ఎండుతున్న పంటలకు జీవం
పెరుగుతున్న ఎండలు... పడిపోతున్న భూగర్భ జలాలతో పంట చేతికి రాక ముందే ఎండిపోతాయేమోనని అన్నదాతలు దిగులు చెందుతున్న తరణంలో ఎల్లంపల్లి నీరు విడుదల చేయడంతో ఊరట లభించింది.
ఎల్లంపల్లి నీరు రావడంతో అన్నదాతకు ఊరట
న్యూస్టుడే, రుద్రంగి
రుద్రంగిలో నీరు లేక ఎండుతున్న వరి పైరు
పెరుగుతున్న ఎండలు... పడిపోతున్న భూగర్భ జలాలతో పంట చేతికి రాక ముందే ఎండిపోతాయేమోనని అన్నదాతలు దిగులు చెందుతున్న తరణంలో ఎల్లంపల్లి నీరు విడుదల చేయడంతో ఊరట లభించింది. మార్చి మొదటి వారంలోపే సాగు నీరు విడుదల చేస్తే కనీసం మరో 500 ఎకరాల్లోని పంటలు ఎండిపోకుండా కాపాడుకునే అవకాశం ఉండేది. కాస్త ఆలస్యమైనా మండలంలోని మెట్ట గ్రామాలకు నీరు చేరుకోవడంతో ఎండిపోయే దశలో ఉన్న పంటలకు ఊపిరి పోసినట్లైందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నర్సింగాపూర్ కాలువలో ప్రవహిస్తున్న ఎల్లంపల్లి జలాలు
చందుర్తి మండలంలో ఈ యాసంగిలో వరి పంటను సుమారు 14 వేల ఎకరాల్లో సాగు చేశారు. నాట్లు వేసిన డిసెంబర్, జనవరి నెలల్లో బావులు, బోరుబావుల్లో పుష్కలంగా జలాలు ఉండటంతో పంటలకు ఈ ఏడాది ఇబ్బందులుండవని భావించారు. సాగు నీటి ఎద్దడి ప్రారంభమయ్యే మార్చి నెల ప్రారంభం నాటికి ఎల్లంపల్లి నీరు మండలంలోని అన్ని గ్రామాలకు చేరుతాయని ఆశించారు. అయితే మార్చి ప్రారంభం నాటికి కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నారాయణపూర్ చెరువులోకి నంది మేడారం పంపుహౌజ్ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు మోటార్లను ప్రారంభించారు. పంపులకు ఉన్న గేట్వాల్వ్లో సమస్య ఏర్పడంతో నంది మేడారం పంపుహౌజ్లోని మోటార్లు మునిగిపోయాయి. పది రోజుల్లో మరమ్మతులు చేసి మళ్లీ మోటార్లను ప్రారంభించారు. దీంతో ఎల్లంపల్లి నీరు చందుర్తికి వరకు వచ్చేందుకు సమయం ఎక్కువగా పట్టిందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఎల్లంపల్లి కాలువలకు దగ్గర్లో ఉన్న రైతులు కాలువల్లో మోటార్లను ఏర్పాటు చేసుకుని పైప్లైన్లను వేసుకుని పంటలకు నీటిని అందిస్తున్నారు. దీంతో పంటపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రుద్రంగికి ఎప్పుడు?
చందుర్తి మండలం వరకు వచ్చిన ఎల్లంపల్లి జలాలు రుద్రంగి మండలానికి మాత్రం చేరుకోలేదు. చందుర్తి మండలం లింగంపేటలో ఉన్న పైప్లైన్ మరమ్మతులకు గురికావడంతో రుద్రంగికి నీరు ఎత్తిపోసే పరిస్థితి లేదు. మరో వైపు పైప్లైన్ సమస్యతో పాటు రుద్రంగిలోని నాగారం చెరువులోకి ఎల్లంపల్లి నీళ్లను తీసుకువెళ్లే మాటు కాలువ మూడు ప్రాంతాల్లో గతేడాది కురిసిన వర్షాల కారణంగా ధ్వంసమైంది. వీటికి మరమ్మతులు చేయాల్సిన అధికారులు కనీసం ధ్వంసమైన కాలువ వైపు వెళ్లి చూడట్లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ యాసంగిలో రుద్రంగి మండల కేంద్రంలో వరి పంట సుమారు 3 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఇందులో సాగు నీటి కొరత కారణంగా సమీపంలోని చెరువులు, కుంటల్లో మోటార్లు పెట్టి, వందల మీటర్ల పొడవునా పైప్లైన్లు ఏర్పాటు చేసుకుని పంటలకు అందిస్తున్నారు. దీనికి ఒక్కో రైతు రూ.50 వేల పైనే వ్యయాన్ని చేస్తున్నారు. మరికొందరు సమీపంలోని బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉన్న రైతులకు డబ్బులు చెల్లించి పంటలను కాపాడుకుంటున్నారు. ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి రుద్రంగికి వచ్చే పైప్లైన్, మాటు కాలువకు మరమ్మతులు చేయించేందుకు చర్యలు చేపట్టాలని కర్షకులు కోరుతున్నారు.
ఇప్పటికే ఎకరం ఎండిపోయింది
లోలపు చంద్రమోహన్, రైతు, నర్సింగాపూర్
నేను ఈ యాసంగిలో మూడు ఎకరాల్లో వరి సాగు చేశాను. మార్చి ప్రారంభం నుంచి సాగు నీటి కొరత ఏర్పడింది. ఇప్పటికే ఎకరం మేర ఎండిపోగా ప్రస్తుతం వస్తున్న ఎల్లంపల్లి కాలువ నీటితో రెండు ఎకరాల్లోని పంటను రక్షించుకోగలిగాను. లేదంటే మొత్తం పంట ఎండిపోయేది.
సమస్య తీవ్రమైన సమయంలో...
బొజ్జ లింగయ్య, రైతు, ఆశిరెడ్డిపల్లె
నాకున్న నాలుగు ఎకరాల్లో వరి పంట వేశాను. ప్రస్తుతం గింజ తయారయ్యే దశలో ఉంది. ఇలాంటి తరుణంలోనే సాగునీటి సమస్య తీవ్రమైంది. పంటలను ఎలా రక్షించుకోవాలో అర్థం కాని సమయంలో ఎల్లంపల్లి నీళ్లు వచ్చాయి. సరైన సమయంలో రాకపోతే కనీసం రెండు ఎకరాల్లోని పంట ఎండిపోయేది.
పైప్లైన్, కాలువలకు మరమ్మతులు చేయాలి
బండారు మహేశ్, రైతు, రుద్రంగి
నేను ఈ యాసంగిలో ఏడు ఎకరాల్లో వరి పంట సాగు చేశాను. నా సొంత పొలం నాలుగు ఎకరాల్లో సాగునీటి కొరత లేకపోయినా కౌలు చేస్తున్న మూడు ఎకరాలకు నీటి కొరత తీవ్రంగా ఉంది. పక్కనున్న మరో రైతుకు రూ.10 వేలు ఇచ్చి అతని బోరుబావి నీటితో పంటకు నీరు అందిస్తున్నాను. రుద్రంగికి కూడా ఎల్లంపల్లి నీరు వస్తే ఈ ఇక్కట్లు తప్పేవి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
మలేరియా నిర్మూలనకు కృషి
[ 26-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకుని గురువారం జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని