అవగాహనతోనే నివారణ
దేశంలో పెరుగుతున్న జనాభాతో పాటు వ్యాధుల సంఖ్య వీపరీతంగా పెరిగిపోతోంది. సమాజంలో మాములుగా అందరి మధ్య ఉండి త్వరగా ప్రభాలే వ్యాధి క్షయ.గతంలో ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేసిన క్షయ వ్యాధి వేగంగా తన ప్రభావాన్ని చూపుతోంది.
నేడు ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం
న్యూస్టుడే, జగిత్యాల, రాయికల్, ధర్మపురి
సిబినాట్ పరీక్ష యంత్రం వద్ద వైద్యులు
దేశంలో పెరుగుతున్న జనాభాతో పాటు వ్యాధుల సంఖ్య వీపరీతంగా పెరిగిపోతోంది. సమాజంలో మాములుగా అందరి మధ్య ఉండి త్వరగా ప్రభాలే వ్యాధి క్షయ.గతంలో ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేసిన క్షయ వ్యాధి వేగంగా తన ప్రభావాన్ని చూపుతోంది. ప్రతి వెయ్యి మందిలో 10 మందికి వ్యాధి సోకి అస్వస్థతకు గురవుతుండగా బాధితులకు తెలియకుండానే ఇతరులకు వ్యాప్తి చేస్తున్నారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా క్షయ వ్యాధి నిర్మూలన చర్యలపై న్యూస్టుడే ప్రత్యేక కథనం.
ఉచిత నిర్ధారణ(సిబినాట్) పరీక్షలు
జగిత్యాల జిల్లాలో గతేడాది 1832 కేసులు నమోదు కాగా ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 22 వరకు 396 కేసులు నమోదు కాగా బాధితులకు చికిత్సను ఉచితంగా అందిస్తున్నారు. జిల్లాలోని 18 మండలాల ఆరోగ్య సిబ్బందితో పాటు ప్రయివేటు ఆసుపత్రుల సహాయంతో రెండు వారాలకు మించి దగ్గు కలిగి, బరువు తగ్గి, జ్వరంతో బాధపడుతున్న లక్షణాలు గల రోగులను గుర్తించి జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో నూతన సాంకేతిక పద్ధతి సిబినాట్ యంత్రంతో(కళ్లె) తెమడ పరీక్షలు ఉచితంగా నిర్వహించి క్షయ బాధితులను గుర్తిస్తున్నారు. ప్రతి వ్యక్తి దేహంలో టి.బి. బ్యాక్టిరియా ఉందో లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వం ఉచితంగా టీహబ్ ద్వారా ఇగ్రా పరీక్షలను ప్రారంభించింది. తొలుత టి.బి. రోగుల కుటుంబ సభ్యులకు ఈ పరీక్షలను ప్రారంభించారు. ఐ.జి.ఆర్.ఏ పరీక్ష ద్వారా దేహాంలో టి.బి.బ్యాక్టిరియా ఉన్నట్లు గుర్తిస్తే భవిష్యత్తులో టి.బి.రాకుండా పాజిటివ్ వ్యక్తులకు వెంటనే ఆరుమాసాల పాటు ఐ.ఎన్.ఏచ్. మాత్రలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. నిక్షయ మిత్ర కార్యక్రమం ద్వారా దాతల సాయంతో క్షయ వ్యాధిగ్రస్థులకు పోషకాహార కిట్లను ఈ ఏడాది ప్రారంభించారు. ప్రభుత్వం ఇచ్చే రూ.500 తో పాటు దాతల సాయంతో పోషకారహార కిట్లను అందిస్తున్నారు. జిల్లాలో ఐఎంఏ ఇతర స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ ఏడాది పోషకాహార కిట్లను సుమారు 250 మందికి అందజేశారు.
గ్రామాల్లో బాధితుల గుర్తింపు
జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందితో గ్రామాలలో క్షయవ్యాధి బాధితులను గుర్తించి జిల్లా వైద్యశాలలోని సిబినాట్ యంత్రం ద్వారా పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నాం. వ్యాధి నిర్ధారన జరిగిన బాధితులకు ఉచితంగా మందులతో పాటు ప్రతి నెల పోషణ భత్యం కింద రూ.500 అందిస్తున్నాం. నిక్షయ మిత్ర ద్వారా దాతలు క్షయ వ్యాధిగ్రస్థులకు సాయం అందించాలి.
డా.పుప్పాల శ్రీధర్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖధికారి
అవగాహన కల్పిస్తున్నాం..
జిల్లాలో క్షయ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. క్షయ వ్యాధికి ఆరు మాసాల పాటు ఉచితంగా పరీక్షలు, మందులు అందిస్తున్నాం. మొండి(యం.డీ.ఆర్) టి.బి. వ్యాధిగ్రస్థులకు సైతం జిల్లా ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నారు. క్షయ వ్యాధి వ్యాప్తి కాకుండా బాధితుల కుటుంబ సభ్యులకు వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నాం.
డా.నీలగిరి శ్రీనివాస్, క్షయ నిర్మూలన అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకా.. వెంకటస్వామికి ఆ పేరెలా వచ్చింది?
[ 24-04-2024]
కాంగ్రెస్ పార్టీ దివంగత, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి ‘కాకా’గానే ఎక్కువ మందికి సుపరిచితులు. ఆయనకు ఈ పేరు రావడం వెనుక ఆసక్తికర అంశం ఉంది. -
యాప్ కష్టాలు
[ 24-04-2024]
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన యాప్ల్లో సమాచారం నిక్షిప్తం చేయాల్సి ఉంది. -
నిర్వహణ భారం.. కమీషన్లో కోత
[ 24-04-2024]
కేంద్రాల నిర్వహణ భారంగా మారగా.. వచ్చిన కమీషన్లో కోత విధించడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. -
ఇక ట్వంటీ20 పోరు!
[ 24-04-2024]
పోలింగ్ తేదీకి బుధవారం నుంచి సరిగ్గా ఇరవై రోజులుంది.. అచ్చంగా ట్వంటీ20 క్రికెట్ ఆటలోని 20 ఓవర్ల మాదిరి సమరం. -
మిగిలింది రెండు రోజులే!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలి అంకం రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నెల 25వ తేదీతో నామినేషన్ల స్వీకరణ పూర్తవనుంది. -
నకిలీ పత్రాలు సృష్టించి.. ఇల్లు ధ్వంసం
[ 24-04-2024]
నకిలీ పత్రాలు సృష్టించి, ఇంటిని ధ్వంసం చేసి, దాడికి పాల్పడిన అయిదుగురిని కరీంనగర్ కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. -
పార్టీ పెద్దల సమ్మతితోనే రాజేందర్ నామినేషన్
[ 24-04-2024]
పార్టీ పెద్దల సమ్మతితోనే తామంతా కలిసి కాంగ్రెస్ తరఫున వెలిచాల రాజేందర్రావుతో నామినేషన్ వేయించామని, గెలిపిం చుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. -
అతివల ఉపాధికి ఆదరువేదీ!
[ 24-04-2024]
రాష్ట్రంలో 6 లక్షల మంది బీడీ కార్మికులుండగా అత్యధికంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నారు. -
ఆ పది మందికే 50 శాతం ఓటర్ల మద్దతు
[ 24-04-2024]
ఎన్నికల్లో ప్రత్యర్థి కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా విజయం సాధించినట్లే. అయితే గెలుపొందిన అభ్యర్థికి నియోజకవర్గంలోని ఎంత మంది ఓటర్ల మద్దతు ఉందనేది పోటీలో ఉన్న అభ్యర్థులు, నమోదైన పోలింగ్ శాతాన్ని బట్టి మారుతుంది. -
ఆయుధాలు అప్పగించారు..
[ 24-04-2024]
వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు. -
మాతాశిశుకు తప్పని ఉక్కపోత
[ 24-04-2024]
చంటి బిడ్డలు, బాలింతలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వేసవి ఉక్కపోత తప్పడం లేదు. -
బ్యాలెట్ యుద్ధానికి చకచకా సన్నద్ధం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. -
పనులకు ఆటంకాలు.. రాకపోకలకు అవస్థలు
[ 24-04-2024]
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. -
తైబజార్... చిరు వ్యాపారుల బేజార్
[ 24-04-2024]
పురపాలక సంఘంలో తైబజార్ గుత్తేదారు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్