చిన్న తప్పిదం లేకుండా పది పరీక్షల నిర్వహణ
జిల్లాలో వచ్చే నెల 3 నుంచి 13 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
సిరిసిల్ల (విద్యానగర్), న్యూస్టుడే: జిల్లాలో వచ్చే నెల 3 నుంచి 13 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో పది పరీక్షల నిర్వహణ, మౌలిక వసతుల కల్పనపై బుధవారం విద్యాశాఖ అధికారులు, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్, సిట్టింగ్ స్క్వాడ్, ఎంఈవోలతో సమీక్ష ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలు ఏ చిన్న తప్పిదం లేకుండా ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేలా చూడాలన్నారు. జిల్లాలో 3,400 మంది బాలురు, 3,096 మంది బాలికలు మొత్తం 6,496 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. జిల్లాలో 36 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఏప్రిల్లో నిర్వహించే పది తరగతి పరీక్షల్లో 11 పేపర్లకు బదులు 6 పేపర్లే ఉంటాయని తెలిపారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు విద్యార్థులకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. వేసవి దృష్ట్యా అన్ని కేంద్రాల్లో నిరంతర విద్యుత్తు, తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఫ్యాన్లు పని చేసేలా చూడాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలోని చీఫ్ సూపరింటెండెంట్దే కీలక బాధ్యత అని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని పేర్కొన్నారు. విధులు కేటాయించిన ఉద్యోగులు, సిబ్బంది సమయపాలన, నిబంధనలు తప్పక పాటించాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించొద్దని, బయటి వ్యక్తులు రాకుండా చూడాలన్నారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరపాలన్నారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించాలని చెప్పారు. కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయించాలని సూచించారు. ప్రశ్నపత్రాలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చేటప్పుడు, అదేవిధంగా జవాబు పత్రాలను డిపాజిట్ చేసేటప్పుడు తప్పనిసరిగా పోలీస్ బందోబస్తు మధ్యనే తరలించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ అజీమ్, ఎంఈవోలు రఘుపతి, బన్నాజీ, శ్రీనివాస్ దీక్షిత తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెరువులకు చెర !
[ 27-03-2024]
కరీంనగర్కు ఆనుకుని ఉన్న తీగలగుట్టపల్లి, ఆరెపల్లి సమీపంలోని ఓ రెండు కుంటలు కాలక్రమేణా కనుమరుగై పోయాయి. -
హనుమాన్ జయంతికి ప్రత్యేక ఏర్పాట్లు
[ 27-03-2024]
వచ్చే నెల 23న కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. -
ఎంపీగా గెలిపిస్తే దిల్లీకి రైలు
[ 27-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపిస్తే జగిత్యాల-దిల్లీ మధ్య రైలుమార్గం వేయిస్తానని శాసనమండలి సభ్యుడు టి.జీవన్రెడ్డి అన్నారు. -
ఈ సారైనా వరదముప్పు తొలగేనా!
[ 27-03-2024]
కోరుట్ల పట్టణంలోని 10, 11 వార్డుల గుండా ప్రవహించే మద్దుల చెరువు కాలువ ఆక్రమణకు గురికావడంతో ఏటా వర్షాకాలంలో రోజుల తరబడి వరదలు కాలనీలను ముంచెత్తున్నాయి -
మండుతున్న ఎండ
[ 27-03-2024]
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ను దాటగా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 31.5 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావటంతో అన్ని ప్రాంతాల్లోనూ వేడిమి, ఉక్కపోత వాతావరణం ఒక్కసారిగా పెరిగింది. -
ఆదర్శం.. ఈ పఠనాలయం
[ 27-03-2024]
చొప్పదండిలోని శాఖా గ్రంథాలయం జిల్లా కేంద్రానికి దీటుగా పని చేస్తూ అందరి మన్ననలు పొందుతోంది. నిరుద్యోగులకు అన్ని రకాల వసతులు కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది -
లహరి బస్సులకు ఆదరణ
[ 27-03-2024]
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆర్టీసీ ముందుకెళ్తోంది. ప్రైవేటు రవాణా రంగంతోపాటు పోటీపడి అధునాతన బస్సులు తీసుకొస్తోంది -
ఠాణాలో నారసింహుడికి పూజలు
[ 27-03-2024]
నేరస్తులో, నేర చరితులో, ఫిర్యాదుదారులో, పైరవీకారులో సాధారణంగా ఉండే పోలీసుస్టేషన్లో అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పరివార సమేతంగా వెళ్లి పూజలందుకున్నారు. -
కాంగ్రెస్, భారాస కుమ్మక్కు
[ 27-03-2024]
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ సర్వే చూసినా కరీంనగర్ లోక్సభ స్థానంలో భాజపా భారీ మెజార్టీతో గెలుస్తుందని చెబుతున్నాయని, కాంగ్రెస్, భారాస కుమ్మకై తనను ఓడించేందుకు కుట్ర చేస్తున్నాయని ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్కుమార్ అన్నారు. -
హత్య కేసులో నిందితుడికి రిమాండ్
[ 27-03-2024]
ఈనెల 17న మల్యాల మండలం మ్యాడంపల్లి శివారులో జరిగిన వివాహిత కరిపె అంజలి(22)ని హత్య చేసిన సంఘటనలో నిందితుడు కొల్లూరి నరేష్ను మంగళవారం అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. -
నేటి నుంచి శివ కల్యాణోత్సవం
[ 27-03-2024]
ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో బుధవారం నుంచి ఈ నెల 31 వరకు శివ కల్యాణోత్సవం జరుగనుంది -
ఇసుక అక్రమ రవాణాపై పటిష్ఠ నిఘా
[ 27-03-2024]
ఇసుక అక్రమ రవాణాపై నిఘా పటిష్ఠం చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ సూచించారు. మంగళవారం ఆయన సమీకృత పాలనా ప్రాంగణంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 26 ఇసుక రీచ్లుండగా టీఎస్ఎండీసీ పరిధిలో 18 చోట్ల తవ్వకాలు చేపడుతున్నారని వెల్లడించారు. -
ఎన్నికల సమరం.. నిఘా నిరంతరం
[ 27-03-2024]
జిల్లాలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా నిఘా వ్యవస్థను పటిష్ఠం చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరిన భారాస నేతలు, కార్యకర్తలు
-
నవనీత్ రాణాకు భాజపా టికెట్ .. ఆ సీటు నుంచే బరిలోకి..
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
-
హైదరాబాద్ సంచలనం.. ఐపీఎల్ రికార్డు బద్దలు
-
తెదేపా అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన స్థానాలివే!