ప్రణాళికతో చదివితే పదిలో విజయం
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నాయి. విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఉత్తమ ఫలితాల సాధనకు నిరంతరం శ్రమిస్తున్నారు. ఇప్పటికే ప్రీఫైనల్ రాసి ఉన్నారు.
మిగిలింది ఏడు రోజులే
విద్యార్థులకు విషయ నిపుణుల సూచనలు
న్యూస్టుడే, కరీంనగర్ విద్యావిభాగం
సుభాష్నగర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నాయి. విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఉత్తమ ఫలితాల సాధనకు నిరంతరం శ్రమిస్తున్నారు. ఇప్పటికే ప్రీఫైనల్ రాసి ఉన్నారు. పబ్లిక్ పరీక్షలు సమీపిస్తుండటంతో ఒకింత భయం, ఆత్మవిశ్వాసం వారిలో తొణికిసలాడుతోంది. ఏప్రిల్ 3న ప్రారంభమయ్యే వాటికి ఏడు రోజుల సమయమే మిగిలి ఉంది. మంచి మార్కుల సాధనకు ఏం చదవాలనే సందేహాలు వారిని కలవరపరుసున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ సమయంలో పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలనే అంశంపై జిల్లాలోని విషయ నిపుణుల సూచనలతో ‘న్యూస్టుడే’ కథనమిది.
సాధనతో భౌతికశాస్త్రంలో సత్ఫలితాలు
- బి.ఓదెలు కుమార్, ఫిజిక్స్, జడ్పీహెచ్ఎస్ పచ్చునూర్
పుస్తకంలోని చిత్రాలను ఎక్కువగా సాధన చేయాలి.
* సమస్యలు(లెక్కలు) 1, 2, 4, 5, 9, 10 పాఠాల నుంచి వచ్చే అవకాశముంది. 1, 4, 9 పాఠాల లెక్కలు సాధన చేయాలి.
* తేడాలు(బేధాలు)పై అవగాహన పెంచుకుని పట్టు సాధించాలి.
* నిజ జీవిత ఉపయోగాల్లో పాఠాలను చదివితే పరీక్షలో మంచి మార్కులు సాధించవచ్చు. ప్రయోగాలు, కృత్యాలు చదివేటప్పుడు విధానం, కావాల్సిన పరికరాలు, పరిశీలనలు, జాగ్రత్తలను తప్పక చదివి వాటిని గుర్తుపెట్టుకోవాలి.
* ప్రతి పాఠ్యాంశంలోని ముఖ్యమైన ప్రశ్నలను పునశ్చరణ చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. దీని ద్వారా పార్ట్-బిలో కూడా ఎక్కువ మార్కులు సాధించవచ్చు.
గణితంలో కీలక భావనలు చదవాలి
- సముద్రాల హరికృష్ణ, మ్యాథ్స్, జడ్పీహెచ్ఎస్ కురిక్యాల
* గణిత సూత్రాలు, ముఖ్యమైన భావనలను చదివి అవగాహన పెంచుకోవాలి.
* ప్రాథమిక భావనలైన ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, గుణిజాలు, కారణాంకాలు మొదైలన వాటిని నెమరు వేసుకోవడం ద్వారా సమితులు, సంభావ్యత అధ్యాయాల్లో చక్కగా ఉపయోగపడుతాయి.
* కఠినమైన సమస్యలను ఒకటి రెండు సార్లు అభ్యసనం చేయాలి.
* పార్ట్-బికి 20 మార్కులు. బహుళైచ్ఛిక రూపంలో ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలు రాయాలంటే అన్ని పాఠాలపై అవగాహన అవసరం.
* గ్రాఫ్కి సంబంధించిన సమస్యలకు రేఖాచిత్రాన్ని పెన్సిల్తో గీయాలి. సూచికలు పెట్టాలి. నిర్మాణాలకు చిత్తుపటం వేయాలి.
* త్రికోణమితి-అనువర్తనాలు అనే అధ్యయాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు రాసేప్పుడు సరైన పటాన్ని తప్పక గీయాలి.
అవగాహన పెంచుకుంటే జీవశాస్త్రం సులభం
- కె.ఎస్.అనంతాచార్య, బయోసైన్స్, జడ్పీహెచ్ఎస్ వెల్ది
* జీవశాస్త్రం చదవడం సులభం, అన్ని అంశాలు నిజ జీవితంతో ముడిపడి ఉంటాయి. అన్ని పాఠాల పేర్ల భావనలను విద్యార్థులు పూర్తి తెలుసుకోవాలి.
* 9, 10 పాఠాల నుంచి పర్యావరణానికి సంబంధించి ప్రశ్నలు వస్తున్నందున వాటిపై పట్టు సాధించాలి.
* ప్రయోగం ఉద్దేశం, పరికరాలు, విధానం, ఫలితాలను రాసేలా అధ్యయనం చేయాలి.
* పటాలపై దృష్టి నిలపడంతోపాటు భాగాలను గుర్తించడం, దాని విధిని తెలుసుకోవాలి.
* ప్రతి పాఠాన్ని చదివి అవగాహన పెంచుకోవాలి.
* జవాబులు రాసేటప్పుడు విద్యార్థులు విజ్ఞానశాస్త్ర సంబంధిత సాంకేతిక పదజాలాన్ని ఉపయోగించాలి.
* సైన్స్ పరీక్ష ఉ.9.30 నుంచి మ.12.50 వరకు ఉంటుంది. ఇందులో జీవశాస్త్రం పరీక్ష ఉ.11.20 నుంచి మ.12.50 వరకు జరుగుతుంది. పార్ట్-బికి 15 ని.ల సమయం కేటాయించారు.
సాంఘికశాస్త్రం క్లుప్తంగా చదవాల్సిందే..
-ఆరెల్లి కుమారస్వామి, సోషల్, జడ్పీహెచ్ఎస్, ముదిమాణిక్యం
* విద్యార్థులు అన్ని పాఠాలపై అవగాహన కల్గి ఉండాలి.
* పేరాగ్రాఫ్ పరిచయ వాక్యం, విశ్లేషణ, ముగింపు అనే మూడు సూచికాలతో సమాధానం రాయాలి.
* పుస్తకంలోని చదివిన వాటికి ప్రస్తుత సమకాలీన అంశాలను జోడించి ప్రశ్నలు అడుగుతున్నందున వాటికి సంబంధించిన పాఠాలపై అవగాహన పెంచుకోవాలి.
* పాఠ్య పుస్తకం దాటి పటాలను అడగరు.
* భారతదేశం, తెలంగాణ రాష్ట్ర అవుట్లైన్ పటాలను గీయడం, సరిహద్దు రాష్ట్రాలను గర్తించడం వంటి వాటిపై సాధన చేయాలి. పుస్తకంలోని ప్రతి ప్రదేశాన్ని గుర్తించి భారతదేశ, ప్రపంచ పటాలను సాధన చేయాలి.
* సమాచార నైపుణ్యం, పట నైపుణ్యం, ప్రశంస-సున్నితత్వం, మల్టీఫుల్ ఛాయిస్ ప్రశ్నలపై ఎక్కువ దృష్టి పెడితే మంచి మార్కులు పొందవచ్చు.
* పార్ట్-బిలో 20 మార్కులకు మల్టీఫుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరీంనగర్ టికెట్ ఎవరి చేతికి?
[ 29-03-2024]
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారుపై ఆ పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది.. ఇప్పటికే భారాస, భాజపాల అభ్యర్థులు ఖరారవగా.. హస్తం పార్టీ తరఫున బరిలో నిలిచేదెవరో తెలియకపోవడంతో కాంగ్రెస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు అభ్యర్థి తేలేదెప్పుడు.. అని ఆందోళన చెందుతున్నారు. -
కనుల పండువగా శివయ్య కల్యాణం
[ 29-03-2024]
ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో గురువారం శివ కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. -
ఆందోళన వద్దు.. అవకాశాలు కోకొల్లలు!
[ 29-03-2024]
విద్యార్థులు ప్రాథమిక విద్య నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ పదో తరగతి పూర్తి చేశారు. ఒకట్రెండు రోజుల్లో పరీక్షలు కూడా పూర్తి చేసి ఉన్నతవిద్య వైపు అడుగులు వేయనున్నారు. -
అవసరాల మేరకు ఏదీ అనుసంధానం!
[ 29-03-2024]
ఈ రెండు అంశాల్లోనే కాదు. ప్రయాణికుల అవసరాలు తీర్చడంలో ద.మ.రై.అధికారులు ఆది నుంచీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. రైల్వే ఉద్యోగుల అవసరాలు, అధికారులు, నాయకులు లాబీయింగులతోనే కొత్త హాల్టింగులు, ఇతర వసతులు కల్పిస్తున్నారు. -
కరీంనగర్ బస్స్టేషన్ ఆస్తి పన్ను రూ.1.88 కోట్లు చెల్లింపు
[ 29-03-2024]
ఆస్తిపన్ను బకాయిలపై 90 శాతం రాయితీ గడువు మూడు రోజుల్లో ముగుస్తుందని నగరపాలక కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ తెలిపారు. -
భార్య చేతిలో భర్త హతం
[ 29-03-2024]
భర్త మద్యానికి బానిసై శారీరకంగా.. మానసికంగా వేధిస్తున్నాడని వేదనకు గురైన ఓ భార్య తనకు తెలిసిన ఇద్దరి సహాయంతో తాళ్లతో కట్టేసి.. కళ్లలో కారం చల్లి... ఒంటిపై వేడి నీళ్లు పోసి తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయి మృతి చెందాడు. -
లోక్సభ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పరీక్ష
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
వేసవి గట్టెక్కేనా!
[ 29-03-2024]
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ పట్టణాలకు డబ్బాలోని గ్రిడ్ ద్వారా మిషన్ భగీరథ పథకం నీరు సరఫరా అవుతోంది. ధర్మపురి పట్టణానికి డబ్బా నుంచి పైపులైన్లు వేసినా చివరి ప్రాంతం కావడంతో నీరు సరఫరా సక్రమంగా కావడం లేదు. -
మట్టి గుట్టలు మాయం!
[ 29-03-2024]
మండలంలోని వరద కాలువ మట్టిని కొందరు గుత్తేదార్లు, స్తిరాస్థి వ్యాపారులు అక్రమంగా తరలించుకుపోతుండటంతో మట్టికట్టలు మాయమవుతున్నాయి. -
నిధులు దూరం.. నిర్వహణ భారం
[ 29-03-2024]
వ్యవసాయ శాఖ సేవలను రైతులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో గత ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మించింది. శాఖాపరంగా రైతులకు ఆధునిక సాగు విధానంపై సలహాలు, సూచనలు ఇవ్వాలనేది ప్రధాన లక్ష్యం. -
లక్ష్యానికి చేరువగా సింగరేణి
[ 29-03-2024]
సింగరేణి సంస్థ తొలిసారిగా 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి చేరువ అవుతోంది. మూడేళ్లుగా ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సంస్థ ఇప్పటివరకు ఆ మేరకు బొగ్గు ఉత్పత్తిని చేరుకోలేకపోయింది. -
బయో మైనింగ్ ప్రక్రియకు అవాంతరాలు
[ 29-03-2024]
పెరుగుతున్న నగరీకరణ.. అందుకు అనుగుణంగా పారిశుద్ధ్య నిర్వహణ ప్రభుత్వ యంత్రాంగానికి సవాల్గా మారుతోంది. ఈ క్రమంలో చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేసేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
భాజపా పాలనపై ప్రజల్లో విసుగు
[ 29-03-2024]
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని భారాస ఎంపీ అభ్యర్థులు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్, కొప్పుల ఈశ్వర్లు అన్నారు. -
మతం పేరిట కేసీఆర్ రాజకీయం చేయలేదు: కేటీఆర్
[ 29-03-2024]
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో ఏ రోజు కూడా మతం పేరిట రాజకీయం చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
రాష్ట్రాన్ని దోచుకుంది భారాసనే: ఆది శ్రీనివాస్
[ 29-03-2024]
తెలంగాణ ఏర్పడిన తరవాత రూ.16 వేల కోట్ల నిల్వ బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పగిస్తే భారాస తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని రాబంధుల్లా దోచుకుందని, రూ.6.67 లక్షల కోట్ల అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్