ఈత సాగు.. ఉపాధి బాగు
జగిత్యాల జిల్లాలో ఈత వనం సాగు చేపట్టి మంచి ఫలితాలు పొందుతున్నారు. సూక్ష్మ సేద్యం పద్ధతిలో చేపట్టిన సాగు తక్కువ కాలంలోనే గీతకు రావడమే కాకుండా గీత కార్మికులు ఈత నీరా ఉత్పత్తి చేస్తూ ఉపాధి పొందుతున్నారు.
అంతర్గాంలో 5 వేల మొక్కల పెంపకం
సూక్ష్మ సేద్యం పద్ధతిలో నాటిన ఈత మొక్కలు
న్యూస్టుడే జగిత్యాల గ్రామీణం: జగిత్యాల జిల్లాలో ఈత వనం సాగు చేపట్టి మంచి ఫలితాలు పొందుతున్నారు. సూక్ష్మ సేద్యం పద్ధతిలో చేపట్టిన సాగు తక్కువ కాలంలోనే గీతకు రావడమే కాకుండా గీత కార్మికులు ఈత నీరా ఉత్పత్తి చేస్తూ ఉపాధి పొందుతున్నారు. జగిత్యాల గ్రామీణ మండలం అంతర్గాంలో చేపట్టిన ఈత సాగు ద్వారా వంద కుటుంబాలకు ఉపాధి లభిస్తోంది.
జగిత్యాల జిల్లా అంతర్గాం గ్రామ గీత కార్మికులు ఈత సాగు ద్వారా రెండేళ్లుగా నీరా తయారుచేస్తూ ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకున్నారు. ఆరేళ్ల కిందట ఐదు ఎకరాల్లో 5 వేల ఈత మొక్కలను ప్రభుత్వ పథకం ద్వారా నాటి సూక్ష్మ సేద్యం పద్ధతిలో సాగు చేపట్టారు. పదేళ్లకు గీతకు వచ్చే చెట్లు బిందుసేద్య పద్దతిలో ఎరువులు, నీళ్లు నిత్యం అందించడంతో నాలుగేళ్లకే గీతకు వచ్చాయి. దీంతో రెండేళ్లుగా కల్లుగీస్తూ సమీపంలోనే జగిత్యాల పట్టణ వాసులకు నీరా, కల్లును విక్రయిస్తున్నారు. గతంలో ఉపాధి లేక గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికులు గ్రామానికి తిరిగివచ్చి గ్రామంలోనే ఉపాధి పొందుతున్నారు. ఈత వనం సాగు కోసం స్థానిక నాయకులు మాకునూరి జితేందర్రావు బీజం పోయగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ సహకారం అందించారు. ఫలితంగా గ్రామంలో వందకు పైగా కుటుంబాలు రోజూ రూ.2 నుంచి రూ.3 వేల వరకు సంపాదిస్తున్నారు.
నీరాకేఫ్ ఏర్పాటుకు సన్నాహాలు
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో నీరా కేఫ్ ఏర్పాటు చేయడంతో మంచి ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో స్థానికంగా అంతర్గాంలోనే నీరా కేఫ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు గీత కార్మిక సంఘ అధ్యక్షుడు గొడిసెల బాలు అన్నారు. ఇప్పటికే షెడ్డు నిర్మాణం జరగగా కేఫ్ను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్ది పట్టణ వాసులు ఇక్కడికి వచ్చి నీరా తాగి వెళ్లేలాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాత్రివేళ సేద తీరేందుకు భారీ హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఇందుకోసం గత కలెక్టర్ రూ.3 లక్షలను మంజూరు చేయడంతో పనులు జరుగుతున్నాయని, మోడల్ నీరా కేఫ్గా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
మండల స్థాయిలో..
-బాలు, గౌడ సంఘ అధ్యక్షుడు
నీరా కేఫ్లను హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్రంలో జిల్లా నుంచి మండల స్థాయి వరకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. దీని ద్వారా గీత కార్మికులకు ఉపాధి లభిస్తుంది. చాలా మంది గీత కార్మికులకు ఉపాధి లేక వృత్తిని వదులుకొని విదేశాలకు వెళ్లి పనిచేస్తున్నారు. మండల స్థాయిలో నీరా కేఫ్లను ఏర్పాటు చేస్తే గీత కార్మికులకు ఉపాధి లభిస్తుంది.
ప్రభుత్వం సాయం అందించాలి
-శ్రీనివాస్ గౌడ సంఘ ఉపాధ్యక్షుడు
ప్రభుత్వం 5 వేల మొక్కలు ఇవ్వడంతో అవి ఇప్పుడు గీతకి వచ్చాయి. నీరాను తీసి పట్టణాలకు పంపిణీ చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం నీరా కేఫ్ ఏర్పాట్లలో ఉన్నాం. ప్రభుత్వ సహకారంతో మరింత అభివృద్ధి సాధ్యం అవుతుంది. ప్రభుత్వం సహాయం చేస్తే చుట్టుపక్కల జిల్లాలకు, మండలాలకు నీరాని అందిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి నుంచే ఓటింగ్పై అధికారులకు శిక్షణ
[ 20-04-2024]
ఇంటినుంచే ఓటింగ్పై పాటించాల్సిన నిబంధనలపై అధికారులకు మంథని శాసనసభ సెగ్మెంట్ అధికారి హనుమనాయక్ అవగాహన కల్పించారు. శుక్రవారం మంథని ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులకు శిక్షణ ఇచ్చారు. -
అడుగడుగునా తనిఖీలతో ప్రలోభాలకు అడ్డుకట్ట
[ 20-04-2024]
ఎన్నికల్లో డబ్బు, మద్యం, మాదకద్రవ్యాల పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. లోక్సభ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో జిల్లా సరిహద్దు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
పెరుగుతున్న పసిడి ధరలు... తగ్గుతున్న వ్యాపారం
[ 20-04-2024]
బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకి వెళుతున్నాయి. గతంలో పెళ్లి ముహూర్తాల సమయంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టేవి. దీనికి భిన్నంగా మార్కెట్లో ప్రస్తుతం పసిడి ధర పది గ్రాములు(తులం) రూ.76,000 వరకు పలుకుతోంది. -
కిట్టు సరే.. పరీక్ష చేసేవారేరీ?
[ 20-04-2024]
కలుషిత నీటితో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో ప్రజలకు శుద్ధ జలం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అక్కడక్కడ పైపులు పగిలి లీకేజీతో కలుషితమైన నీరు సరఫరా అయ్యే అవకాశం ఉంది. -
ఆరేళ్లుగా ఉపాధి కరవు
[ 20-04-2024]
వలసల నివారణకు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల కోసం ఆరేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఆ కుటుంబాలకు పనులు కల్పించడం లేదు. -
ప్రజలు మళ్లీ మోసపోవద్దు
[ 20-04-2024]
భాజపా అభ్యర్థి అర్వింద్ రాముడి పేరుతో రాజకీయం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. పొద్దునలేస్తే హిందూ-ముస్లిం, పాకిస్థాన్-ఇండియా, రోహింగ్యాంటూ మాటలు చెప్పడమే గాని ఎంపీగా ప్రజలకు చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. -
‘పసుపు బోర్డు పేరుతో మోసం’
[ 20-04-2024]
పసుపు బోర్డు పేరుతో ఎంపీ ధర్మపురి అర్వింద్ రైతులను మోసం చేశారని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు కూడా మభ్యపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్