర్వాయర్ల పరిధిలోని ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేశాం. లీకేజీలు, వాల్వుల ప్యాకింగ్ తాడు వేసేలా చర్యలు చేపట్టారు. బీటీ రోడ్లపై లీకేజీలను సరి చేసేందుకు ప్రాధాన్యమిచ్చాం. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తున్నారు.
నాగ మల్లేశ్వరరావు, ఎస్ఈ, కరీంనగర్ నగర పాలిక
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఎవరి చేతికి?.. మల్లగుల్లాలు పడుతున్న అధిష్ఠానం
[ 29-03-2024]
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారుపై ఆ పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది.. ఇప్పటికే భారాస, భాజపాల అభ్యర్థులు ఖరారవగా.. హస్తం పార్టీ తరఫున బరిలో నిలిచేదెవరో తెలియకపోవడంతో కాంగ్రెస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు అభ్యర్థి తేలేదెప్పుడు.. అని ఆందోళన చెందుతున్నారు. -
కనుల పండువగా శివయ్య కల్యాణం
[ 29-03-2024]
ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో గురువారం శివ కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. -
ఆందోళన వద్దు.. అవకాశాలు కోకొల్లలు!
[ 29-03-2024]
విద్యార్థులు ప్రాథమిక విద్య నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ పదో తరగతి పూర్తి చేశారు. ఒకట్రెండు రోజుల్లో పరీక్షలు కూడా పూర్తి చేసి ఉన్నతవిద్య వైపు అడుగులు వేయనున్నారు. -
అవసరాల మేరకు ఏదీ అనుసంధానం!
[ 29-03-2024]
ఈ రెండు అంశాల్లోనే కాదు. ప్రయాణికుల అవసరాలు తీర్చడంలో ద.మ.రై.అధికారులు ఆది నుంచీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. రైల్వే ఉద్యోగుల అవసరాలు, అధికారులు, నాయకులు లాబీయింగులతోనే కొత్త హాల్టింగులు, ఇతర వసతులు కల్పిస్తున్నారు. -
కరీంనగర్ బస్స్టేషన్ ఆస్తి పన్ను రూ.1.88 కోట్లు చెల్లింపు
[ 29-03-2024]
ఆస్తిపన్ను బకాయిలపై 90 శాతం రాయితీ గడువు మూడు రోజుల్లో ముగుస్తుందని నగరపాలక కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ తెలిపారు. -
భార్య చేతిలో భర్త హతం
[ 29-03-2024]
భర్త మద్యానికి బానిసై శారీరకంగా.. మానసికంగా వేధిస్తున్నాడని వేదనకు గురైన ఓ భార్య తనకు తెలిసిన ఇద్దరి సహాయంతో తాళ్లతో కట్టేసి.. కళ్లలో కారం చల్లి... ఒంటిపై వేడి నీళ్లు పోసి తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయి మృతి చెందాడు. -
లోక్సభ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పరీక్ష
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
వేసవి గట్టెక్కేనా!
[ 29-03-2024]
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ పట్టణాలకు డబ్బాలోని గ్రిడ్ ద్వారా మిషన్ భగీరథ పథకం నీరు సరఫరా అవుతోంది. ధర్మపురి పట్టణానికి డబ్బా నుంచి పైపులైన్లు వేసినా చివరి ప్రాంతం కావడంతో నీరు సరఫరా సక్రమంగా కావడం లేదు. -
మట్టి గుట్టలు మాయం!
[ 29-03-2024]
మండలంలోని వరద కాలువ మట్టిని కొందరు గుత్తేదార్లు, స్తిరాస్థి వ్యాపారులు అక్రమంగా తరలించుకుపోతుండటంతో మట్టికట్టలు మాయమవుతున్నాయి. -
నిధులు దూరం.. నిర్వహణ భారం
[ 29-03-2024]
వ్యవసాయ శాఖ సేవలను రైతులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో గత ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మించింది. శాఖాపరంగా రైతులకు ఆధునిక సాగు విధానంపై సలహాలు, సూచనలు ఇవ్వాలనేది ప్రధాన లక్ష్యం. -
లక్ష్యానికి చేరువగా సింగరేణి
[ 29-03-2024]
సింగరేణి సంస్థ తొలిసారిగా 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి చేరువ అవుతోంది. మూడేళ్లుగా ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సంస్థ ఇప్పటివరకు ఆ మేరకు బొగ్గు ఉత్పత్తిని చేరుకోలేకపోయింది. -
బయో మైనింగ్ ప్రక్రియకు అవాంతరాలు
[ 29-03-2024]
పెరుగుతున్న నగరీకరణ.. అందుకు అనుగుణంగా పారిశుద్ధ్య నిర్వహణ ప్రభుత్వ యంత్రాంగానికి సవాల్గా మారుతోంది. ఈ క్రమంలో చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేసేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
భాజపా పాలనపై ప్రజల్లో విసుగు
[ 29-03-2024]
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని భారాస ఎంపీ అభ్యర్థులు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్, కొప్పుల ఈశ్వర్లు అన్నారు. -
మతం పేరిట కేసీఆర్ రాజకీయం చేయలేదు: కేటీఆర్
[ 29-03-2024]
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో ఏ రోజు కూడా మతం పేరిట రాజకీయం చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
రాష్ట్రాన్ని దోచుకుంది భారాసనే: ఆది శ్రీనివాస్
[ 29-03-2024]
తెలంగాణ ఏర్పడిన తరవాత రూ.16 వేల కోట్ల నిల్వ బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పగిస్తే భారాస తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని రాబంధుల్లా దోచుకుందని, రూ.6.67 లక్షల కోట్ల అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ను దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు