వడివడిగా పనులు.. మందకొడిగా చెల్లింపులు
ఉపాధి హామీ పథకంలో లక్షలాది రూపాయలతో చేపట్టిన సీసీరోడ్లు, పంచాయతీ భవనాలు, ఇతరత్రా అనేక రకాల అభివృద్ధి పనుల బిల్లులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
ఉపాధి హామీలో బిల్లులకు తప్పని ఎదురుచూపులు
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల
రుద్రంగిలో నిర్మాణం పూర్తయిన సీసీ రహదారి
ఉపాధి హామీ పథకంలో లక్షలాది రూపాయలతో చేపట్టిన సీసీరోడ్లు, పంచాయతీ భవనాలు, ఇతరత్రా అనేక రకాల అభివృద్ధి పనుల బిల్లులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇటీవల తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో మంత్రి కేటీఆర్ పర్యటనలో ఒక రైతు అధికారుల సూచనలతో రూ.75 వేలతో కల్లం నిర్మాణం చేసుకున్నా ఏడాదిగా బిల్లులు రావడం లేదు. ఇప్పించాలని కోరారు. దానికి మంత్రి కేంద్రం నుంచి నిధులు రాలేదని సమాధానమిచ్చారు. ఇలా జిల్లాలో చాలా రకాల పనులు పూర్తయినా బిల్లులు రాని పరిస్థితి ఉంది. క్షేత్రస్థాయిలో పనుల లక్ష్యాలు నిర్దేశించిన అధికారులు అవి పూర్తయ్యాక బిల్లుల చెల్లింపుల్లో మాత్రం ఉలుకూ పలుకూ ఉండటం లేదు. ఉపాధి హామీ పథకంలో కేంద్రం చేసిన పలు మార్పుల వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోంది.
జిల్లాలో ఉపాధి హామీ పథకంలో 60 శాతం నిధులు కూలీలకు, 40 శాతం మెటీరియల్ కాంపోనెంట్లో పనులు చేయాలి. మన దగ్గర నిబంధనలు పాటించకుండా కొంత కాలంగా కూలీలకు వెచ్చించే శాతానికి మించి నిధులు కేటాయిస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో రాష్ట్ర ప్రభుత్వ పెత్తనానికి కేంద్రం అడ్డుకట్ట వేసింది. కేంద్రం ఆజమాయిషీలోనే పనులు జరిగే విధంగా నేషనల్ ఇన్ఫర్మేటివ్ సెంటర్ (ఎన్ఐసీ) సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తెచ్చింది. పనులు చేసిన కూలి డబ్బులను నేరుగా కార్మికుల ఖాతాల్లోనే జమ చేస్తోంది. తాజాగా మెటీరియల్ కాంపోనెంట్ కింద చేసే పనులకు ఇష్టారీతిన కేటాయిస్తున్నారని వీటికీ అడ్డుకట్ట వేసింది. గతంలో మెటీరియల్ కాంపోనెంట్ కింద జిల్లాకు కాకుండా రాష్ట్రం మొత్తం ఒకే యూనిట్గా పరిగణించేవారు. ఈ క్రమంలో ఒక జిల్లాకు మెటీరియల్ కాంపోనెంట్ కింద మంజూరయ్యే నిధులను మరో జిల్లాకు కేటాయించే వెసలుబాటు ఉండేది. ఈ నిబంధనల్లో మార్పులు చేసింది. ఏ జిల్లాకు వచ్చే నిధులు ఆ జిల్లాలోనే వెచ్చించేలా ఎన్ఐసీలో కట్టడి చేశారు. దీంతో పాత బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.
‘ఇవి కోనరావుపేట మండలం నిమ్మపల్లిలోని సామూహిక గొర్రెల షెడ్లు. రెండేళ్ల క్రితం 22 షెడ్లు మంజూరయ్యాయి. వాటిలో ఏడాది కిందట 14 షెడ్లు పూర్తయ్యాయి. పనుల ప్రారంభంలో ఒక్కో యూనిట్కు రూ.90 వేలుగా పేర్కొన్నారు. బిల్లుల కోసం వివరాలు ఆన్లైన్లో నమోదు చేసే క్రమంలో రూ.50 వేలుగా చూపుతోంది. అయినా ఇప్పటికీ నిధులు మంజూరు కాలేదు.’’
