మళ్లిపోనున్న నిధులు
గ్రామాల్లో సీసీ, మట్టి రహదారులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం(ఈజీఎస్) కింద నిధులు మంజూరు చేస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ కోరుట్ల మండలానికి రూ.5 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
ఈజీఎస్ కింద చేపట్టిన పనులకు నెలాఖరు వరకే అవకాశం
న్యూస్టుడే, కోరుట్లగ్రామీణం
ధర్మారం గ్రామంలో నిర్మించిన సీసీ రహదారి
గ్రామాల్లో సీసీ, మట్టి రహదారులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం(ఈజీఎస్) కింద నిధులు మంజూరు చేస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ కోరుట్ల మండలానికి రూ.5 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కోరుట్ల నియోజకవర్గంలో ఒక్కో గ్రామానికి రూ.10 నుంచి రూ.30 లక్షల వరకు నిధులు మంజూరు చేశారు. ఈ పనులను ఈనెల 31 వరకు పూర్తి చేయాల్సి ఉంది. పనులు ప్రారంభించకుండా పూర్తి చేయకపోతే నిధులు వెనక్కి మళ్లిపోతాయి. నిధులు ఖర్చుచేయక పోతే వచ్చే ఏడాది నిధుల నుంచి బిల్లులు మంజూరవుతాయి. జిల్లాలోని 18 మండలాలకు రూ.36.74 కోట్లు మంజూరు కాగా ఇంత వరకూ రూ.31.45 కోట్లు నిధులు వినియోగించారు. కోరుట్ల మండలానికి ఈజీఎస్ నిధులు రూ.3.60 కోట్లు రెండు నెలల కిందట మంజూరు కాగా 1.40 కోట్ల నిధులు ఖర్చు చేశారు. కొన్ని గ్రామాల్లో సీసీ రహదారులు వేయగా మరికొన్ని గ్రామాల్లో ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు. కోరుట్ల మండలం జోగన్పల్లి గ్రామం నుంచి కల్లూర్ గ్రామం వరకూ మట్టి రోడ్డు వేయడానికి రూ.కోటి నిధులు, కల్లూర్ నుంచి ధర్మారం వరకూ మట్టి రోడ్డు నిర్మాణానికి రూ.70 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఇప్పటి వరకూ ఈ పనులకు టెండర్లు వేసేందుకు గుత్తెదారులు ముందుకు రాకపోవడం గమనార్హం.
బిల్లుల కోసం ఎదురుచూపులు
గ్రామాల్లో సీసీ రహదారుల నిర్మాణ పనులను స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులకు అప్పగించారు. కోరుట్ల మండలంలో ఎనిమిది గ్రామాల్లో రూ.1.20 కోట్ల వరకూ సీసీ రహదారుల పనులు చేపట్టారు. పనులు పూర్తి చేసిన వారు బిల్లుల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. వడ్డీకి డబ్బులు తెచ్చి రోడ్లు నిర్మించినా బిల్లులు చెల్లింపుల్లో అలస్యం కావడంతో గిట్టుబాటు కాక పోవడంతో పాటు నష్టపోవాల్సి వస్తోందని వాపోతున్నారు.
రెండు నెలల ముందు మంజూరు
జనవరి నెలలో కేంద్రం నిధులు మంజూరు చేయడంతో గ్రామాల్లో సీసీ రహదారులు, మురుగు కాలువల నిర్మాణాలను హడావిడిగా చేపడుతున్నారు. రూ.5 లక్షల వరకైతే నామినేషన్ పద్ధతిపై అంతకంటే ఎక్కువగా ఉంటే టెండర్లు ఖరారు చేయాలి. అలా కాకుండా గ్రామపంచాయతీల్లో పనులను విభజించి నామినేషన్ పద్ధతిలో పూర్తి చేశారు. ఉపాధి హామీలో 60 శాతం కూలీలు, 40 శాతం సామగ్రి(మెటీరియల్ కాంపొనెట్)తో రహదారి పనులు పూర్తి చేయాలి. బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతుందని పనులు చేపట్టడం లేదని పనులు దక్కించుకున్న వారు వాపోతున్నారు.
పూర్తి చేయాలని సూచించాం
గోపాల్రెడ్డి, పంచాయతీరాజ్ డీఈఈ కోరుట్ల
సీసీ రహదారుల పనులు ఈ నెలాఖరు వరకూ పూర్తి చేయాలని పనులు దక్కించుకున్నా వారికి తెలియజేశాం. ఖర్చు చేయక పోతే నిధులు మళ్లిపోతాయి. వారం రోజుల్లో పనులు పూర్తి చేయాలని సూచించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూసేకరణలో జాప్యం
[ 28-03-2024]
భూసేకరణలో జాప్యమే జాతీయ రహదారుల విస్తరణకు శాపంగా మారుతోంది. జిల్లాలో ప్రధానంగా జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిగా మార్చి దశాబ్దం కావస్తున్నా.. నిర్మాణం మొదలు కావటం లేదు -
నత్తనడకన నిర్మాణాలు
[ 28-03-2024]
వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం పల్లెదవాఖానాలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర(సబ్సెంటర్ల)ను పల్లె దవాఖానాలుగా మార్చారు -
నిధులు వెచ్చించి.. పనులు వదిలేసి
[ 28-03-2024]
పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఆధునిక సాంకేతికను జోడించి పెద్ద నగరాలకు దీటుగా పోటీ పడేందుకు ప్రణాళికలు చేసిన నగరపాలిక.. ఆ విధానం అమలులో వెనుకబడింది -
తాగునీటి వృథా వద్దు : కలెక్టర్
[ 28-03-2024]
అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
కాంగ్రెస్ నిజామాబాద్ లోక్సభ స్థానం టికెట్ జీవన్రెడ్డికే దక్కింది. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది -
తొలిమెట్టు నోడల్ అధికారులకు భత్యం
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రత్యేక బోధన పద్ధతులతో కొనసాగుతున్న ఈ కార్యక్రమ పర్యవేక్షణకు మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 28-03-2024]
వాతావరణ సమాచారాన్ని ప్రతిఒక్కరి దైనందిన కార్యకలాపాల్లో భాగం చేయాలనే ఉద్దేశంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇటీవల ‘పంచాయత్ మౌసం సేవా’ మొబైల్ యాప్ విడుదల చేసింది. -
పఠనాలయం సద్వినియోగం... కల సాకారం
[ 28-03-2024]
గ్రంథాలయ పుస్తకాలతోనే ఏకకాలంలో రెండు ఉద్యోగాలు సాధించగలిగాను. తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ నిర్వహించిన ఫలితాల్లో పీజీటీ సాంఘికశాస్త్రం, జూనియర్ కళాశాలలో పౌరశాస్త్రం లెక్చరర్గా ఉద్యోగాలకు ఎంపికయ్యాను -
పంచాయతీల ఖజానా ఖాళీ
[ 28-03-2024]
ఓవైపు ఖజానా ఖాళీ, మరోవైపు సమస్యలు పంచాయతీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జమయ్యే నిధులకు మించిన వ్యయం చేయడంతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఓటు నమోదుకు ప్రత్యేక సాధారణ సెలవు
[ 28-03-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే