logo

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్‌ పరీక్షలు

జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం ద్వితీయ సంవత్సరం ముగియగా 199 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

Published : 30 Mar 2023 06:23 IST

విద్యార్థుల కేరింత

జగిత్యాల, న్యూస్‌టుడే: జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం ద్వితీయ సంవత్సరం ముగియగా 199 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 7127 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 6928 మంది (97.2 శాతం) పరీక్షకు హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగియడంతో విద్యార్థులు సంతోషంతో ఇళ్లకు పయనమయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఆనందంతో సహచర విద్యార్థులు వీడ్కోలు పలికారు. ఒకేషనల్‌ విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు పరీక్షలు ఈనెల 31, ఏప్రిల్‌ 4న జరుగుతాయని జిల్లా పరీక్షల కన్వీనర్‌ బి.నారాయణ తెలిపారు. ఇందుకోసం 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని