పంటల్లో ప్రతికూలతలను అధిగమించాలి
ఉమ్మడి జిల్లాలో అకాలవర్షాలు, వడగళ్లు, ఈదురు గాలులతో పంటలకు నష్టం వాటిల్లుతోంది. వర్షాలతో వాతావరణ పరిస్థితులు మారి పైర్లలో చీడపీడల తీవ్రత పెరగనుండగా ప్రతికూలతను అధిగమించాలని జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం సహపరిశోధన సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు.
‘న్యూస్టుడే’ ముఖాముఖీలో ఏడీఆర్ డాక్టర్ జి.శ్రీనివాస్
న్యూస్టుడే, జగిత్యాల వ్యవసాయం
ఉమ్మడి జిల్లాలో అకాలవర్షాలు, వడగళ్లు, ఈదురు గాలులతో పంటలకు నష్టం వాటిల్లుతోంది. వర్షాలతో వాతావరణ పరిస్థితులు మారి పైర్లలో చీడపీడల తీవ్రత పెరగనుండగా ప్రతికూలతను అధిగమించాలని జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం సహపరిశోధన సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో చేపట్టాల్సిన యాజమాన్యాన్ని ‘న్యూస్టుడే’ ముఖాముఖి ద్వారా వివరించారు.
ప్రశ్న: ఈ యాసంగిలో ఉమ్మడి జిల్లాలో పంటలసాగు పెరిగిందా.?
సమాధానం: ఆయకట్టుకు కాలువనీరు రావటం, భూగర్భ జల లభ్యతతో ఈ సారి పైర్లసాగు అనుకున్నదానికన్నా అధికమైంది. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 6.34 లక్షల ఎకరాల యాసంగి సాగు అంచనాకాగా 10.35 లక్షల ఎకరాల వరకు అన్నిరకాల పంటలను సాగు చేస్తున్నారు. వరిసాగే 9 లక్షల ఎకరాలను దాటగా మొక్కజొన్న, పెసర, మినుము, ఆవాలు, జొన్న, వేరుసెనగ, పెసర, మినుము, సెనగ తదితర పంటలను రైతులు పండిస్తున్నారు.
ప్రశ్న: వరి, నువ్వు పంటల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలి.?
సమాధానం: వరిపైరు చిరుపొట్ట నుంచి గొలకదశలో ఉన్నందున మొగిపురుగు నివారణకు కారటాఫ్ హైడ్రోక్లోరైడ్ 400 గ్రాములు లేదా క్లోరాంత్రనిలిప్రోల్ 60 మి.లీ మందును ఎకరాకు పిచికారీ చేయాలి. చల్లటి వాతావరణంలో తీవ్రమయ్యే అగ్గితెగులు నివారణకు ఎకరాకు 300 మి.లీ ఐసోప్రోథయోలిన్ మందును పిచికారీ చేయాలి. ఎదిగే దశలోని పైరుకు 19:19:19 (ఎన్పీకే) మిశ్రమాన్ని లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలుపుకుని పైరుపై పిచికారీ చేయాలి. ఆకుమచ్చ నిరోధానికి కార్బండిజం 1 గ్రాము మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కాండంకుళ్లు లేదా వేరుకుళ్లు నిరోధానికి కాపర్ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి మొక్కల వేరువ్యవస్థ తడిసేలా పోయాలి.
ప్రశ్న: అకాల వర్షాలతో ఏ పంటలకు ఎక్కువగా నష్టం వాటిల్లింది.?
సమాధానం: గాలివాన, వడగళ్లతో కండే పాలుపోసుకునే దశలో మొక్కజొన్న కర్రలు విరగటం, నూర్పిడికి వచ్చిన వరి గొలకల్లోని గింజలు, మామిడి కాయలు రాలటం, నువ్వుపైరు పడిపోవటం, ఇతరత్రా కూరగాయలు తదితర పంటలకూ నష్టం వాటిల్లింది. వడగళ్ల వర్షసమయం కాబట్టి వర్షపునీరు అత్యంత చల్లగా ఉండటం, గాలిలో తేమశాతం పెరగటం, రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గటం, పగటి ఉష్ణోగ్రతలు పెరగటం తదితరాలతో పంటల్లో చీడపీడలు, పోషకలోపాల సమస్యలూ తలెత్తుతాయి.
ప్రశ్న: వర్షాల అనంతరం పంటల్లో తక్షణం తీసుకోవాల్సిన చర్యలేమిటి.?
సమాధానం: టమాట, తీగజాతి కూరగాయలు, ఉల్లి, వంగ తదితర కూరగాయలు, ఇతర పంటల్లో భారీవర్షం కురిసిన ప్రాంతాల్లో పొలంలో నీరు నిల్వకుండా బయటకు పారించాలి, పంట త్వరగా కోలుకునేందుకు 19:19:19 5 గ్రాములు, సూక్ష్మపోషకాల మిశ్రమం 2.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పైరుపై పిచికారీ చేయాలి. నేలద్వారా వ్యాపించే తెగుళ్ల నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ను లేదా 2 గ్రాముల మెటలాక్సిన్ను లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లవద్ద పోయాలి. ఇతర ఆరుతడి పంటల్లోనూ వర్షాలు తగ్గిన తరువాత పైపాటుగా ఎకరాకు 20 కిలోల యూరియా వేయాలి. నూర్పిడిచేసిన పంట ఉత్పత్తులు, ఆరబెట్టిన దినుసులు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రశ్న: మామిడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి.?
