logo

గంజాయి తాగుతున్న అయిదుగురి అరెస్టు

గంజాయి తాగుతున్న వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు మంథని ఎస్సై వెంకటేశ్వర్లు చెప్పారు. ఆయన కథనం ప్రకారం..

Published : 28 Mar 2023 04:51 IST

మంథని గ్రామీణం, న్యూస్‌టుడే : గంజాయి తాగుతున్న వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు మంథని ఎస్సై వెంకటేశ్వర్లు చెప్పారు. ఆయన కథనం ప్రకారం.. పట్టణంలోని శ్రీపాద కాలనీ పరిసరాల్లో కొంతమంది వ్యక్తులు చర్చి వెనుకాల అనుమానాస్పదంగా కనబడటంతో పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసులు వారి వద్దకు వెళ్లి విచారించారు. అందులో బోగె డేవిడ్‌రాజ్‌ అనే వ్యక్తి వద్ద గంజాయి లభించింది. అతను భద్రాచలం నుంచి కొనుగోలు చేసి తెచ్చి నలుగురికి విక్రయించినట్లు తేలింది. వారందరూ అక్కడే గంజాయి తాగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. భోగె డేవిడ్‌ రాజ్‌, అర్ధం రాజు, బెజ్జంకి ప్రకాశ్‌, గుంపుల నితీష్‌, కావిరి అరుణ్‌ల వద్ద 440 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని, అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని