ప్రగతి మెరిసింది.. పల్లె మురిసింది
తెలంగాణ ఆవిర్భావం తర్వాత జిల్లాల పునర్విభజనలో రాజన్న సిరిసిల్ల కొత్త జిల్లాగా ఏర్పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నారు.
జిల్లాలో 27 పంచాయతీలకు అవార్డులు
న్యూస్టుడే, వీర్నపల్లి
అడవిపదిర అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు
తెలంగాణ ఆవిర్భావం తర్వాత జిల్లాల పునర్విభజనలో రాజన్న సిరిసిల్ల కొత్త జిల్లాగా ఏర్పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులకు సంబంధించిన ర్యాంకింగ్లో తనదైన ముద్ర వేసుకుని దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్న జిల్లా ఇదే స్ఫూర్తితో దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల సాధనే లక్ష్యంగా పోటీ పడుతుంది. తొమ్మిది అంశాల్లో జిల్లా స్థాయిలో 27 పంచాయతీలు అవార్డులకు ఎంపికయ్యాయి.
వన్పల్లి పంచాయతీ కార్యాలయం
జిల్లాలో 13 మండలాల పరిధిలో 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే 2022 సంవత్సరానికి సంబంధించి కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల పేరిట జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. తొమ్మిది అంశాల్లో నిర్దేశించిన ప్రశ్నలు, అవసరమైన ధ్రువపత్రాలు జత చేసి అధికారులు దరఖాస్తులు సమర్పించారు. మండల స్థాయిలో ఎమ్పీడీవోలు, జిల్లా స్థాయిలో కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలోని కమిటీలు నామినేషన్లను పరిశీలిస్తాయి. ఇతర రాష్ట్రాల్లో గ్రామీణాభివృద్ధి శాఖలో పని చేస్తున్న క్షేత్ర పరిశీలన బృందం పరిశీలించి జాతీయ పంచాయతీ పురస్కారానికి ఎంపిక చేస్తారు. సంబంధిత శాఖ అధికారుల పరిశీలన తర్వాత మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన పల్లెలను ప్రశంసా పత్రాలతో సత్కరించనుంది. మండల స్థాయిలో పురోగతి సాధించిన పల్లెలకు ఈ నెల 24, 25 తేదీల్లో తొమ్మిది అంశాల్లో 27 అవార్డులు పంపిణీ చేసింది. కాగా జిల్లా స్థాయిలో ఆయా అంశాల్లో అవార్డులు దక్కించుకున్న పల్లెలకు నేడు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు. పంచాయతీల మధ్య స్నేహపూర్వక పోటీతత్వాన్ని పెంచడంతో పాటు 2030 నాటికి సుస్థిర ప్రగతి లక్ష్యాలను వేగవంతం చేయడమే ఈ జాతీయ పురస్కారాల లక్ష్యం. జాతీయ స్థాయిలో సత్తా చాటిన గ్రామాలకు ఏప్రిల్ 24న పంచాయతీరాజ్ దినోత్సవం నాడు పురస్కారాలు అందజేయనున్నారు. జిల్లాకు చెందిన గ్రామాలు జాబితాల్లో ఉండాలని జిల్లావాసులు ఆకాంక్షిస్తున్నారు.
గతంలో ఇలా...
జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చింది. అభివృద్ధే లక్ష్యంగా అన్ని పంచాయతీ పాలక వర్గాలు పని చేస్తున్నాయి. దీని ఫలితంగా జిల్లా ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్లో ఫోర్ స్టార్ ర్యాంకింగ్లో మొదటి స్థానంలో ఉంది. జిల్లాలోని పల్లెలకు గడిచిన ఎనిమిదేళ్లుగా 11 జాతీయ అవార్డులు వరించాయి. 2015లో చందుర్తి, 2016లో బాలమల్లుపల్లి, చందుర్తి, రామన్నపల్లి, 2017లో కస్బెకట్కూర్, గోపాలరావుపల్లి, 2018లో ముష్టిపల్లి, 2021లో మోహినికుంట, హరిదాస్నగర్, 2022లో మండెపల్లి, మద్దికుంటలు జాతీయ స్థాయిలో మెరిశాయి. ఈ ఏడాది సైతం జాతీయ స్థాయి అవార్డుల్లో జిల్లాలోని పంచాయతీలు పురస్కారాలు సాధిస్తాయని అధికారులు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు