ప్రగతి పథంలో పల్లెలు : మంత్రి కొప్పుల
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో గ్రామాలన్నీ ప్రగతిబాటలో నడుస్తున్నాయని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
సర్పంచి కృష్ణారావుకు ప్రశంసాపత్రం అందజేస్తున్న మంత్రి ఈశ్వర్
జగిత్యాల, న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో గ్రామాలన్నీ ప్రగతిబాటలో నడుస్తున్నాయని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో ఆదివారం జాతీయ పంచాయత్ అవార్డు పురస్కారాల్లో భాగంగా జిల్లాస్థాయి ఉత్తమ గ్రామపంచాయతీ సర్పంచులకు ప్రశంసాపత్రాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కల పెంపకం, తడి, పొడి చెత్త సేకరణ లాంటి పనులతో గ్రామాల రూపురేఖలే మారాయన్నారు. సర్పంచులు, అధికారులు సమన్వయంతో పనిచేయటం వల్లే మంచి ఫలితాలు వస్తున్నాయని జాతీయస్థాయిలో 20 ఉత్తమ గ్రామ పంచాయతీలను ప్రకటిస్తే అందులో 19 మన రాష్ట్రానికి చెందినవి కావటం గర్వకారణమన్నారు. దేశంలోనే వందశాతం ఓడీఎఫ్ ప్లస్ సాధించిన రాష్ట్రం మనదేనని మంత్రి ఈశ్వర్ అన్నారు. జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా మాట్లాడుతూ జిల్లా స్థాయిలో 9 అంశాల్లో 27 గ్రామపంచాయతీలు ఉత్తమ పంచాయతీలుగా ఎంపిక కావటం అభినందనీయమన్నారు. జగిత్యాల, వేములవాడ ఎమ్మెల్యేలు డాక్టర్ ఎం.సంజయ్కుమార్, రమేష్బాబు, డీసీఎంఎస్ అధ్యక్షుడు డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, జడ్పీవైస్ఛైర్మన్ వొద్దినేని హరిచరణ్రావు, డీపీవో పి.నరేష్, జడ్పీటీసీలు ప్రశాంతి, నాగం భూమయ్య, బాదినేని రాజేందర్, బత్తిని అరుణ, ఎంపీపీ మెన్నేని స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో ఉత్తమ పంచాయతీలు
* దారిద్య్రం లేకుండా కుటుంబాలకు జీవనోపాధి కల్పించిన పంచాయతీలుగా దేశాయిపేట(మేడిపల్లి), శంకర్రావుపేట(గొల్లపల్లి), డబ్బా(ఇబ్రహీంపట్నం)
* సంపూర్ణ ఆరోగ్య పంచాయతీలుగా తాటిపల్లి(జగిత్యాల రూరల్), షెకల్ల(బుగ్గారం), గొర్రెగుండం(మల్యాల)
* చైల్డ్ఫ్రెండ్లీ పంచాయతీలుగా అంబారిపేట(జగిత్యాల అర్బన్), కల్వకోట(మేడిపల్లి), పడకల్(వెల్గటూరు)
* సమృద్ధి నీటి వనరులు గల పంచాయతీలుగా మద్దునూరు(బుగ్గారం), మంగెళ(బీర్పూర్), ఫకీర్ కొండాపూర్(ఇబ్రహీంపట్నం)
* క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీలుగా నాగులపేట(కోరుట్ల), శాలపల్లి(పెగడపల్లి), నాచుపల్లి(కొడిమ్యాల)
* సొంత వనరులు గల పంచాయతీలుగా దొంతాపూర్(ధర్మపురి), వర్షకొండ(ఇబ్రహీంపట్నం), మల్యాల మండలం కేంద్రం
* సాంఘిక భద్రత గల పంచాయతీలుగా కలికోట(కథలాపూర్), చింతలపేట(మెట్పల్లి), సింగరావుపేట(రాయికల్)
* ఉత్తమ పరిపాలన పంచాయతీలుగా నర్సింగాపూర్(జగిత్యాల రూరల్), సిర్పూర్(మల్లాపూర్), అల్లీపూర్(రాయికల్)
* ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీలుగా వల్లంపల్లి(మేడిపల్లి), మెట్ల చిట్టాపూర్(మెట్పల్లి), హిమ్మత్రావుపేట(కొడిమ్యాల)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం
[ 18-04-2024]
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణోత్సవాన్ని ఆలయ వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
నేటి నుంచి నామినేషన్లు షురూ!
[ 18-04-2024]
ఎన్నికల సమరంలో అసలైన ఘట్టం గురువారం నుంచి మొదలవనుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ నెల రోజుల కిందటే వెలువడినప్పటికీ నేడు వెలువడే అధికారిక నోటిఫికేషన్తో అసలు అంకం షురూ అవనుంది. -
ప్రచార పర్వానికి కాంగ్రెస్ సిద్ధం!
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి గురువారం నామపత్రాల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమవుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లోక్సభ స్థానం పరిధిలో ప్రచార కసరత్తు ప్రారంభించింది. -
కొప్పుల మొదటిసారి.. జీవన్ మూడోసారి
[ 18-04-2024]
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో వేర్వేరు పార్టీలు, వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న తాటిపర్తి జీవన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్లకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా గెలుపొందిన జీవన్రెడ్డి స్వగ్రామం పెగడపల్లి మండలం బతికెపల్లి. -
క్లిక్ దూరంలో సమగ్ర సమాచారం
[ 18-04-2024]
ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వెబ్సైట్ రూపొందించింది. ceotelangana.nic.in లో ఓటరు నమోదుతో పాటు సవరణలు, తొలగింపులు తదితర అంశాలుంటాయి. -
రెండు సార్లు ఎంపీ.. సాధారణ జీవనం
[ 18-04-2024]
వరుసగా రెండు సార్లు ఎంపీగా ఎన్నికైనా చివరి శ్వాస వరకు పల్లెటూరులోనే సాధారణ జీవితం గడిపారు జువ్వాడి రమాపతిరావు. 1916లో గన్నేరువరంలో జన్మించిన ఆయన వివాహం అనంతరం అత్తగారి ఊరైన గంగాధర మండలం సర్వారెడ్డిపల్లికి వచ్చి స్థిరపడ్డారు. -
ఎన్నికల పరిశీలకులొస్తున్నారు
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెంచింది. -
హాట్రిక్ విజేత..అరుదైన ఘనత
[ 18-04-2024]
ఉమ్మడి జిల్లాలో నలుగురు నేతలు వరుసగా మూడు సార్లు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ రికార్డు సొంతం చేసుకున్నారు. కరీంనగర్ నుంచి ముగ్గురు, పెద్దపల్లి నుంచి ఒకరు గెలుపొంది రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు. -
అక్కడ స్థానికేతరులే అధికం
[ 18-04-2024]
1962లో ఆవిర్భవించిన పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు ఒక్కసారి మినహా అన్ని ఎన్నికల్లో స్థానికేతరులే గెలుపొందారు. 1980లో 7వ లోక్సభ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన కోదాటి రాజలింగం మాత్రమే స్థానికుడు. -
వసతుల మెరుగుకు కార్యాచరణ
[ 18-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం నగరపాలికల్లో కనీస మౌలిక వసతులు మెరుగుపర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రధానంగా తాగునీరు, భూగర్భ మురుగునీటి వ్యవస్థను బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటారు. -
ఆదాయంలో జమ్మికుంట మార్కెట్ టాప్
[ 18-04-2024]
పంటలకు పెరిగిన మద్దతు ధర, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పాత బకాయిలు జమకావటం, చెక్పోస్టులు, గిడ్డంగుల అద్దెలు, లైసెన్సులు, మార్కెట్లకు వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాల ద్వారా లభించే ఆదాయంతో ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల వ్యవసాయ మార్కెట్ మినహా కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లు మార్కెటింగ్ శాఖ నిర్ణయించిన ఆర్థిక ఆదాయ లక్ష్యాన్ని అధిగమించాయి. -
ఓటరు దరఖాస్తులకు త్వరితగతిన పరిష్కారం
[ 18-04-2024]
నామినేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సూచించారు. బుధవారం ఆయన నిర్వహించిన పెద్దపల్లి నుంచి కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, శ్యామ్ప్రసాద్లాల్లు పాల్గొన్నారు. -
మిల్లుల్లోనే బియ్యం.. ధాన్యానికేదీ స్థలం?
[ 18-04-2024]
గత వానాకాలం సీజన్కు సంబంధించిన బియ్యానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో మిల్లుల్లోనే నిల్వలు పేరుకుపోయాయి. గత సీజన్కు సంబంధించిన సీఎంఆర్ లక్ష్యాలను మిల్లర్లు పూర్తి చేయాలనే గడువును జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పొడిగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్