అంగన్వాడీ టీచర్ దుర్మరణం
రహదారిపై గేదె కళేబరాన్ని ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలోని మేడిపల్లి గ్రామశివారులో చోటుచేసుకుంది.
గేదె కళేబరాన్ని ఢీకొన్న ద్విచక్రవాహనం
కుమారుడికి గాయాలు
వసుంధర
ఇబ్రహీంపట్నం, న్యూస్టుడే: రహదారిపై గేదె కళేబరాన్ని ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలోని మేడిపల్లి గ్రామశివారులో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్పల్లి మండలం సత్తక్కపల్లి గ్రామానికి చెందిన కొడిమ్యాల వసుంధర(49) అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం దిల్లీలో 28న జరగనున్న నిరసన కార్యక్రమానికి సోమవారం వేకువజామున తన పెద్ద కుమారుడు తేజతో కలిసి ద్విచక్ర వాహనంపై మెట్పల్లికి బయలుదేరారు. మేడిపల్లి గ్రామశివారులోని జాతీయ రహదారిపై మృతిచెందిన గేదె కళేబరం చీకట్లో గమనించక దాన్ని ఢీకొని అదుపు తప్పి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలై ఘటన స్థలంలోనే వసుంధర మృతి చెందగా తేజకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి భర్త, ముగ్గురు కుమారులు ఉన్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
CM KCR: ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భం: సీఎం కేసీఆర్
-
India News
Gulf countries: ఇకపై తక్కువ ఖర్చుతో గల్ఫ్ ప్రయాణం!
-
Politics News
హెడ్లైన్స్ కోసమే నీతీశ్ అలా చేస్తున్నారు.. విపక్షాల ఐక్యత కుదిరే పనేనా?: సుశీల్ మోదీ
-
Sports News
MS Dhoni: ధోని మోకాలి శస్త్రచికిత్స విజయవంతం
-
India News
Gold Smuggling: ఆపరేషన్ గోల్డ్.. నడి సంద్రంలో 32 కేజీల బంగారం సీజ్
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు