ఎప్పుడు పూర్తయ్యేనో!
ప్రజల రాకపోకల కోసం, వాగులో ప్రవహించే వరద నీరు నిలిచి కోరుట్ల పట్టణంలో భూగర్భజలాలు పెంచేందుకు చేపట్టిన వంతెన, చెక్డ్యాం నిర్మాణం నిధుల లేమితో ఏళ్ల తరబడి అసంపూర్తిగా నిలిచిపోయింది.
నిధులు లేక నిలిచిన వంతెన, చెక్డ్యాం
కోరుట్ల-సంగెం వాగులో నిలిచిపోయిన వంతెన, చెక్డ్యాం నిర్మాణం
న్యూస్టుడే, కోరుట్ల: ప్రజల రాకపోకల కోసం, వాగులో ప్రవహించే వరద నీరు నిలిచి కోరుట్ల పట్టణంలో భూగర్భజలాలు పెంచేందుకు చేపట్టిన వంతెన, చెక్డ్యాం నిర్మాణం నిధుల లేమితో ఏళ్ల తరబడి అసంపూర్తిగా నిలిచిపోయింది. పూరిస్థాయి నిర్మాణానికి కావాల్సిన నిధుల మంజూరు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కోరుట్ల పట్టణ శివారులోని సంగెం రోడ్డులోనున్న పెద్దవాగుపై వంతెన, చెక్డ్యాం నిర్మించేందుకు 2016లో నాబార్డు నిధులు రూ.3.5 కోట్లను కేటాయించారు. జనవరి 20, 2017లో అప్పటి ప్రజాప్రతినిధులు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. వంతన, చెక్డ్యాం పూర్తిస్థాయి నిర్మాణానికి సుమారు రూ.8 కోట్ల నిధులు అవసరం కాగా గడిచిన ఆరేళ్లలో కేవలం రూ.3.5 కోట్లు మాత్రమే కేటాయించారు. దీంతో వాగులో పుట్టింగ్ చేపట్టి 11 పిల్లర్లు, ఇరువైపులా గోడ నిర్మించారు. వాగులో నీరు నిలిచేందుకు పిల్లర్ల మధ్య అడ్డుగా వాల్ను నిర్మించారు.
అన్నదాతలకు ఇక్కట్లు
రెండేళ్లుగా వర్షాకాలంలో భారీ వర్షాలకు వాగులో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో వంతెనకు ఇరువైపులా నిర్మించిన గోడల పక్కన పెద్దఎత్తున మట్టి కోతకు గురైంది. దీంతో వంతెన గోడలను మరింత దూరంగా పెద్దగా నిర్మించాల్సిన పరిస్థితి నెలకొంది. వీటి నిర్మాణాలకు మరిన్ని నిధులు కేటాయించాల్సి ఉంది. మూడేళ్లుగా వంతెన పిల్లర్లపై స్లాబులు నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో గుత్తెదారు పనులను మధ్యలోనే వదిలేశాడు. వాగులోంచి అన్నదాతలు, సంగెం, నాగులపేట గ్రామస్థులు రాకపోకలు సాగించేందుకు తాత్కాలికంగా రోడ్డును నిర్మించారు. వర్షాలకు వాగులో నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో తాత్కాలిక రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. వాగులో నీటి ప్రవాహం తగ్గిన తర్వాత ప్రజల రాకపోకలకు పైపులు వేయడంతో దానిపై తాత్కాలికంగా మట్టిరోడ్డును ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది. దీంతో ప్రజలు, ద్విచక్ర వాహనదారులు వాగులో ఇబ్బందులు పడుతూ ప్రయాణిస్తున్నారు. వాగు అవతలి వైపున కోరుట్లకు చెందిన రైతులవి వందల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. అన్నదాతలు వర్షాకాలంలో తమ పొలాలకు వెళ్లేందుకు 8 కిలోమీటర్ల దూరం తిరిగి సంగెం గ్రామం మీదుగా వెళ్తూ ఇక్కట్లు పడుతున్నారు. వంతెన నిర్మాణ పూర్తికి నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. ‘న్యూస్టుడే’ పంచాయతీరాజ్ ఏఈ ఆదిత్యను సంప్రదించగా.. వంతెన పూర్తిస్థాయి నిర్మాణం కోసం రెండేళ్ల కిందట రూ.3.5 కోట్ల నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు. నిధులు మంజూరుకాగానే పిల్లర్లపై స్లాబ్లను నిర్మించి వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకా.. వెంకటస్వామికి ఆ పేరెలా వచ్చింది?