సమాధానం: మామిడిలో తామర పురుగు ఆశించే అవకాశం ఉన్నందున నివారణకు లీటరు నీటికి 2 మి.లీ ఫిప్రోనిల్ మందును కలిపి పిచికారీ చేయాలి. మచ్చలు ఆశించి నష్టపరిచే అవకాశమున్నందున నివారణకు 1 గ్రాము కార్బండిజంను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అన్ని పంటల్లోనూ వాతావరణం, నేలగుణం, పంట విత్తన రకాలు, యాజమాన్యం తదితరాలను బట్టి ఒకరైతు పొలానికి పక్కనేఉన్న మరోరైతు పొలానికి చాలాతేడా ఉంటుంది. కాబట్టి పంటలపై ఏవేని అసహజ లక్షణాలుంటే వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు లేదా శాస్త్రవేత్తలకు పైర్ల నమూనాలు చూపించి నివారణ తెలుసుకుని పాటించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం
[ 18-04-2024]
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణోత్సవాన్ని ఆలయ వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
నేటి నుంచి నామినేషన్లు షురూ!
[ 18-04-2024]
ఎన్నికల సమరంలో అసలైన ఘట్టం గురువారం నుంచి మొదలవనుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ నెల రోజుల కిందటే వెలువడినప్పటికీ నేడు వెలువడే అధికారిక నోటిఫికేషన్తో అసలు అంకం షురూ అవనుంది. -
ప్రచార పర్వానికి కాంగ్రెస్ సిద్ధం!
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి గురువారం నామపత్రాల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమవుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లోక్సభ స్థానం పరిధిలో ప్రచార కసరత్తు ప్రారంభించింది. -
కొప్పుల మొదటిసారి.. జీవన్ మూడోసారి
[ 18-04-2024]
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో వేర్వేరు పార్టీలు, వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న తాటిపర్తి జీవన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్లకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా గెలుపొందిన జీవన్రెడ్డి స్వగ్రామం పెగడపల్లి మండలం బతికెపల్లి. -
క్లిక్ దూరంలో సమగ్ర సమాచారం
[ 18-04-2024]
ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వెబ్సైట్ రూపొందించింది. ceotelangana.nic.in లో ఓటరు నమోదుతో పాటు సవరణలు, తొలగింపులు తదితర అంశాలుంటాయి. -
రెండు సార్లు ఎంపీ.. సాధారణ జీవనం
[ 18-04-2024]
వరుసగా రెండు సార్లు ఎంపీగా ఎన్నికైనా చివరి శ్వాస వరకు పల్లెటూరులోనే సాధారణ జీవితం గడిపారు జువ్వాడి రమాపతిరావు. 1916లో గన్నేరువరంలో జన్మించిన ఆయన వివాహం అనంతరం అత్తగారి ఊరైన గంగాధర మండలం సర్వారెడ్డిపల్లికి వచ్చి స్థిరపడ్డారు. -
ఎన్నికల పరిశీలకులొస్తున్నారు
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెంచింది. -
హాట్రిక్ విజేత..అరుదైన ఘనత
[ 18-04-2024]
ఉమ్మడి జిల్లాలో నలుగురు నేతలు వరుసగా మూడు సార్లు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ రికార్డు సొంతం చేసుకున్నారు. కరీంనగర్ నుంచి ముగ్గురు, పెద్దపల్లి నుంచి ఒకరు గెలుపొంది రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు. -
అక్కడ స్థానికేతరులే అధికం
[ 18-04-2024]
1962లో ఆవిర్భవించిన పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు ఒక్కసారి మినహా అన్ని ఎన్నికల్లో స్థానికేతరులే గెలుపొందారు. 1980లో 7వ లోక్సభ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన కోదాటి రాజలింగం మాత్రమే స్థానికుడు. -
వసతుల మెరుగుకు కార్యాచరణ
[ 18-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం నగరపాలికల్లో కనీస మౌలిక వసతులు మెరుగుపర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రధానంగా తాగునీరు, భూగర్భ మురుగునీటి వ్యవస్థను బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటారు. -
ఆదాయంలో జమ్మికుంట మార్కెట్ టాప్
[ 18-04-2024]
పంటలకు పెరిగిన మద్దతు ధర, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పాత బకాయిలు జమకావటం, చెక్పోస్టులు, గిడ్డంగుల అద్దెలు, లైసెన్సులు, మార్కెట్లకు వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాల ద్వారా లభించే ఆదాయంతో ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల వ్యవసాయ మార్కెట్ మినహా కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లు మార్కెటింగ్ శాఖ నిర్ణయించిన ఆర్థిక ఆదాయ లక్ష్యాన్ని అధిగమించాయి. -
ఓటరు దరఖాస్తులకు త్వరితగతిన పరిష్కారం
[ 18-04-2024]
నామినేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సూచించారు. బుధవారం ఆయన నిర్వహించిన పెద్దపల్లి నుంచి కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, శ్యామ్ప్రసాద్లాల్లు పాల్గొన్నారు. -
మిల్లుల్లోనే బియ్యం.. ధాన్యానికేదీ స్థలం?
[ 18-04-2024]
గత వానాకాలం సీజన్కు సంబంధించిన బియ్యానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో మిల్లుల్లోనే నిల్వలు పేరుకుపోయాయి. గత సీజన్కు సంబంధించిన సీఎంఆర్ లక్ష్యాలను మిల్లర్లు పూర్తి చేయాలనే గడువును జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పొడిగిస్తున్నారు.