logo

హంస వాహనంపై స్వామివార్ల ఊరేగింపు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీరామ నవరాత్రోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివార్లను హంస వాహనంపై ఊరేగించారు.

Published : 24 Mar 2023 04:14 IST

ఆలయంలో ఊరేగిస్తున్న అధికారులు, అర్చకులు, భక్తులు

వేములవాడ, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీరామ నవరాత్రోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివార్లను హంస వాహనంపై ఊరేగించారు. శ్రీ పార్వతీ, రాజరాజేశ్వరస్వామివార్లు, లక్ష్మీ సమేత అనంతపద్మనాభస్వామివార్ల ఉత్సవమూర్తులను అందంగా అలంకరించిన  అనంతరం స్థానాచార్యుడు అప్పాల భీమాశంకర్‌ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివార్లను హంస వాహనంపై ప్రతిష్ఠించి ఆలయంలో ఊరేగించారు. ఉదయం వేదపండితులు, అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, వేద పండితులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని