KTR: బండి సంజయ్, రేవంత్ ఒక్కసారైనా పరీక్ష రాశారా?: కేటీఆర్
దేశంలో సరిపడా బొగ్గు దొరికినా, విదేశాల నుంచే దిగుమతి చేసుకునేందుకు మోదీ ప్రభుత్వం మొగ్గు చూపుతోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. సిరిసిల్లలో నిర్వహించిన పార్టీ ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
సిరిసిల్ల: విద్యా వ్యవస్థలో సిరిసిల్ల జిల్లా ముందుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ ఏడాది సిరిసిల్లకు వైద్య కళాశాల, ఇంజినీరింగ్, నర్సింగ్ కళాశాల తీసుకొచ్చామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క వైద్య కళాశాలగానీ, నవోదయ కళాశాలగానీ ఇవ్వలేదని విమర్శించారు. సిరిసిల్లలో భారాస పార్టీ ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కేంద్రం తీరుపై విమర్శలు గుప్పించారు. నాలుగేళ్లలో కేంద్రం ఏం సాధించిందో బండి సంజయ్ను ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
‘‘శ్రీకాంతాచారి బలిదానం గురించి తెలియనివారు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఏపీ, తెలంగాణ వేరుపడటంపై తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని ప్రధాని పార్లమెంట్లో అన్నారు. తెలంగాణ పుట్టుకనే అవమానించారు. గుజరాతీల చెప్పులు మోసేవారు మన రాష్ట్రంలో పుట్టడం దురదృష్టం. దేశంలో సరిపడా బొగ్గు దొరికినా, విదేశాల నుంచే దిగుమతి చేసుకునేందుకు మోదీ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. తద్వారా అదానీ లాంటి వ్యాపారవేత్తలకు లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటోంది’’ అని కేటీఆర్ విమర్శించారు. బొగ్గు దిగుమతి ధర పెరిగితే దానికి అనుగుణంగా విద్యుత్ ఛార్జీలు కూడా పెరిగి ప్రజలపై భారం పడుతుందని అన్నారు. పీక్ అవర్లో విద్యుత్ ఛార్జీలు 20శాతం పెంచాలని కేంద్రం ప్రతిపాదించడం దారుణమని కేటీఆర్ విమర్శించారు.
తెలంగాణ సాధన గొప్ప అనుభవం
‘‘పార్టీ లేకపోతే మాకు పదవుల్లేవు. గుర్తింపు లేదు.. ఎన్నికలున్నా లేకున్నా నాకు పార్టీయే ముఖ్యం. అన్నం తిన్నమో.. అటుకులు బుక్కినమో.. తెలంగాణ సాధించడం మాకు గొప్ప అనుభవం. ప్రతి నియోజకవర్గానికి 100 దళితబంధు యూనిట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 38,000 యూనిట్లు మంజూరు చేశాం. దళిత బంధుతో కార్లు కొనడం దుకాణాలు కొనడం కాదు. పదిరలో ప్రభుత్వం రూ.30 లక్షలు ఇస్తే రూ.3కోట్లతో మిల్లు పెట్టడం ఎంతో ఆనందంగా ఉంది. ఇందులో 12 మంది బిహార్ నుంచి వచ్చిన వాళ్లు పని చేస్తుంటే ఎంతో తృప్తిగా ఉంది. దళితబంధులో భాగంగా 9మంది కలిసి పెట్రోల్ బంకు పెట్టడానికి సిద్ధమౌతున్నారని తెలిసింది. ఇది మరిచిపోలేని అనుభూతి. ఉమ్మడి ఏపీలో ఉత్తమ గ్రామ పంచాయతీలంటే గంగిదేవిపల్లి, అంకాపూర్ మాత్రమే ఉండేవి. కానీ, ఇప్పుడు 20 ఉత్తమ గ్రామపంచాయతీలను గుర్తిస్తే.. అందులో 19 తెలంగాణకు రావడం గర్వకారణం’’ అని కేటీఆర్ అన్నారు.
రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతోందని కేటీఆర్ అన్నారు. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి ఈ ఏడేళ్లలో జరిగిందో లేదో ప్రజలే చెప్పాలన్నారు. ‘‘ఆత్మీయ సమ్మేళనాల్లో ఫీడ్ బ్యాక్ తీసుకొని మేనిఫెస్టో రూపొందించాలని కేసీఆర్ ఆదేశించారు. వచ్చే నెల 27లోగా ఆ పని చేద్దాం. ప్రతి 10 గ్రామాలకు ఒక యూనిట్ తీసుకుందాం. జిల్లాలో లక్షా 72వేల మంది సభ్యత్వాలు ఉన్నాయి. వారందన్నీ తట్టి లేపుదాం. గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన తీరును వాళ్లకు గుర్తు చేయాలి. దశాబ్దాలపాటు పాలించిన పార్టీలు ఏం చేశాయి? మనం ఏం చేశామో ప్రజలకు చెప్పాలి’’ అని కేటీఆర్ అన్నారు. ఆసరా పింఛన్లలో వచ్చిన తేడా.. కల్యాణలక్ష్మి గురించి చర్చించాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులకు హెక్టారుకు రూ.25వేల పరిహారం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు కదా.. దేశంలో ఈ స్థాయిలో ఇచ్చిన సీఎం ఎవరైనా ఉన్నారేమో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
అదానీకి మోదీ బ్రోకర్ అని చెప్పొచ్చు కానీ,
‘‘ పేపర్ లీకేజీ కేసులో సీఎం బ్రోకర్ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అదానీకి మోదీ బ్రోకర్ అని నేనూ చెప్పొచ్చు. కానీ, చెప్పను. బండి సంజయ్, రేవంత్ రెడ్డి జీవితంలో ఒక్కసారైనా పరీక్షలు రాశారా? నిజామాబాద్ ఎంపీ అర్వింద్ నకిలీ సర్టిఫికెట్లు పెట్టి దొరికిపోలేదా? రేవంత్రెడ్డి ఇప్పుడు నా పీఏ తిరుపతి వెంటపడ్డారు. గత 15 ఏళ్లుగా తిరుపతి నా పీఏగా ఉంటున్నారు. నా పీఏ ప్రశ్నాపత్రాలు అమ్ముకుంటున్నట్లు ఆరోపిస్తున్నారు. మల్యాలలో 415 మంది పరీక్ష రాస్తే 35 మంది పాసయ్యారు. తిరుపతి సొంతూరులో ముగ్గురు పరీక్ష రాస్తే ఒక్కరు కూడా పాస్ కాలేదు. సిరిసిల్ల జిల్లాలో 3,250 మంది గ్రూప్-1 పరీక్ష రాశారు. అందులో 255 మందికి 25 నుంచి 90 మార్కులు వచ్చాయి. ఒక్కరికి కూడా 100 మార్కులు రాలేదు.’’ అని కేటీఆర్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలీవుడ్, హాలీవుడ్ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. -
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బుస అనులేఖ
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బుస అనులేఖ నియమితులయ్యారు. -
ఎంపీగా లేకున్నా.. మీ బిడ్డగా సేవ చేస్తా
‘‘ఎంపీగా నా పదవీకాలం ముగిసినా.. మీతో నా అనుబంధం చివరిశ్వాస వరకు కొనసాగుతుంది. పీలీభీత్ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తా. -
వివేకా హంతకులు మీ పక్కనే ఉన్నారని అందరికీ తెలుసు: వర్ల రామయ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకాపై గొడ్డలి వేటు వేయించింది వైకాపా ఎంపీ అవినాష్రెడ్డి కాదా అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. -
సీఎం బొమ్మలు ఉంచాల్సిందేనంటున్న ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోండి
పాస్ పుస్తకాలు, భూమి పత్రాలు, ల్యాండ్ పార్సిల్ మ్యాపులు ఇతర డాక్యుమెంట్లపై సీఎం జగన్ బొమ్మలు ఉంచాల్సిందేనని, నవరత్నాల లోగోను తొలగించవద్దని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కోరారు. -
కాళేశ్వరం, కేసీఆర్పై ఈ ప్రభుత్వానికి కడుపు మంట
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
భారాసకు భారీ షాక్
లోక్సభ ఎన్నికల వేళ భారాసకు షాక్ మీద షాక్ తగులుతోంది. సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతుండగా.. తాజాగా భారాస వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. -
సంక్షిప్త వార్తలు
ఎన్డీయే తీరుపై భాగస్వామ్య పక్ష నేత, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అఠావలె అసంతృప్తి వ్యక్తం చేశారు. -
6న జైపుర్లో కాంగ్రెస్ మేనిఫెస్టో
లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోను వచ్చే నెల 6వ తేదీన రాజస్థాన్ రాజధాని జైపుర్లో విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ నేత సుఖ్జీందర్ సింగ్ రణధావా తెలిపారు. -
జగన్పై ఒంటరిగానే నా పోరాటం
‘ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్లో ఉన్న సీబీఐ కోర్టును 3 వేల వాయిదాలు కోరారు. -
ఎమ్మెల్యే కాటసాని సోదరుడు చంద్రశేఖరరెడ్డితో తెదేపా మంతనాలు
నంద్యాల జిల్లా బనగానపల్లిలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖరరెడ్డితో గురువారం రాత్రి తెదేపా నేతలు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బీసీ జనార్దన్రెడ్డి మంతనాలు సాగించారు. -
‘సంగం’పై ఆర్వో ఎలా స్పందిస్తారు: ధూళిపాళ్ల
కంపెనీ చట్టంలో ఉన్న సంగం డెయిరీపై వైకాపా నాయకుడు ఫిర్యాదు చేస్తే ఎలా స్పందిస్తారని గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వోను మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రశ్నించారు. -
గుంటూరు మిర్చియార్డులో వైకాపా అభ్యర్థుల ప్రచారం
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వైకాపా గుంటూరు లోక్సభ అభ్యర్థి, పలు శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థులు ఈ నెల 22న గుంటూరు మిర్చియార్డులో ప్రచారం నిర్వహించారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనాకు యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. -
వైకాపా సభ్యత్వానికి తిరుపతి కార్పొరేటర్ల రాజీనామా
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తిరుపతిలో వైకాపా అసంతృప్త నేతలు బయటపడుతున్నారు. -
వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన!
రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను వచ్చే నెల మొదటి వారంలో ప్రకటించే అవకాశాలున్నాయి. -
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
శివసేన (శిందే)లో చేరిన నటుడు గోవిందా
సార్వత్రిక ఎన్నికల ముందు బాలీవుడ్ నటుడు గోవిందా (60) మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. గురువారం ఆయన శివసేన (శిందే వర్గం) పార్టీలో చేరారు. -
కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కమిటీ
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు రాష్ట్ర పార్టీ ‘తెలంగాణ ప్రజల ముంగిట్లోకి జాతీయ మ్యానిఫెస్టో’ కమిటీని ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్