పాలతో ఆర్థిక స్వావలంబన
ఆ గ్రామంలో పాడి రైతులు ఆర్థిక స్వావలంబన మార్గంలో పయనిస్తున్నారు. 210 మందితో ఏర్పాటు చేసుకున్న పాల సేకరణ కేంద్రం ద్వారా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కలిపి దాదాపు 840 లీటర్ల పాలను సేకరిస్తున్నారు.
లంబాడిపల్లెలో రోజుకు 840 లీటర్ల విక్రయం
న్యూస్టుడే, మల్యాల
కేంద్రంలో పాలు పోస్తున్న రైతులు
ఆ గ్రామంలో పాడి రైతులు ఆర్థిక స్వావలంబన మార్గంలో పయనిస్తున్నారు. 210 మందితో ఏర్పాటు చేసుకున్న పాల సేకరణ కేంద్రం ద్వారా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కలిపి దాదాపు 840 లీటర్ల పాలను సేకరిస్తున్నారు. కరీంనగర్ డెయిరీ కేంద్రానికి విక్రయిస్తూ ఏటా రూ.1.10 కోట్ల ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూ జగిత్యాల జిల్లాలోనే ఆదర్శంగా నిలుస్తున్నారు. మల్యాల మండలం లంబాడిపల్లె గ్రామానికి చెందిన 110 మంది పాడి రైతులు నిత్యం ఉదయం 470 లీటర్లు, సాయంత్రం 370 లీటర్ల పాలను సొసైటీ ద్వారా సేకరిస్తుంటారు. దాదాపు 23 ఏళ్లుగా లంబాడిపల్లె గ్రామంలోని పాడి రైతులు పాల ఉత్పత్తి ద్వారా ఆర్థిక స్వావలంబన వైపు పురోగమిస్తూ తమ పిల్లలను చదివిస్తున్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.లక్ష, సాధారణ మరణం సంభవిస్తే రూ.50 వేల చొప్పున ఇప్పటికీ 11 మందికి లబ్ధి చేకూర్చారు. తమ సంఘానికి వచ్చే లాభం నుంచి 60 శాతం బోనస్గా అందజేస్తూ పాడి రైతులను ప్రోత్సహిస్తున్నారు. సంఘానికి చేకూరిన లాభాలతో రెండున్నర గుంటల స్థలాన్ని రూ.6.50 లక్షలతో కొనుగోలు చేసి రెండు గదులతో భవనం నిర్మించుకున్నారు. ఏడాదిలో 225 రోజులు(రోజుకు లీటరు) పాలుపోసే పాడి రైతు కుటుంబాలకు చెందిన ఆడపిల్లల పెళ్లిళ్లకు డెయిరీ ఆధ్వర్యంలో రూ.12 వేల విలువైన పుస్తెమట్టెలు అందజేస్తారు. డెయిరీ అందజేసే పాలతోపాటు గ్రామంలో నిత్యం 100 లీటర్ల పాలను విక్రయిస్తారు. పాల ఉత్పత్తి, సరఫరాలో లంబాడిపల్లె జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
ప్రతి రోజు 5 లీటర్లు
మాకున్న ఒక గేదె రోజుకు 5 లీటర్ల పాలు ఇస్తుంది. వాటిని గ్రామంలోని పాల కేంద్రానికి తీసుకెళ్లి విక్రయిస్తాను. భర్త, కుమారుడు జీవనోపాధి కోసం దుబాయి వెళ్లారు. పాల విక్రయంతో కుమార్తెను చదివిస్తూ జీవనం సాగిస్తున్నాం. ఏటా మా గ్రామంలోని సొసైటీ ద్వారా బోనస్ రూపంలో లాభాలు కూడా అందజేస్తారు. సొసైటీ ఆధ్వర్యంలో బీమా సౌకర్యం కల్పించి అన్ని విధాలుగా ఆదుకుంటూ అండగా నిలుస్తున్నారు.
ఎల్లెంల ఎల్లవ్వ, లంబాడిపల్లె
ఆరు ఆవులు పెంచుతున్నా
నాకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో 20 గుంటల్లో పశుగ్రాసం పెంచుతూ మిగిలిన భూమిలో పొలం సాగు చేస్తున్నాను. 6 ఆవులు పెంచుతూ వాటి ద్వారా ప్రతి రోజు 25 లీటర్ల పాలను స్థానిక పాల కేంద్రంలో విక్రయిస్తున్నాను. వాటి విక్రయం ద్వారా ఏడాదికి రూ.4 లక్షల ఆదాయం వస్తుంది. పాల విక్రయం ద్వారా జీవనోపాధి మెరుగు పడింది.
మామిడి మల్లయ్య, లంబాడిపల్లె
జిల్లాలోనే ఆదర్శం
పాల సేకరణలో మా గ్రామం జిల్లాలోనే ప్రథమస్థానంలో నిలవడం గర్వకారణంగా ఉంది. పాలు విక్రయించే రైతులకు ప్రతి నెలా జగిత్యాల డెయిరీ కేంద్రం నుంచి వేతనాలు తీసుకొచ్చి పంపిణీ చేస్తుంటాను. పాడి రైతులకు రాయితీపై గడ్డి విత్తనాలు, గేదెలు, ఆవులకు బీమా సౌకర్యం కల్పించడంతో వల్ల మేలు జరుగుతోంది. సొసైటీలో 210 మంది సభ్యులున్నప్పటికీ ప్రస్తుతానికి 110 మంది కేంద్రానికి పాలు పోస్తున్నారు.
కొమ్మనవేని తిరుపతి, పాలకేంద్రం అధ్యక్షుడు, లంబాడిపల్లె
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం
[ 18-04-2024]
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణోత్సవాన్ని ఆలయ వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
నేటి నుంచి నామినేషన్లు షురూ!
[ 18-04-2024]
ఎన్నికల సమరంలో అసలైన ఘట్టం గురువారం నుంచి మొదలవనుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ నెల రోజుల కిందటే వెలువడినప్పటికీ నేడు వెలువడే అధికారిక నోటిఫికేషన్తో అసలు అంకం షురూ అవనుంది. -
ప్రచార పర్వానికి కాంగ్రెస్ సిద్ధం!
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి గురువారం నామపత్రాల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమవుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లోక్సభ స్థానం పరిధిలో ప్రచార కసరత్తు ప్రారంభించింది. -
కొప్పుల మొదటిసారి.. జీవన్ మూడోసారి
[ 18-04-2024]
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో వేర్వేరు పార్టీలు, వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న తాటిపర్తి జీవన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్లకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా గెలుపొందిన జీవన్రెడ్డి స్వగ్రామం పెగడపల్లి మండలం బతికెపల్లి. -
క్లిక్ దూరంలో సమగ్ర సమాచారం
[ 18-04-2024]
ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వెబ్సైట్ రూపొందించింది. ceotelangana.nic.in లో ఓటరు నమోదుతో పాటు సవరణలు, తొలగింపులు తదితర అంశాలుంటాయి. -
రెండు సార్లు ఎంపీ.. సాధారణ జీవనం
[ 18-04-2024]
వరుసగా రెండు సార్లు ఎంపీగా ఎన్నికైనా చివరి శ్వాస వరకు పల్లెటూరులోనే సాధారణ జీవితం గడిపారు జువ్వాడి రమాపతిరావు. 1916లో గన్నేరువరంలో జన్మించిన ఆయన వివాహం అనంతరం అత్తగారి ఊరైన గంగాధర మండలం సర్వారెడ్డిపల్లికి వచ్చి స్థిరపడ్డారు. -
ఎన్నికల పరిశీలకులొస్తున్నారు
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెంచింది. -
హాట్రిక్ విజేత..అరుదైన ఘనత
[ 18-04-2024]
ఉమ్మడి జిల్లాలో నలుగురు నేతలు వరుసగా మూడు సార్లు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ రికార్డు సొంతం చేసుకున్నారు. కరీంనగర్ నుంచి ముగ్గురు, పెద్దపల్లి నుంచి ఒకరు గెలుపొంది రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు. -
అక్కడ స్థానికేతరులే అధికం
[ 18-04-2024]
1962లో ఆవిర్భవించిన పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు ఒక్కసారి మినహా అన్ని ఎన్నికల్లో స్థానికేతరులే గెలుపొందారు. 1980లో 7వ లోక్సభ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన కోదాటి రాజలింగం మాత్రమే స్థానికుడు. -
వసతుల మెరుగుకు కార్యాచరణ
[ 18-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం నగరపాలికల్లో కనీస మౌలిక వసతులు మెరుగుపర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రధానంగా తాగునీరు, భూగర్భ మురుగునీటి వ్యవస్థను బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటారు. -
ఆదాయంలో జమ్మికుంట మార్కెట్ టాప్
[ 18-04-2024]
పంటలకు పెరిగిన మద్దతు ధర, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పాత బకాయిలు జమకావటం, చెక్పోస్టులు, గిడ్డంగుల అద్దెలు, లైసెన్సులు, మార్కెట్లకు వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాల ద్వారా లభించే ఆదాయంతో ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల వ్యవసాయ మార్కెట్ మినహా కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లు మార్కెటింగ్ శాఖ నిర్ణయించిన ఆర్థిక ఆదాయ లక్ష్యాన్ని అధిగమించాయి. -
ఓటరు దరఖాస్తులకు త్వరితగతిన పరిష్కారం
[ 18-04-2024]
నామినేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సూచించారు. బుధవారం ఆయన నిర్వహించిన పెద్దపల్లి నుంచి కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, శ్యామ్ప్రసాద్లాల్లు పాల్గొన్నారు. -
మిల్లుల్లోనే బియ్యం.. ధాన్యానికేదీ స్థలం?
[ 18-04-2024]
గత వానాకాలం సీజన్కు సంబంధించిన బియ్యానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో మిల్లుల్లోనే నిల్వలు పేరుకుపోయాయి. గత సీజన్కు సంబంధించిన సీఎంఆర్ లక్ష్యాలను మిల్లర్లు పూర్తి చేయాలనే గడువును జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పొడిగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..
-
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
-
తెదేపా అభ్యర్థులకు ఈనెల 21న బీఫామ్లు ఇవ్వనున్న చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
బేబీ ఫుడ్లో చక్కెర.. వివరణ ఇచ్చిన నెస్లే ఇండియా
-
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