సౌకర్యాలపై శీతకన్ను
జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం నిత్యం అనేక మంది వస్తుంటారు. వీరి ద్వారా ఆర్టీఏకు లక్షలాది రూపాయల ఆదాయం వస్తుంది.
రవాణా శాఖ కార్యాలయంలో సమస్యలు
న్యూస్టుడే, కరీంనగర్ రవాణా విభాగం
జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం నిత్యం అనేక మంది వస్తుంటారు. వీరి ద్వారా ఆర్టీఏకు లక్షలాది రూపాయల ఆదాయం వస్తుంది. అలాంటి చోట సరైన సౌకర్యాలు లేక వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత సమస్యలపై ‘న్యూస్టుడే’ కథనం.
చెట్ల నీడే ఆధారం..
ఇక్కడకు వచ్చే వాహనదారులు సమస్యలతో సతమతమవుతున్నారు. గదులు లేక చెట్ల కింద ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నారు. ఆ ప్రాంతంలో తాగునీటి సౌకర్యం కూడా కల్పించడం లేదని వాహనదారులు అంటున్నారు. దాహం వేస్తే కార్యాలయంలోకిగానీ రోడ్డుమీదకు గానీ వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉండే ఎంవీఐ, ఏఎంవీఐ, ఇతర సిబ్బంది కూడా చెట్ల కింది నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఆర్టీఏ ఆవరణలో ఏర్పాటు చేసిన శీతల జలయంత్రం కూడా నిరుపయోగం ఉంటుంది.
వాహనదారుల ఇబ్బందులు
కార్యాలయం ఆవరణలో మూత్రశాలలు లేక అక్కడికి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళల పరిస్థితి చెప్పనవసరంలేదు. చోదక పరీక్ష కోసం సిద్ధం చేసిన ట్రాక్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి ట్రాక్ పైనే తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో పరీక్షించడం ఎలా సాధ్యమవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం
శాశ్వతంగా ఏర్పాటు చేసే ట్రాకు సంబంధించి కొంతవరకు నిధులు అవసరమవుతాయి. దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. కార్యాలయ ఆవరణలో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశాం. శౌచాలయాలపై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
అశోక్, ఏవో, రవాణాశాఖ కార్యాలయం, కరీంనగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూసేకరణలో జాప్యం
[ 28-03-2024]
భూసేకరణలో జాప్యమే జాతీయ రహదారుల విస్తరణకు శాపంగా మారుతోంది. జిల్లాలో ప్రధానంగా జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిగా మార్చి దశాబ్దం కావస్తున్నా.. నిర్మాణం మొదలు కావటం లేదు -
నత్తనడకన నిర్మాణాలు
[ 28-03-2024]
వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం పల్లెదవాఖానాలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర(సబ్సెంటర్ల)ను పల్లె దవాఖానాలుగా మార్చారు -
నిధులు వెచ్చించి.. పనులు వదిలేసి
[ 28-03-2024]
పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఆధునిక సాంకేతికను జోడించి పెద్ద నగరాలకు దీటుగా పోటీ పడేందుకు ప్రణాళికలు చేసిన నగరపాలిక.. ఆ విధానం అమలులో వెనుకబడింది -
తాగునీటి వృథా వద్దు : కలెక్టర్
[ 28-03-2024]
అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
కాంగ్రెస్ నిజామాబాద్ లోక్సభ స్థానం టికెట్ జీవన్రెడ్డికే దక్కింది. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది -
తొలిమెట్టు నోడల్ అధికారులకు భత్యం
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రత్యేక బోధన పద్ధతులతో కొనసాగుతున్న ఈ కార్యక్రమ పర్యవేక్షణకు మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 28-03-2024]
వాతావరణ సమాచారాన్ని ప్రతిఒక్కరి దైనందిన కార్యకలాపాల్లో భాగం చేయాలనే ఉద్దేశంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇటీవల ‘పంచాయత్ మౌసం సేవా’ మొబైల్ యాప్ విడుదల చేసింది. -
పఠనాలయం సద్వినియోగం... కల సాకారం
[ 28-03-2024]
గ్రంథాలయ పుస్తకాలతోనే ఏకకాలంలో రెండు ఉద్యోగాలు సాధించగలిగాను. తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ నిర్వహించిన ఫలితాల్లో పీజీటీ సాంఘికశాస్త్రం, జూనియర్ కళాశాలలో పౌరశాస్త్రం లెక్చరర్గా ఉద్యోగాలకు ఎంపికయ్యాను -
పంచాయతీల ఖజానా ఖాళీ
[ 28-03-2024]
ఓవైపు ఖజానా ఖాళీ, మరోవైపు సమస్యలు పంచాయతీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జమయ్యే నిధులకు మించిన వ్యయం చేయడంతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఓటు నమోదుకు ప్రత్యేక సాధారణ సెలవు
[ 28-03-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!