చేపట్టింది ఇలా...
ఉపాధి హామీలో పనులంటేనే గుత్తేదారులు వెనకడుగు వేస్తున్నారు. కారణం పనులు పూర్తయ్యాక బిల్లుల కోసం నెలల తరబడి జాప్యం జరుగుతోంది. దీనికి నిదర్శనం జిల్లా వ్యాప్తంగా మన ఊరు- మన బడిలో ఉపాధి హామీలో నాలుగు రకాల పనులు చేయాలి. రూ.13.16 కోట్ల అంచనాతో 314 పనులను గుర్తించారు. అందులో 150 పనులు పూర్తయ్యాయి. వీటికి చెల్లింపులకు వచ్చే సరికి ఇప్పటికీ రూ.1.55 కోట్లు మాత్రమే జరిగాయి.
* రూ.6.13 కోట్లతో 255 కంపోస్టు షెడ్లు, రూ.7.01 కోట్లతో 73 వైకుంఠధామాలు నిర్మించారు. జిల్లా వ్యాప్తంగా 1,681 కల్లాలు మంజూరు కాగా వాటిల్లో 349 పూర్తి చేశారు. ఇప్పటి వరకు రూ.2.11 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి.
* రూ.27.54 కోట్లతో 151 పంచాయతీ భవనాలు మంజూరు కాగా వీటికి రూ.6.53 కోట్లతో 36 మాత్రమే పూర్తయ్యాయి. ఇటీవల మరో 80 భవనాలు మంజూరయ్యాయి. ఇటీవల రూ. 6.52 కోట్లతో 44 సీసీ రహదారులు మంజూరయ్యాయి. ఈ పనులు ఇంకా ప్రారంభం కాలేదు.
* 1,301 పశువుల పాకలు మంజూరు కాగా రూ.10.38 కోట్లతో 586 పూర్తి చేశారు. గొర్రెలు, మేకల పాకల నిర్మాణాలు 424 యూనిట్లకుగాను 21 పూర్తయ్యాయి. వీటికి రూ.7.23 కోట్లు కేటాయించారు. ఇలా జిల్లాకు మంజూరైన వివిధ పనులను ఎడాపెడా గుత్తేదారులకు అప్పగించారు. వీటిలో కొన్ని ప్రజాప్రతినిధులే చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా గతేడాది చేసిన పనులకుగాను రూ.10 కోట్లపైనే బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో ఈ ఏడాది అదనపు పనులు చేయకుండా వాటితోనే పూర్తి చేయనున్నారు.
తొమ్మిది నెలలవుతున్నా..
- పిడుగు లచ్చిరెడ్డి, గుత్తేదారు
రుద్రంగిలో రూ.10 లక్షలతో రెండు సీసీ రహదారులు నిర్మాణం చేశాను. జూన్లోనే పనులు పూర్తయ్యాయి. రికార్డులు సమర్పించి తొమ్మిది నెలలవుతున్నా బిల్లులు మంజూరు కావడం లేదు. చేసిన పనులకు సకాలంలో నిధులు మంజూరైతే ఇతర పనులు చేసేందుకు వెసలుబాటు ఉంటుంది.
జాప్యం లేకుండా చూస్తాం
- గౌతంరెడ్డి, డీఆర్డీవో
ఉపాధి హామీ పథకంలో పూర్తయిన పనులకు బిల్లుల మంజూరులో జాప్యం లేకుండా చూస్తున్నాం. పెండింగ్ బిల్లులు అన్నింటికీ అప్లోడ్ చేశాం. మంజూరు కాగానే ఆయా విభాగాల వారీగా నేరుగా చెల్లింపులు జరుగుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!