నిర్వహణ అస్తవ్యస్తం.. సేవలు నామమాత్రం
ప్రజలకు కార్పొరేట్ తరహా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకు రావాలనే ఉద్దేశంతో గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిలో నిర్వహణ అస్తవ్యస్తంగా కొనసాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
‘ఖని’ ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రి తీరు
న్యూస్టుడే, గోదావరిఖని పట్టణం
ప్రారంభానికి నోచుకోని ఆసుపత్రిలోని సీటీ స్కానింగ్ విభాగం
ప్రజలకు కార్పొరేట్ తరహా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకు రావాలనే ఉద్దేశంతో గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిలో నిర్వహణ అస్తవ్యస్తంగా కొనసాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా మెరుగైన వైద్య సేవలు కొరవడుతుండగా అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిరంతర పర్యవేక్షణతో ఆసుపత్రి నిర్వహణ, వైద్య సేవలను మెరుగు పరిచేలా చర్యలు తీసుకునేందుకు జిల్లా కలెక్టర్ను ఆసుపత్రి అభివృధ్ధి కమిటీ ఛైర్మన్గా ప్రభుత్వం నియమించి ఎనిమిదిన్నర నెలలు కావస్తున్నా నేటికీ పూర్తిస్థాయి కమిటీ నియామకం జరగలేదు. కమిటీని నియమిస్తే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందనే భావనతో ఆస్పత్రి వర్గాలు కమిటీ లేకుండానే కాలయాపన చేస్తున్నట్లు వినికిడి. ప్రాంతీయ ఆసుపత్రి నుంచి సార్వజనిక ఆసుపత్రిగా స్థాయి పెరిగినా సేవలు మాత్రం గతంలోకంటే అధ్వానంగా ఉన్నాయనే ఆవేదనలు రోగుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
* కారును అద్దెకు తీసుకోవాలంటే ముందుగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఆమోదంతో ప్రకటన ఇచ్చి కొటేషన్లు ఆహ్వానించాలి. ఇవేం లేకుండానే కారు అద్దె పేరిట కారు లేకుండానే గత అక్టోబరు నుంచి బిల్లులు డ్రా చేయడం గమనార్హం.
* ఆసుపత్రిలో పారిశుద్ధ్య పర్యవేక్షకుడిగా పనిచేస్తున్న వ్యక్తికి సంబంధించిన కారును అద్దెకు నడిపిస్తుండగా సదరు పర్యవేక్షకుడే ఈ కారునకు డ్రైవరుగా పనిచేస్తూ రెండు వేతనాలు పొందుతుండడం గమనార్హం. తాజాగా వాహనం లేకుండానే మరో కారు పేరిట బిల్లులు స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి.
* పారిశుద్ధ్య కార్మికుల నియామకాల్లో సదరు పర్యవేక్షకుడు అక్రమాలకు పాల్పడిన సంఘటన పోలీసు స్టేషన్ వరకూ వెళ్లినా చర్యలు శూన్యం. ఆసుపత్రి పర్యవేక్షకుడి సేవలు నామమాత్రమే కాగా సదరు పారిశుద్ధ్య పర్యవేక్షకుడే ఓ రకంగా ఆసుపత్రి పర్యవేక్షకుడిగా పెత్తనం చెలాయిస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు.
* సుమారు రూ.2.57 కోట్ల సింగరేణి నిధులతో దాదాపు మూడు నెలల క్రితం ఆసుపత్రిలో అత్యాధునిక సీటీ స్కానింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేసినా నేటికీ ప్రారంభానికి నోచుకోవడం లేదు.
* కుక్కకాటు ఇంజక్షన్ కోసం ఆసుపత్రికి వెళ్తే తప్పనిసరిగా సిరంజీలు బయట కొనుక్కొని వెళ్లాల్సిందేనని పలువురు అంటున్నారు. బాధితులు సిరంజీలు తెచ్చుకుంటేనే ఆసుపత్రిలో కుక్క కాటు ఇంజక్షన్లు ఇస్తున్నారని చెబుతున్నారు.
* కొంతకాలం కేవలం పేపరు లేకపోవడంతో ఇసీజీ సేవలు నిలిచిపోగా మరి కొంత కాలం రక్తపోటును పరీక్షించే బీపీ ఆపరేటర్లు సైతం మూలన పడ్డాయి. రోగ నిర్ధారణలో కీలకమైన కొన్ని రకాల రక్తపరీక్షలు అత్యవసరమైతే తప్ప చేయడం లేదు.
* ఆసుపత్రికి చెందిన మూడు అంబులెన్సులు మూలనపడ్డాయి. రెండేమో మరమ్మతులకు నోచుకోక ఆసుపత్రి వెనకాల ఉండగా, ఒకదానికి మరమ్మతులు పూర్తయినా బిల్లులు చెల్లించకపోవడంతో షోరూమ్లోనే ఉంది. దీంతో అత్యవసరమైతే రోగులు తప్పనిసరిగా ప్రైవేటు అంబులెన్సులనే ఆశ్రయించాల్సి వస్తుంది.
సమస్యల పరిష్కారానికి కృషి
ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ప్రభుత్వం రామగుండంలో వైద్య కళాశాల ఏర్పాటుతో పాటు ఆసుపత్రి స్థాయి పెంచింది. నిర్వహణ గాడితప్పడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రిలో నెలకొన్న అవకతవకలు, అక్రమాలపై తగిన ఆధారాలతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నా. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నిర్వహణ మెరుగుపరుస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటాం.
కోరుకంటి చందర్, ఎమ్మెల్యే, రామగుండం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి