యార్డు వెలుపల కాయల సేకరణ వద్దు
జగిత్యాల వ్యవసాయ మార్కెట్యార్డు ఆధ్వర్యంలోని చల్గల్లోని మామిడి మండీ పరిధిలో ఈ సీజనులో పలువురు వ్యాపారులు మామిడి కాయల కొనుగోలును యార్డు వెలుపలగల షెడ్లలో ప్రారంభించారు.
తప్పనిసరిగా మండీలోనే జరపాలంటున్న అధికారులు
న్యూస్టుడే, జగిత్యాల ధరూర్క్యాంపు
యార్డువెలుపల షెడ్లలో పనులు చేసుకుంటున్న దృశ్యం
జగిత్యాల వ్యవసాయ మార్కెట్యార్డు ఆధ్వర్యంలోని చల్గల్లోని మామిడి మండీ పరిధిలో ఈ సీజనులో పలువురు వ్యాపారులు మామిడి కాయల కొనుగోలును యార్డు వెలుపలగల షెడ్లలో ప్రారంభించారు. మామిడి మార్కెట్లో రూ.6 కోట్ల వ్యయంతో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన నాలుగు భారీ షెడ్లు అందుబాటులోకి రావటం, చల్గల్ వాలంతరి ప్రదర్శన క్షేత్రం నుంచి తీసుకున్న అదనపు 10 ఎకరాల స్థలంలోనూ మామిడి కాయల క్రయవిక్రయాలను చేపట్టనుండటంతో ఈ సీజనులో వ్యాపారులందరూ యార్డులోకి రావాల్సిందేనని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గతంలో మాదిరిగా యార్డు వెలుపల తమ సొంత స్థలాలు, ప్రైవేటు అద్దెస్థలాల్లో కొనుగోళ్లు జరపవద్దని, వ్యాపారులందరూ తప్పనిసరిగా యార్డులోనే ఏర్పాట్లు చేసుకోవాలని మార్కెటింగ్ అధికారులు ఉత్తర్వులు, వ్యాపారులకు నోటీసులు జారీచేశారు. ఇందుకు అనుగుణంగా గత సీజన్లో మార్కెట్ఫీజు చెల్లించిన వ్యాపారులకు వరుసక్రమంలో మార్కెట్లోని షెడ్లలో స్థలాన్ని కేటాయించాలని నిర్ణయించారు.
యార్డులో నిర్మించిన షెడ్డు
ఇప్పటికే ప్రైవేటు స్థలాల్లో కాయల కొనుగోలును ప్రారంభించగా మరికొందరుకూడా సొంత స్థలాల్లోనే కొనుగోలుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల-నిజామాబాద్ జాతీయ రహదారి వెంబడి ప్రైవేటు షెడ్లుండటం, గతంలో రహదారి ప్రమాదాలు జరిగి కొందరు కార్మికులు మృత్యువాత పడటంతో తప్పనిసరిగా వ్యాపారులందరూ మండీలోకే రావాలని నిర్దేశించారు. సీజన్లో దాదాపుగా 5 వేలమంది వరకు కార్మికులు వివిధ రాష్ట్రాల నుంచి కాయల గ్రేడింగ్, ప్యాకింగ్, లోడింగ్ తదితరాలకు వస్తారు, వీరంతా యార్డులోనే బసచేస్తారు. కాయల తరలింపునకు వేలాది వాహనాలు వస్తాయి కాబట్టి ఈ వాహనాలన్నీ రోడ్డుపక్కనే రోజుల తరబడి పార్కింగ్ చేయటంతో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. మరోవైపు ప్రైవేటు స్థలాల్లో కొనుగోళ్లు జరిపితే మార్కెటింగ్ అధికారుల ఆజమాయిషీ కొరవడుతుంది, మార్కెట్ ఫీజు తగ్గుతుంది. తూకం, ధరల నిర్ణయం రైతులకు చెల్లింపు తదితరాల్లోనూ ఇబ్బందులు తలెత్తుతాయి. మరోవైపు కమీషన్ లైసెన్స్గల వ్యాపారులు కాబట్టి ఈ సీజన్నుంచి బహిరంగ వేలం పద్ధతిన కాయలను కొనాలని యోచిస్తుండటంతో అందరూ యార్డులోకి వస్తేనే వేలం సాధ్యపడుతుంది. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లో కాయల కొనుగోళ్లు పెరిగే అవకాశమున్నందున మామిడి మండీలోనే మామిడి కాయల లావాదేవీలు జరిపేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. దీనిపై మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ వ్యాపారులతో మాట్లాడి జిల్లా కలెక్టర్ ఆదేశాలను అమలు చేస్తామని వివరించారు.
యార్డులోకి రావాలని అధికారుల ప్రకటన
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?