అక్రమాలకు సహకరించాలంటూ ఒత్తిడి!
అక్రమాలకు సహకరించాలంటూ అధికారులపై కొందరు ప్రజాప్రతినిధుల ఒత్తిడి. నిబంధనలు పక్కన పెట్టి పనులు చేయాలని వేధింపులు. ఇలా రామగుండం నగరపాలికలో అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికారుల ససేమిరా?
న్యూస్టుడే, గోదావరిఖని: అక్రమాలకు సహకరించాలంటూ అధికారులపై కొందరు ప్రజాప్రతినిధుల ఒత్తిడి. నిబంధనలు పక్కన పెట్టి పనులు చేయాలని వేధింపులు. ఇలా రామగుండం నగరపాలికలో అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత కాలంగా అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సాగుతున్న ఈ వ్యవహారం అదనపు పాలనాధికారి వద్దకు చేరింది. స్వయంగా ఆయన సమక్షంలోనే ఇరు వర్గాలతో మూడు రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. ఓ ప్రజాప్రతినిధి నగరపాలక వాహనాలు పక్కన పెట్టి తనకు సంబంధించిన వాటిని వినియోగించాలని అందులో ప్రస్తావించినట్లు తెలిసింది. దీంతో పాటు తనకు రావాల్సిన ఆదాయ వనరుల విషయాన్ని సైతం వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నగరపాలికలో వినియోగిస్తున్న చెత్త ట్రాక్టర్లు, ట్రాలీలతో పాటు నీటి ట్యాంకర్లను జీపీఎస్ విధానంతో నిర్వహిస్తున్నారు. వాహనం ప్రారంభమైనప్పటి నుంచి వెళ్లిన ప్రదేశాలు, ఎన్ని కిలోమీటర్ల పరిధిలో వాహనం తిరిగిందన్న విషయం పక్కాగా తెలుస్తుంది. గతంలో జీపీఎస్ విధానం లేని సమయంలో వాహనాలు ఎక్కడ తిరుగుతున్నాయి. ఎంతదూరం వెళ్లాయన్న విషయంలో లెక్కలు లేకపోవడంతో డీజిల్ వాడకం ఇష్టారాజ్యంగా జరిగిందన్న ఆరోపణలున్నాయి. డీజిల్ వినియోగంలో గతంలో భారీగా అక్రమాలు వెలుగు చూశాయి. కార్పొరేషన్ వాహనాల పేరు మీద ఇతరులు సైతం తమ వాహనాల్లో ఇంధనాన్ని నింపుకునే వారనే విమర్శలున్నాయి. దీంతో నగరపాలక సంస్థకు డీజిల్ బిల్లులు భారీ మొత్తంలో వచ్చేవి. ప్రస్తుతం ఏ వాహనంలో ఎంత డీజిల్ పోస్తున్నారు. అది ఎన్ని కిలోమీటర్ల దూరం తిరిగింది అన్న సమాచారం పక్కాగా ఉండటంతో అక్రమాలకు అవకాశం లేకుండా పోయింది. అయినా ఓ ముఖ్య ప్రజాప్రతినిధి తన వాహనాలకు డీజిల్ పోయాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అధికారులు ఈ విషయాన్ని జిల్లా అదనపు పాలనాధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీనిపై ఇరు పక్షాలతో నిర్వహించిన సమావేశంలో ఆ ప్రజాప్రతినిధి మళ్లీ అదే విషయాన్ని ప్రస్తావించగా అధికారులు వ్యతిరేకించినట్లు సమాచారం.
అభివృద్ధి పనుల్లో...
కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని పనులను నిబంధనలకు విరుద్ధంగా కేటాయించాలని పలువురు ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. ఇప్పటికే నగరపాలిక ఆధ్వర్యంలో చేపడుతున్న పనులపై విజిలెన్సుకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ పనుల విషయం తమకు ఎక్కడ చుట్టుకుంటుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిబంధనలకు విరుద్ధంగా పనిచేయలేమని, తమపై ఒత్తిడి లేకుండా చూడాలని ఉన్నతాధికారికి విన్నవించుకున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పత్తి రైతులు, వ్యాపారుల ఆందోళన
[ 23-04-2024]
ఎన్నికల కోడ్ పేరుతో తనిఖీలు నిర్వహించి బ్యాంకుల నుంచి డబ్బును తీసుకొస్తున్న తమను ఇబ్బందులకు గురి చేయవద్దని జమ్మికుంట పత్తి మార్కెట్ వద్ద వ్యాపారులు, పత్తి రైతులు ఆందోళనకు దిగారు. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
[ 23-04-2024]
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
పిల్లల అల్లరిని దారి మళ్లించండి
[ 23-04-2024]
పది నెలలపాటు చదువుతో కుస్తీ పడిన పిల్లలకు వేసవి సెలవులు ఉపశమనం ఇస్తాయి. ఆటాపాటలతో సరదాగా గడపొచ్చని భావిస్తుంటారు. -
మోదీ వ్యాఖ్యల్లో ఓటమి భయం
[ 23-04-2024]
లోక్సభ మొదటి దశ ఎన్నికల తీరును చూసిన ప్రధాని మోదీ ఓటమి భయంతో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తుందని వ్యాఖ్యానించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. -
నాలుగో రోజు 25 నామినేషన్లు
[ 23-04-2024]
నామినేషన్ల ప్రక్రియ నాలుగో రోజు సోమవారం కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. -
హామీలను విస్మరించిన ప్రభుత్వం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని కరీంనగర్ భారాస అభ్యర్థి వినోద్కుమార్ అన్నారు. -
సెప్టెంబరులో చక్కెర కర్మాగారం తెరిపిస్తాం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా!
[ 23-04-2024]
ప్రాంతానికి కొత్త కావచ్చు, రాజకీయాలకు, ప్రజా సేవకు కొత్తకాదని, అవకాశమిస్తే పార్లమెంట్ పరిధిని అభివృద్ధి చేసి చూపిస్తానని నిజామాబాద్ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. -
దారులన్నీ కొండగట్టుకే
[ 23-04-2024]
తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి దీక్షాపరులు తరలివస్తున్నారు. -
ఓటరు నమోదులో ఫలించిన చైతన్యం
[ 23-04-2024]
ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కు నమోదుకు యువతలో నూతనోత్సాహం ఉరకలేసింది. -
ప్రత్యేక నిధులు.. తీరనున్న ఇక్కట్లు
[ 23-04-2024]
రామగుండం నగరపాలక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అమృత్-2.0, యు.ఐ.డి.ఎఫ్.(అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్) నిధులతో పరిష్కారం కానున్నాయి. -
కాంగ్రెస్ నైజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
[ 23-04-2024]
భారాస పాలనలోనే అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ ఫలాలు అందుకున్నారని, గడిచిన నాలుగు నెలల కాలంలో సంక్షేమ పథకాలను అటకెక్కించిన కాంగ్రెస్ పాలకుల నైజాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పెద్దపల్లి లోక్సభ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. -
లెక్కలు తేలేనా?
[ 23-04-2024]
జిల్లా వస్త్ర పరిశ్రమకు గత ప్రభుత్వం సంక్షేమ, పాఠశాల విద్యాశాఖలకు సంబంధించిన వస్త్రోత్పత్తుల ఆర్డర్లు ఇచ్చింది. -
నిధులున్నా ప్రారంభం కాని పనులు
[ 23-04-2024]
గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు రవాణా వ్యవస్థ మెరుగుపరిచి రెండు జిల్లాల గ్రామాలను అనుసంధానం చేయాలనే లక్ష్యంతో తారు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
అమాత్యులుగా ఆ నలుగురు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి లోక్సభా నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఎంపీల్లో ఇప్పటివరకు నలుగురికి మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!