[ 24-04-2024]
కాంగ్రెస్ పార్టీ దివంగత, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి ‘కాకా’గానే ఎక్కువ మందికి సుపరిచితులు. ఆయనకు ఈ పేరు రావడం వెనుక ఆసక్తికర అంశం ఉంది. -
యాప్ కష్టాలు
[ 24-04-2024]
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన యాప్ల్లో సమాచారం నిక్షిప్తం చేయాల్సి ఉంది. -
నిర్వహణ భారం.. కమీషన్లో కోత
[ 24-04-2024]
కేంద్రాల నిర్వహణ భారంగా మారగా.. వచ్చిన కమీషన్లో కోత విధించడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. -
ఇక ట్వంటీ20 పోరు!
[ 24-04-2024]
పోలింగ్ తేదీకి బుధవారం నుంచి సరిగ్గా ఇరవై రోజులుంది.. అచ్చంగా ట్వంటీ20 క్రికెట్ ఆటలోని 20 ఓవర్ల మాదిరి సమరం. -
మిగిలింది రెండు రోజులే!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలి అంకం రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నెల 25వ తేదీతో నామినేషన్ల స్వీకరణ పూర్తవనుంది. -
నకిలీ పత్రాలు సృష్టించి.. ఇల్లు ధ్వంసం
[ 24-04-2024]
నకిలీ పత్రాలు సృష్టించి, ఇంటిని ధ్వంసం చేసి, దాడికి పాల్పడిన అయిదుగురిని కరీంనగర్ కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. -
పార్టీ పెద్దల సమ్మతితోనే రాజేందర్ నామినేషన్
[ 24-04-2024]
పార్టీ పెద్దల సమ్మతితోనే తామంతా కలిసి కాంగ్రెస్ తరఫున వెలిచాల రాజేందర్రావుతో నామినేషన్ వేయించామని, గెలిపిం చుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. -
అతివల ఉపాధికి ఆదరువేదీ!
[ 24-04-2024]
రాష్ట్రంలో 6 లక్షల మంది బీడీ కార్మికులుండగా అత్యధికంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నారు. -
ఆ పది మందికే 50 శాతం ఓటర్ల మద్దతు
[ 24-04-2024]
ఎన్నికల్లో ప్రత్యర్థి కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా విజయం సాధించినట్లే. అయితే గెలుపొందిన అభ్యర్థికి నియోజకవర్గంలోని ఎంత మంది ఓటర్ల మద్దతు ఉందనేది పోటీలో ఉన్న అభ్యర్థులు, నమోదైన పోలింగ్ శాతాన్ని బట్టి మారుతుంది. -
ఆయుధాలు అప్పగించారు..
[ 24-04-2024]
వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు. -
మాతాశిశుకు తప్పని ఉక్కపోత
[ 24-04-2024]
చంటి బిడ్డలు, బాలింతలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వేసవి ఉక్కపోత తప్పడం లేదు. -
బ్యాలెట్ యుద్ధానికి చకచకా సన్నద్ధం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. -
పనులకు ఆటంకాలు.. రాకపోకలకు అవస్థలు
[ 24-04-2024]
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. -
తైబజార్... చిరు వ్యాపారుల బేజార్
[ 24-04-2024]
పురపాలక సంఘంలో తైబజార్ గుత్తేదారు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు.