logo

అభివృద్ధిని ఇంటింటికి ప్రచారం చేయాలి

రాష్ట్రంలో, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని కార్యకర్తలు ఇంటింటికి వివరించాలని భారాస జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు.

Published : 30 Mar 2023 07:07 IST

 

మాట్లాడుతున్న ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు

మెట్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని కార్యకర్తలు ఇంటింటికి వివరించాలని భారాస జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. మెట్‌పల్లి మండలం వెల్లుల్ల శివారులోని వీఆర్‌ఎం గార్డెన్స్‌లో భారాస మండల కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. భారాస నాయకులు సంజయ్‌ మాట్లాడుతూ ఉనికి కోసం కాంగ్రెస్‌ ఆరాటపడితే, మతం పేరుతో భాజపా చౌకబారు రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుంటే కాంగ్రెస్‌, భాజపా నాయకులు అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని, కార్యకర్తలు వీటిని తిప్పికొట్టాలన్నారు. ఎంపీపీ మారు సాయిరెడ్డి, భారాస మండలాధ్యక్షుడు నల్ల తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గడ్డం రాజరెడ్డి, వైస్‌ఎంపీపీ రాజేందర్‌గౌడ్‌, భారాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని