ప్రమాద ఘంటికలు
ఎగువ మానేరు కాల్వలపై వంతెనలు నిర్మించి ఏళ్లు గడుస్తోంది. వీటి రక్షణ గోడలు కొన్ని చోట్ల ధ్వంసమవగా.. మరికొన్ని చోట్ల పలుమార్లు రహదారి మరమ్మతులు చేపట్టిన కారణంగా రోడ్డుకు సమాంతరంగా మారి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.
వంతెనలపై లేని రక్షణ గోడలు
ఎగువ మానేరు కాల్వలపై వంతెనలు నిర్మించి ఏళ్లు గడుస్తోంది. వీటి రక్షణ గోడలు కొన్ని చోట్ల ధ్వంసమవగా.. మరికొన్ని చోట్ల పలుమార్లు రహదారి మరమ్మతులు చేపట్టిన కారణంగా రోడ్డుకు సమాంతరంగా మారి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఈ వంతెనల వద్ద కనీసం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన దాఖలాలే కనిపించడం లేదు. గతంలో జరిగిన ప్రమాదాల దృష్ట్యా సంబంధిత అధికారులు దృష్టిసారించి ఆయా గ్రామాల్లో కాల్వలపై ఉన్న వంతెనల వద్ద అడ్డుగోడలు నిర్మించేలా చర్యలు చేపట్టాల్సి ఉంది.
న్యూస్టుడే, ముస్తాబాద్
రోడ్డుకు సమాంతరంగా..
ముస్తాబాద్ గ్రామ శివారు పోత్గల్ వెళ్లే ప్రధాన రోడ్డు ఎగువ మానేరు కాల్వపై రక్షణ గోడలు లేక ప్రమాదకరంగా మారింది. మండల కేంద్రం నుంచి పోత్గల్, గన్నెవారిపల్లె, సేవాలాల్తండా మీదుగా జిల్లా కేంద్రానికి వాహనదారులు వస్తూపోతూ ఉంటారు. ఆర్టీసీ బస్సులు సైతం ఈ రోడ్డుగుండా నడుస్తుంటాయి. గతేడాది రాత్రి వేళ ఓ కారు అడ్డుగోడను ఢీకొట్టింది. రోడ్డుకు సమాంతరంగా రక్షణ గోడ ఉండడంతో దూరం నుంచి వచ్చే వాహనాలకు కనిపించకపోగా ప్రమాద హెచ్చరిక బోర్డు లేదు.
ఇరువైపులా పిచ్చిమొక్కలు
ముస్తాబాద్ మండల కేంద్రం నుంచి నామాపూర్ మీదుగా రాంరెడ్డిపల్లె, కొండాపూర్, ఎల్లారెడ్డిపేట మండలానికి నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రాంరెడ్డిపల్లె శివారులో ఎగువ మానేరు కాల్వ వంతెన వద్ద వంతెనకు ఇరువైపులా ఇలా పిచ్చి మొక్కలు ఉండడంతో వాహనదారులకు వంతెన వద్ద అడ్డుగోడలు కనిపించడం లేదు.
ఇరుకు వంతెనతో ఇబ్బందులు
ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి నుంచి గోపాల్పల్లె మీదుగా కొండాపూర్ గ్రామానికి వెళ్లే రోడ్డులో ఎగువ మానేరు కాల్వ వంతెన ఇరుకుగా ఉంది. నిత్యం ఆర్టీసీ బస్సుతో పాటు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రక్షణ గోడలు రోడ్డుకు సమాంతరంగా మారి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. జిల్లా కేంద్రం నుంచి బస్సు ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి మీదుగా కొండాపూర్ మీదుగా మండల కేంద్రానికి రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో అడ్డుగోడలు నిర్మించాల్సి ఉంది.
కానరాని సూచికలు
ముస్తాబాద్ మండలం సేవాలాల్తండా గ్రామ పరిధిలోని రాగంవాడ ఉంది. రాగంవాడలో కాల్వకు ఓ వైపు 12 కుటుంబాలు నివాసముండగా మరోపక్క పదమూడు కుటుంబాలు నివాసముంటున్నాయి. కాల్వపైన సీసీరోడ్డు వేశారు. ఇరువైపుల మాత్రం రక్షణ గోడలు నిర్మించక అలాగే వదిలేశారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకోస్తుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
అధికారులు చర్యలు చేపట్టాలి
ప్రధాన రోడ్ల వెంట ఎగువ మానేరు కాల్వల వద్ద కల్వర్టుల రక్షణ గోడలు రోడ్డుకు సమాంతరంగా మారాయి. ముస్తాబాద్ నుంచి పోత్గల్, చిప్పలపల్లి నుంచి కొండాపూర్ వెళ్లే రోడ్డులో, నామాపూర్ నుంచి రాంరెడ్డిపల్లె దారిలో, రాగంవాడలో.. ఇలా అనేక చోట్ల ఎగువ మానేరు కాల్వపై ప్రమాదకరంగా మారిన వంతెనలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించాలి. త్వరితగతిన వంతెనలను విస్తరించడంతోపాటు రక్షణ గోడలు నిర్మించాలి.
తోట ధర్మేందర్, పోత్గల్
ప్రతిపాదనలు పంపాం
ఎగువ మానేరు కాల్వపై ప్రమాదకరంగా ఉన్న కల్వర్టులను గుర్తించాం. అడ్డుగోడలు నిర్మించేలా ప్రతిపాదనలను సిద్ధం చేసి పైఅధికారులకు నివేదించాం. నిధులు మంజూరై, పైఅధికారుల నుంచి ఆదేశాలు రాగానే కల్వర్టుల వద్ద అడ్డుగోడలు నిర్మిస్తాం.
వంశీకృష్ణ, నీటిపారుదల శాఖ ఏఈ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
[ 23-04-2024]
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
పిల్లల అల్లరిని దారి మళ్లించండి
[ 23-04-2024]
పది నెలలపాటు చదువుతో కుస్తీ పడిన పిల్లలకు వేసవి సెలవులు ఉపశమనం ఇస్తాయి. ఆటాపాటలతో సరదాగా గడపొచ్చని భావిస్తుంటారు. -
మోదీ వ్యాఖ్యల్లో ఓటమి భయం
[ 23-04-2024]
లోక్సభ మొదటి దశ ఎన్నికల తీరును చూసిన ప్రధాని మోదీ ఓటమి భయంతో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తుందని వ్యాఖ్యానించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. -
నాలుగో రోజు 25 నామినేషన్లు
[ 23-04-2024]
నామినేషన్ల ప్రక్రియ నాలుగో రోజు సోమవారం కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. -
హామీలను విస్మరించిన ప్రభుత్వం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని కరీంనగర్ భారాస అభ్యర్థి వినోద్కుమార్ అన్నారు. -
సెప్టెంబరులో చక్కెర కర్మాగారం తెరిపిస్తాం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా!
[ 23-04-2024]
ప్రాంతానికి కొత్త కావచ్చు, రాజకీయాలకు, ప్రజా సేవకు కొత్తకాదని, అవకాశమిస్తే పార్లమెంట్ పరిధిని అభివృద్ధి చేసి చూపిస్తానని నిజామాబాద్ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. -
దారులన్నీ కొండగట్టుకే
[ 23-04-2024]
తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి దీక్షాపరులు తరలివస్తున్నారు. -
ఓటరు నమోదులో ఫలించిన చైతన్యం
[ 23-04-2024]
ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కు నమోదుకు యువతలో నూతనోత్సాహం ఉరకలేసింది. -
ప్రత్యేక నిధులు.. తీరనున్న ఇక్కట్లు
[ 23-04-2024]
రామగుండం నగరపాలక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అమృత్-2.0, యు.ఐ.డి.ఎఫ్.(అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్) నిధులతో పరిష్కారం కానున్నాయి. -
కాంగ్రెస్ నైజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
[ 23-04-2024]
భారాస పాలనలోనే అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ ఫలాలు అందుకున్నారని, గడిచిన నాలుగు నెలల కాలంలో సంక్షేమ పథకాలను అటకెక్కించిన కాంగ్రెస్ పాలకుల నైజాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పెద్దపల్లి లోక్సభ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. -
లెక్కలు తేలేనా?
[ 23-04-2024]
జిల్లా వస్త్ర పరిశ్రమకు గత ప్రభుత్వం సంక్షేమ, పాఠశాల విద్యాశాఖలకు సంబంధించిన వస్త్రోత్పత్తుల ఆర్డర్లు ఇచ్చింది. -
నిధులున్నా ప్రారంభం కాని పనులు
[ 23-04-2024]
గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు రవాణా వ్యవస్థ మెరుగుపరిచి రెండు జిల్లాల గ్రామాలను అనుసంధానం చేయాలనే లక్ష్యంతో తారు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
అమాత్యులుగా ఆ నలుగురు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి లోక్సభా నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఎంపీల్లో ఇప్పటివరకు నలుగురికి మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!