సాన పడితే పంచ్ పడుద్ది
బాక్సింగ్ రింగులో పంచ్ పవర్ చూపించాలంటే ఎంతో ధైర్య సాహసాలు ఉండాలి. ప్రత్యర్థుల ముఖాన్ని లక్ష్యంగా చేసుకుని పిడిగుద్దుల వర్షం కురిపించి పాయింట్లు సాధించాలి.
నిఖత్, నీతు, స్వీటీ, లవ్లీనా స్ఫూర్తితో రాణిస్తాం
జిల్లా యువ బాక్సర్ల మనోగతం
న్యూస్టుడే, కరీంనగర్ క్రీడా విభాగం, కొత్తపల్లి
బాక్సింగ్ రింగులో పంచ్ పవర్ చూపించాలంటే ఎంతో ధైర్య సాహసాలు ఉండాలి. ప్రత్యర్థుల ముఖాన్ని లక్ష్యంగా చేసుకుని పిడిగుద్దుల వర్షం కురిపించి పాయింట్లు సాధించాలి. ఈ ఆటలో రాటుదేలాలంటే ఆత్మస్థైర్యం అవసరం. అలా ఉన్నవారే ఇటు వైపు వస్తారు. జిల్లాలో సుమారు 50 మంది యువకులు, 10 మంది యువతులు ఈ ఆటలో సాధన చేస్తున్నారు. శని, ఆదివారాల్లో మహిళా నిఖత్ జరీన్, నీతు గాంగాస్, స్వీటీ బూర, లవ్లీనా మహిళా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్లుగా నిలిచారు. వీరిని ఆదర్శంగా తీసుకొని ప్రత్యర్థులను మట్టి కరిపిస్తామని జిల్లా యువ బాక్సర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.
సౌకర్యాలు కల్పిస్తే...
కరీంనగర్ జిల్లాలోని అంబేడ్కర్ స్టేడియంలో బాక్సింగ్ సాధన చేసేందుకు కనీసం రింగు కూడా లేదంటే దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. సుమారు 60 మంది కోచ్ లేకుండానే సాధన చేస్తూ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. క్రీడా శాఖ కోచ్ను ఏర్పాటు చేసి అంబేడ్కర్ స్టేడియంలో రింగును ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తే మట్టిలో మాణిక్యాలను వెలికి తీయవచ్చు. క్రీడా శాఖ గ్లౌజులు, కిట్ బ్యాగులు అందించాలని బాక్సర్లు కోరుకుంటున్నారు. గతేడాది కరీంనగర్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన వేసవి ఉచిత శిక్షణ శిబిరంలో 90 మంది చిన్నారులు శిక్షణ పొందారంటే ఆ ఆటపై మక్కువ ఉందని అర్థమవుతుంది.
గతేడాది నుంచి సాధన..
- హరిణి శ్రీ, 6వ తరగతి, ఎలగందల్ మోడల్ స్కూల్
నాకు బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే గతేడాది వేసవి శిబిరంలో శిక్షణ తీసుకొని అప్పటి నుంచి సాధన చేస్తున్నాను. పంచులు, బాక్సింగ్ మెలకువలు నేర్చుకున్నాను. ప్రస్తుతం సంపత్కుమార్, పృథ్వీరాజ్ వద్ద మెలకువలు నేర్చుకుంటున్నా. బాక్సింగ్లో నిఖత్ జరీన్, నీతు, స్వీటీలా ప్రపంచ ఛాంపియన్ కావాలని ఉంది.
రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నా..
- కె.భార్గవి, డిగ్రీ, తృతీయ సంవత్సరం
నిఖత్ జరీన్ రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ సాధించడం సంతోషంగా ఉంది. ఆమెను ఆదర్శంగా తీసుకొని సాధన చేస్తున్నాను. హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర ఎస్జీఎఫ్ క్రీడల్లో, పెద్దపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో పాల్గొన్నాను. మన దేశానికి బంగారు పతకాలు తీసుకురావాలనేది నా ముందున్న లక్ష్యం.
ప్రోత్సాహం అవసరం
- కె.సంపత్ కుమార్, కరీంనగర్ ఉమ్మడి జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి
తెలంగాణకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్గా నిలవడం చాలా సంతోషం. ఆమె స్ఫూర్తితో గతేడాది 90 మంది పిల్లలు శిక్షణ పొందారు. మన వద్ద పిల్లల్లోనూ ప్రతిభ దాగి ఉంది. వారికి మంచి తర్ఫీదు ఇచ్చి.. ప్రోత్సహిస్తే మంచి ఆటగాళ్లను తయారు చేయవచ్చు. కరీంనగర్ నగరంలో రింగు ఏర్పాటు చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం
[ 18-04-2024]
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణోత్సవాన్ని ఆలయ వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
నేటి నుంచి నామినేషన్లు షురూ!
[ 18-04-2024]
ఎన్నికల సమరంలో అసలైన ఘట్టం గురువారం నుంచి మొదలవనుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ నెల రోజుల కిందటే వెలువడినప్పటికీ నేడు వెలువడే అధికారిక నోటిఫికేషన్తో అసలు అంకం షురూ అవనుంది. -
ప్రచార పర్వానికి కాంగ్రెస్ సిద్ధం!
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి గురువారం నామపత్రాల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమవుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లోక్సభ స్థానం పరిధిలో ప్రచార కసరత్తు ప్రారంభించింది. -
కొప్పుల మొదటిసారి.. జీవన్ మూడోసారి
[ 18-04-2024]
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో వేర్వేరు పార్టీలు, వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న తాటిపర్తి జీవన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్లకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా గెలుపొందిన జీవన్రెడ్డి స్వగ్రామం పెగడపల్లి మండలం బతికెపల్లి. -
క్లిక్ దూరంలో సమగ్ర సమాచారం
[ 18-04-2024]
ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వెబ్సైట్ రూపొందించింది. ceotelangana.nic.in లో ఓటరు నమోదుతో పాటు సవరణలు, తొలగింపులు తదితర అంశాలుంటాయి. -
రెండు సార్లు ఎంపీ.. సాధారణ జీవనం
[ 18-04-2024]
వరుసగా రెండు సార్లు ఎంపీగా ఎన్నికైనా చివరి శ్వాస వరకు పల్లెటూరులోనే సాధారణ జీవితం గడిపారు జువ్వాడి రమాపతిరావు. 1916లో గన్నేరువరంలో జన్మించిన ఆయన వివాహం అనంతరం అత్తగారి ఊరైన గంగాధర మండలం సర్వారెడ్డిపల్లికి వచ్చి స్థిరపడ్డారు. -
ఎన్నికల పరిశీలకులొస్తున్నారు
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెంచింది. -
హాట్రిక్ విజేత..అరుదైన ఘనత
[ 18-04-2024]
ఉమ్మడి జిల్లాలో నలుగురు నేతలు వరుసగా మూడు సార్లు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ రికార్డు సొంతం చేసుకున్నారు. కరీంనగర్ నుంచి ముగ్గురు, పెద్దపల్లి నుంచి ఒకరు గెలుపొంది రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు. -
అక్కడ స్థానికేతరులే అధికం
[ 18-04-2024]
1962లో ఆవిర్భవించిన పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు ఒక్కసారి మినహా అన్ని ఎన్నికల్లో స్థానికేతరులే గెలుపొందారు. 1980లో 7వ లోక్సభ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన కోదాటి రాజలింగం మాత్రమే స్థానికుడు. -
వసతుల మెరుగుకు కార్యాచరణ
[ 18-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం నగరపాలికల్లో కనీస మౌలిక వసతులు మెరుగుపర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రధానంగా తాగునీరు, భూగర్భ మురుగునీటి వ్యవస్థను బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటారు. -
ఆదాయంలో జమ్మికుంట మార్కెట్ టాప్
[ 18-04-2024]
పంటలకు పెరిగిన మద్దతు ధర, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పాత బకాయిలు జమకావటం, చెక్పోస్టులు, గిడ్డంగుల అద్దెలు, లైసెన్సులు, మార్కెట్లకు వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాల ద్వారా లభించే ఆదాయంతో ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల వ్యవసాయ మార్కెట్ మినహా కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లు మార్కెటింగ్ శాఖ నిర్ణయించిన ఆర్థిక ఆదాయ లక్ష్యాన్ని అధిగమించాయి. -
ఓటరు దరఖాస్తులకు త్వరితగతిన పరిష్కారం
[ 18-04-2024]
నామినేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సూచించారు. బుధవారం ఆయన నిర్వహించిన పెద్దపల్లి నుంచి కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, శ్యామ్ప్రసాద్లాల్లు పాల్గొన్నారు. -
మిల్లుల్లోనే బియ్యం.. ధాన్యానికేదీ స్థలం?
[ 18-04-2024]
గత వానాకాలం సీజన్కు సంబంధించిన బియ్యానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో మిల్లుల్లోనే నిల్వలు పేరుకుపోయాయి. గత సీజన్కు సంబంధించిన సీఎంఆర్ లక్ష్యాలను మిల్లర్లు పూర్తి చేయాలనే గడువును జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పొడిగిస్తున్నారు.