అప్రమత్తంగా ఉంటేనే అగ్నిప్రమాదాల నివారణ
నిరంతరం అప్రమత్తంగా ఉంటేనే అగ్నిప్రమాదాలను నిలువరించడం సాధ్యమవుతుందని జిల్లా విపత్తుల నియంత్రణ అధికారి షేక్ ఖాజా కరీముల్లా పేర్కొన్నారు. అగ్నిమాపక శాఖ గోదావరిఖని డివిజన్ మూడు జిల్లాలకు విస్తరించింది.
న్యూస్టుడే, పెద్దపల్లి
నిరంతరం అప్రమత్తంగా ఉంటేనే అగ్నిప్రమాదాలను నిలువరించడం సాధ్యమవుతుందని జిల్లా విపత్తుల నియంత్రణ అధికారి షేక్ ఖాజా కరీముల్లా పేర్కొన్నారు. అగ్నిమాపక శాఖ గోదావరిఖని డివిజన్ మూడు జిల్లాలకు విస్తరించింది. పెద్దపల్లితో పాటు జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు ఈ డివిజన్ పరిధిలో ఉన్నాయి. విశాలమైన ఈ డివిజన్లో కేవలం ఐదు ఫైర్స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలోని మూడు స్టేషన్ల పరిధి ఎక్కువగా ఉండటం, ఇక్కడ పరిశ్రమలు, వాణిజ్యసంస్థలు విస్తరించడంతో భారీ ప్రమాదాలు జరిగిన సందర్భంలో ఇతర జిల్లాల నుంచి వాహనాలను పిలిపించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వేసవి నేపథ్యంలో అగ్నిప్రమాదాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అగ్నిమాపక అధికారి షేక్ ఖాజా కరీముల్లాతో ‘న్యూస్టుడే’ ముఖాముఖి.
జిల్లాలో ఎలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి?
గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వరికొయ్యలను కాల్చేయడం ద్వారా మంటలు క్రమంగా విస్తరించే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల గడ్డివాములు, ఊరి చివర ఉన్న ఇళ్లకు ప్రమాదం ఉంటుంది. విద్యుత్తు షార్ట్సర్క్యూట్లతో సైతం ప్రమాదాలు జరిగే అవకాశముంటుంది. వరి కొయ్యలను కాల్చివేయడం ద్వారా భూమిలోని సారం దెబ్బతింటుందని వ్యవసాయాధికారులు సైతం రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మా శాఖ తరఫున సైతం ప్రమాదాల గురించి వివరించేందుకు కార్యాచరణ చేపడతాం.
పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాల్లో భారీ ప్రమాదాలు జరిగిన సమయంలో నియంత్రణకు చర్యలు?
పరిశ్రమలు, వాణిజ్య ప్రాంతాల్లో తప్పనిసరిగా అగ్నిమాపక సాధనాలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రమాదాలు జరిగిన సమయంలో మంటల నియంత్రణకు అగ్నిమాపక యంత్రాలను వినియోగించే విధంగా ఆయా ప్రాంతాల్లో పనిచేసే వారికి శిక్షణ అందిస్తున్నాం. అగ్నిమాపక వాహనం వచ్చే సమయానికి మంటలు విస్తరించకుండా ఇలాంటి చర్యలు ఉపకరిస్తాయి. గత నెలలో అందుగుపల్లిలో టపాసుల గోదాములో జరిగిన అగ్నిప్రమాదంలో సమీపంలోని బియ్యం మిల్లుకు మంటు విస్తరించకుండా నియంత్రించేందుకు అక్కడ ఏర్పాటు చేసిన అగ్నిమాపక వ్యవస్థ ఉపయోగపడింది.
అగ్నిమాపక శాఖలో సిబ్బంది, ఇతర సమస్యలు?
జిల్లాలోని మూడు కేంద్రాల్లో వసతులు మెరుగ్గానే ఉన్నాయి. సిబ్బంది కొరత వెంటాడుతోంది. గోదావరిఖని డివిజన్ పరిధిలోని ఐదు స్టేషన్లలో 38 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మంథని, భూపాలపల్లిలో ఫైర్ అధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మంథనిలో రెండు, పెద్దపల్లి, గోదావరిఖనిలో ఒక్కో డ్రైవర్ పోస్టు ఖాళీగా ఉంది. గోదావరిఖనిలో 4, మంథని, పెద్దపల్లిలో 6 చొప్పున ఫైర్మెన్ పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.
ప్రశ్న: వేసవి నేపథ్యంలో అగ్నిప్రమాదాల నియంత్రణకు కార్యాచరణ?
జవాబు: జిల్లాలో అగ్నిప్రమాదాల నియంత్రణకు ముందస్తుగా అవగాహన కార్యక్రమాలు, ప్రచారం చేపడుతున్నాం. ప్రతి శుక్రవారం అగ్నిప్రమాదాలు జరగకుండా, జరిగితే తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరిస్తున్నాం. వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థల్లో ప్రమాదాలు జరిగితే ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలనే అంశంపైనే మాక్ ప్రాక్టీస్ చేస్తున్నాం. దీనివల్ల ప్రజలు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండేందుకు అవకాశం కలుగుతుంది.
వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్ల నిర్మాణంలో ఎలాంటి ప్రమాణాలు పాటించాలి?
వాణిజ్య సముదాయాలు 15 మీటర్లు, నివాస గృహాలు 18 మీటర్ల ఎత్తు కలిగి ఉంటేనే అగ్నిమాపక శాఖ పరిధిలోకి వస్తాయి. జిల్లాలో ఇలాంటి ఎత్తైన వాణిజ్య సముదాయాలు లేవు. అపార్ట్మెంట్ల నిర్మాణ సమయంలో తప్పనిసరిగా అగ్నిమాపక శాఖ నిర్దేశించిన ప్రమాణాలు పాటించే విధంగా పర్యవేక్షిస్తున్నాం. వాణిజ్య సముదాయాల్లో కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలపై వ్యాపారులు, అందులో పనిచేసే కార్మికులకు వివరిస్తున్నాం.
జిల్లాలో కొత్తగా అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయా?
ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో అగ్నిమాపక కేంద్రం పనిచేస్తుంది. పెరుగుతున్న ప్రమాదాల తీవ్రత నేపథ్యంలో ప్రతి మండలంలో ఒక్కో ఫైర్స్టేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలున్నాయి. జిల్లాలోని ఎలిగేడు, జూలపల్లి మండలాలు చొప్పదండి స్టేషన్ పరిధిలో ఉన్నాయి. పెద్దపల్లి పరిధిలోని ధర్మారం మండలం దూరంగా ఉండట సమస్యగా మారింది. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఎవరి చేతికి?.. మల్లగుల్లాలు పడుతున్న అధిష్ఠానం
[ 29-03-2024]
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారుపై ఆ పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది.. ఇప్పటికే భారాస, భాజపాల అభ్యర్థులు ఖరారవగా.. హస్తం పార్టీ తరఫున బరిలో నిలిచేదెవరో తెలియకపోవడంతో కాంగ్రెస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు అభ్యర్థి తేలేదెప్పుడు.. అని ఆందోళన చెందుతున్నారు. -
కనుల పండువగా శివయ్య కల్యాణం
[ 29-03-2024]
ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో గురువారం శివ కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. -
ఆందోళన వద్దు.. అవకాశాలు కోకొల్లలు!
[ 29-03-2024]
విద్యార్థులు ప్రాథమిక విద్య నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ పదో తరగతి పూర్తి చేశారు. ఒకట్రెండు రోజుల్లో పరీక్షలు కూడా పూర్తి చేసి ఉన్నతవిద్య వైపు అడుగులు వేయనున్నారు. -
అవసరాల మేరకు ఏదీ అనుసంధానం!
[ 29-03-2024]
ఈ రెండు అంశాల్లోనే కాదు. ప్రయాణికుల అవసరాలు తీర్చడంలో ద.మ.రై.అధికారులు ఆది నుంచీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. రైల్వే ఉద్యోగుల అవసరాలు, అధికారులు, నాయకులు లాబీయింగులతోనే కొత్త హాల్టింగులు, ఇతర వసతులు కల్పిస్తున్నారు. -
కరీంనగర్ బస్స్టేషన్ ఆస్తి పన్ను రూ.1.88 కోట్లు చెల్లింపు
[ 29-03-2024]
ఆస్తిపన్ను బకాయిలపై 90 శాతం రాయితీ గడువు మూడు రోజుల్లో ముగుస్తుందని నగరపాలక కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ తెలిపారు. -
భార్య చేతిలో భర్త హతం
[ 29-03-2024]
భర్త మద్యానికి బానిసై శారీరకంగా.. మానసికంగా వేధిస్తున్నాడని వేదనకు గురైన ఓ భార్య తనకు తెలిసిన ఇద్దరి సహాయంతో తాళ్లతో కట్టేసి.. కళ్లలో కారం చల్లి... ఒంటిపై వేడి నీళ్లు పోసి తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయి మృతి చెందాడు. -
లోక్సభ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పరీక్ష
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
వేసవి గట్టెక్కేనా!
[ 29-03-2024]
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ పట్టణాలకు డబ్బాలోని గ్రిడ్ ద్వారా మిషన్ భగీరథ పథకం నీరు సరఫరా అవుతోంది. ధర్మపురి పట్టణానికి డబ్బా నుంచి పైపులైన్లు వేసినా చివరి ప్రాంతం కావడంతో నీరు సరఫరా సక్రమంగా కావడం లేదు. -
మట్టి గుట్టలు మాయం!
[ 29-03-2024]
మండలంలోని వరద కాలువ మట్టిని కొందరు గుత్తేదార్లు, స్తిరాస్థి వ్యాపారులు అక్రమంగా తరలించుకుపోతుండటంతో మట్టికట్టలు మాయమవుతున్నాయి. -
నిధులు దూరం.. నిర్వహణ భారం
[ 29-03-2024]
వ్యవసాయ శాఖ సేవలను రైతులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో గత ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మించింది. శాఖాపరంగా రైతులకు ఆధునిక సాగు విధానంపై సలహాలు, సూచనలు ఇవ్వాలనేది ప్రధాన లక్ష్యం. -
లక్ష్యానికి చేరువగా సింగరేణి
[ 29-03-2024]
సింగరేణి సంస్థ తొలిసారిగా 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి చేరువ అవుతోంది. మూడేళ్లుగా ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సంస్థ ఇప్పటివరకు ఆ మేరకు బొగ్గు ఉత్పత్తిని చేరుకోలేకపోయింది. -
బయో మైనింగ్ ప్రక్రియకు అవాంతరాలు
[ 29-03-2024]
పెరుగుతున్న నగరీకరణ.. అందుకు అనుగుణంగా పారిశుద్ధ్య నిర్వహణ ప్రభుత్వ యంత్రాంగానికి సవాల్గా మారుతోంది. ఈ క్రమంలో చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేసేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
భాజపా పాలనపై ప్రజల్లో విసుగు
[ 29-03-2024]
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని భారాస ఎంపీ అభ్యర్థులు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్, కొప్పుల ఈశ్వర్లు అన్నారు. -
మతం పేరిట కేసీఆర్ రాజకీయం చేయలేదు: కేటీఆర్
[ 29-03-2024]
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో ఏ రోజు కూడా మతం పేరిట రాజకీయం చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
రాష్ట్రాన్ని దోచుకుంది భారాసనే: ఆది శ్రీనివాస్
[ 29-03-2024]
తెలంగాణ ఏర్పడిన తరవాత రూ.16 వేల కోట్ల నిల్వ బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పగిస్తే భారాస తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని రాబంధుల్లా దోచుకుందని, రూ.6.67 లక్షల కోట్ల అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..